India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రేమించిన యువతి నిరాకరించిందని యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఇందల్వాయి మండలం సిర్నాపల్లి చెందిన 21 ఏళ్ల యువకుడు ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 10న పురుగుల మందు తగగా NZBలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
ఉమ్మడి జిల్లాలో 10 రూపాయల నాణేల చలామణిలో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఈ నాణేలు చెల్లవంటూ.. కొందరు తప్పుడు ప్రచారం చేస్తుండడంతో వీటిని తీసుకోవడానికి, చెలామణి చేయడానికి జనాలు ఆసక్తి చూపడం లేదు. సరుకుల కొనుగోళ్ల సమయంలో చిల్లర కోసం దుకాణదారులు రూ.10 నోట్లకు బదులు నాణేలను ఇస్తే వాటిని తీసుకునేందుకు చాలామంది నిరాకరిస్తున్నారు. అధికారులు స్పందించి దీనిపై వివరణ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం రూ.2,590 పలికిన మక్కలు (బిల్టీ) నేడు రూ.2,575కి చేరింది. గత వారం ఊహించని స్థాయిలో రికార్డు ధర పలికిన మక్కలు క్రమంగా పతనమవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ధరలు పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కరీంనగర్ నగరంలోని మంకమ్మతోటకు చెందిన 9వ తరగతి విద్యార్థులు గొప్ప మనసు చాటుకున్నారు. పుప్పాల రిషికేష్, గంగిపల్లి రక్షిత్, నేరేడుకొమ్మ చంద్ర సాయి, కోతిరెడ్డి అనిరుధ్రెడ్డి మిత్రులు కలిసి కాలనీలో మొదటిసారి వినాయకుడిని ప్రతిష్ఠించారు. 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి, నిమజ్జనం చేశారు. అయితే చందా ద్వారా వచ్చిన డబ్బులు మిగిలాయి. వాటితో 32 మంది పేద విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయుష్ ఆరోగ్య కేంద్రాల్లో యోగా శిక్షకుల నియామకం చేపడుతున్నట్లు ప్రాంతీయ ఆయుష్ శాఖ ఆర్ డీడీ ప్రమీలాదేవి, ఆయుష్ జిల్లా ఇన్ఛార్జి డా.తనుజారాణి తెలిపారు. యోగా టీచర్ల నియామాకానికి ఈ నెల 27న వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో ఉదయం 10 గంటలకు ముఖాముఖి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు ఆయుష్మాన్ ఆర్డీడీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి నిన్న క్వింటా మిర్చి రూ.16,000 ఉండగా నేడు రూ.16,500 ధర పలికింది. అలాగే తేజ మిర్చి నిన్న రూ.18,800 ధర పలకగా నేడు రూ. 18,400 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి నిన్నటిలాగే నేడు రూ.16 వేలు వచ్చింది. టమాటా మిర్చికి సైతం నిన్నటిలాగే రూ.25 వేల ధర పలికిందని వ్యాపారులు తెలిపారు.
అక్టోబర్ 3-12వ తేది వరకు అలంపూర్ జోగుళాంబ ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, అడిషనల్ డీజీపి మహేశ్ భగవత్, ఐజీ ఎం.రమేష్, ఎండోమెంట్ కమీషనర్ హనుమంతరావు, ఏపి జితేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ హాజరుకానున్నారు. ఈ మేరకు ఈఓ పురేందర్, ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు ఇచ్చారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కొద్ది రోజులుగా పత్తి ధరలు మళ్లీ తగ్గుతూ వస్తున్నాయి. గత శుక్రవారం క్వింటా పత్తి రూ.7,825 పలకగా, సోమవారం రూ.7,650 కి పడిపోయింది. నేడు మరింత తగ్గి రూ.7500కి చేరినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్ను బట్టి మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.
అమెరికా లాస్ వెగాస్లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మైనింగ్ ప్రదర్శన “MINExpo”ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధికారుల బృందం సందర్శించారు. ప్రపంచంలోని అతిపెద్ద మైనింగ్ పరికరాల తయారీదారుల సమ్మేళనం అయిన లాస్ వెగాస్లోని MINExpo వద్ద సెప్టెంబరు 24న మంగళవారం ఉపముఖ్యమంత్రి పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.
రైతు నేస్తానికి ఆదరణ కరవైంది. ప్రభుత్వం ప్రతి మంగళవారం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో వ్యవసాయ శాఖ ఉన్నతా ధికారులు, శాస్త్రవేత్తలు ముఖాముఖి నిర్వహించి సాగు విధానం, పంటల దిగుబడి, సస్యరక్షణ చర్యలపై సలహాలు, సూచనలు అందిస్తారు. చాలామందికి రుణమాఫీ కాకపోవడంతో రైతులు బ్యాంకులు, వ్యవ సాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో రైతు నేస్తానికి రాకపోగా అధికారులు మాత్రమే కనిపిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.