India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రస్తుత వర్షాకాలం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి 165.375 మిలియన్ యూనిట్లకు చేరింది. ప్రాజెక్టు నుంచి వరదనీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో ఎగువన ఐదు యూనిట్ల ద్వారా 4.305, దిగువన ఆరు యూనిట్ల ద్వారా 4.583 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. గురువారం నాటికి ఎగువన 94.563, దిగువన 70.812 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని చేపట్టామని అధికారులు తెలిపారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24, 25 తేదీలు వారాంతపు సెలవులు కాగా, 26న కృష్ణాష్టమి సందర్భంగా సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. తిరిగి ఈనెల 27 నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని పేర్కొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు కారణాలతో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. మద్యానికి బానిసై తాండూరు పరిధికి చెందిన రాజు(40).. అనారోగ్య సమస్యలతో హుస్నాబాద్కు చెందిన రాజిరెడ్డి(65) ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే క్రమంలో భార్య కాపురానికి రావడం లేదని మిరిదొడ్డి మండలానికి చెందిన చంద్రం(30).. మెదక్ జిల్లా శివ్వంపేటకు చెందిన జగదీశ్రెడ్డి(24) మిత్రులకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.
విపత్తుల సమయంలో బాధితులకు సాయం అందించడం సవాళ్లతో కూడుకున్న పని, చాలాసార్లు హెలికాప్టర్ వెళ్లలేని ప్రాంతాలు సైతం ఉంటాయి. ఇలాంటి పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు ఐఐటీ హైదరాబాద్ చేపట్టిన డ్రోన్ల తయారీ ప్రాజెక్టు తుది దశకు చేరింది. ఇప్పటికే 60 కిలోల బరువు తీసుకువెళ్లే డ్రోన్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా 100 కిలోల బరువును అవలీలగా తరలించే ప్రాజెక్టు ప్రయోగ దశలో ఉంది.
ద్విచక్ర వాహనంను తప్పించబోయి కారు ఒక వ్యక్తిని ఢీకొన్న ఘటన అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి శివారులో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. బాలరాజు(32) అనే వ్యక్తి చెన్నారం వైపుకు వెళ్తుండగా, సందీప్ అనే వ్యక్తి తన కుటుంబంతో కారులో వస్తున్నాడు. ఈ క్రమంలో కారు ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి బాలరాజును ఢీకొట్టగా అతను అక్కడే చనిపోయాడని తెలిపారు. అతడికి పెళ్లై ఆరు నెలలే అయిందన్నారు.
RTC బస్సు ఢీకొని పెద్దపల్లి జిల్లా ఓదెలలో సింగరేణి ఉద్యోగి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కు చెందిన రంజిత్కుమార్(39)కు 14 ఏళ్ల క్రితం ఓదెలకు చెందిన రజితతో పెళ్లయింది. వారికి నెల క్రితమే ఓ బాబు పుట్టాడు. అయితే సుల్తానాబాద్లో ఓ శుభకార్యానికి హాజరై.. అత్తగారింటి వద్ద ఉన్న భార్య, కొడుకును చూడటానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొని మృతి చెందాడు.
ఈ నెల 21న నిజామాబాద్లోని ఆనంద్నగర్ కాలనీలో మూడేళ్ల చిన్నారి అనన్య మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా గత మూడేళ్లలో కాలువలో పడి మృతి చెందిన వారి సంఖ్య మూడుకి చేరింది. 2023లో గౌతంనగర్లో 70 ఏళ్ల వృద్ధురాలు, 2022లో అదే కాలనీకి చెందిన 8 ఏళ్ల బాలుడు మురుగు కాలువలో పడి మృతి చెందాడు.
మద్యం తాగి వాహనం నడిపిన కేసుల్లో 8 మంది వాహనదారులకు వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గుర్రపు వీరస్వామి జరిమానా విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ గురువారం తెలిపారు. అలాగే మద్యం తాగి వాహనం నడిపి ట్రాఫిక్ పోలీసులకు పట్టుపడ్డ 8 మంది వాహనదారులకు రూ.17,800 జరిమానా విధించారు.
∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ల సమీక్ష సమావేశం
∆} వైరాలో వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పర్యటన
∆} ముదిగొండలో ఇంటింటి ఓటర్ సర్వే
తల్లి మృతిని తట్టుకోలేక కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన టేక్మాల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పాపన్నపేట ASI సంగన్న వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్నకూతురు(14) 8వ తరగది చదుతోంది. కాగా, 9నెలల క్రితం తల్లి అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుంచి తల్లిని గుర్తు చేసుకుంటూ బాధపడుతుండేది. బుధవారం మనస్తాపానికి గురై ఉరేసుకుంది. గురువారం తండ్రి ఫిర్యాదులో కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.