Telangana

News August 23, 2024

మంచిర్యాల: అమాత్య యోగం ఎవరికో..?

image

MNCL: రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకు చోటు దక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 4 సీట్లు కైవసం చేసుకుంది. దీంతో నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అందులో ఎమ్మెల్యేలు, వారి అనుచరగణం మంత్రి పదవి తమకే వస్తుందనే ధీమాతో ఉన్నారు. కష్టపడి పని చేసే వారికి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ క్యాడర్ నుంచి అభిప్రాయాలు వినిపిస్తుంది.

News August 23, 2024

HYD: డీజీపీని కలిసిన మహిళా జర్నలిస్టులు 

image

HYDలోని తెలంగాణ డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను ఈరోజు మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి కలిశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ అయ్యిందా లేదా అని రైతులను అడిగేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వారు ఈ ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు.

News August 23, 2024

HYD: మంత్రి కోమటిరెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ

image

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని HYD బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో కలిశారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు మంత్రిని కలిసిన మందకృష్ణ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మోత్కుపల్లి, MLAలు అడ్లూరి లక్ష్మణ్, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య ఉన్నారు.

News August 23, 2024

HYD: మంత్రి కోమటిరెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ

image

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని HYD బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో కలిశారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు మంత్రిని కలిసిన మందకృష్ణ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మోత్కుపల్లి, MLAలు అడ్లూరి లక్ష్మణ్, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య ఉన్నారు.

News August 23, 2024

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి: సీపీ

image

మహిళలు, చిన్నారుల భద్రతకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేరాల నియంత్రణకు ఉన్నతాధికారులు సైతం రాత్రుళ్లు పెట్రోలింగ్‌ నిర్వహిస్తు కింది స్థాయి సిబ్బంది పనితీరు పర్యవేక్షించాలని సీపీ తెలిపారు.

News August 23, 2024

వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ ధర నిన్న రూ.5,850 పలకగా.. నేడు రూ.5910 పలికింది. నిన్న పచ్చి పల్లికాయ ధర రూ.4,250 ఉంటే.. నేడు రూ.3,900కి పడిపోయింది. మరోవైపు 5531 రకం మిర్చికి నిన్న రూ.12 వేల ధర రాగా, నేడు రూ. 500 పెరిగి, రూ.12,500 అయినట్లు వ్యాపారులు తెలిపారు.

News August 23, 2024

ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలే: CP

image

U/S 163 BNSS ప్రకారం ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హెచ్చరించారు. రేపు ఛలో ఆర్మూర్ పేరిట రైతుల ఆందోళన నేపథ్యంలో CP శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆర్మూర్ డివిజన్ పరిధిలో సంబంధిత అధికారి నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే ప్రజలు ఏదైనా చట్టబద్ధమైన సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఈ ఉత్తర్వులు 25వ తేదీ ఉదయం వరకు అమల్లో ఉంటాయన్నారు.

News August 23, 2024

WGL: కొడుకు శవాన్ని చూసి.. తల్లి మృతి

image

కుమారుడు మృతిని తట్టుకోలేక పెంపుడు తల్లి మరణించిన ఘటన మహబూబాబాద్‌లో కంటతడి పెట్టించింది. స్థానికుల వివరాల ప్రకారం.. మున్సిపాలిటీలోని శనిగపురంలో మంద రవి(30) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. మృతిచెందాడు. కాగా అతని మృతదేహాన్ని చూసిన పెంపుడు తల్లి జ్యోతి గుండెపోటుతో మృతిచెందారు. తల్లి, కుమారుడు మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 23, 2024

HYDలో హత్యకు గురైన ఎర్రుపాలెం యువకుడు

image

ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంకి చెందిన ఓ యువకుడు HYDలో దారుణ హత్యకు గురయ్యాడు. యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్‌ను దుండగులు హత్య చేశారు. HYDబాలాపూర్‌లో మండి 37 హోటల్ వద్ద ప్రశాంత్‌ను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. కాగా హత్య చేసి పరారైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లి గుండెలు పగిలేలా రోదించింది.

News August 23, 2024

వరంగల్ మార్కెట్లో క్వింటా మక్కలు రూ.2,805

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కలకు అధిక ధర పలుకుతూనే ఉంది. మొన్న క్వింటా మక్కలు రూ.2,805 పలకగా.. గురువారం రూ.2,820 పలికి రికార్డు నమోదు చేసింది. అయితే ఈరోజు మళ్లీ స్వల్పంగా తగ్గి, రూ.2,805కి చేరిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా, మార్కెట్‌కు మొక్కజొన్న తీసుకొచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.