Telangana

News January 23, 2026

మెదక్: దుర్గం చెరువులో యువ వ్యాపారి డెడ్ బాడీ

image

మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కింద ఓ యువకుడి మృతదేహం లభ్యమవ్వడం కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని బయటకు తీశారు. మృతుడిని కేపీహెచ్‌బీ ప్రగతినగర్‌కు చెందిన కిరాణా వ్యాపారి నిమ్మల నరేశ్ (25)గా గుర్తించారు. ఇతని స్వగ్రామం మెదక్ జిల్లా శంకరంపేట మండలం కొత్తపేట అని పోలీసులు తెలిపారు. నరేశ్ మృతికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 23, 2026

నల్గొండ : M.B.A , M.C.A ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల..

image

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ ,ఎంసీఏ సెమిస్టర్-1 రెగ్యులర్ కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్. ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 23 మధ్య పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.

News January 23, 2026

ORRపైకి యువతీ యువకులు.. కిక్కు కోసం కాదు!

image

నగర Gen-Z రూటే సపరేటు. ‘మత్తు’ కిక్కు కంటే భక్తిలో వచ్చే ‘హై’కే వీరు ఫిదా అవుతున్నారు. ORR సోలార్ ట్రాక్‌లపై స్మార్ట్‌వాచ్‌లతో హార్ట్-రేట్ సింక్ చేస్తూ భజన పాటలకు రన్నింగ్ చేస్తున్నారు. కీర్తనలకు తగినట్టు SMలో AR ఎఫెక్ట్స్‌తో రీల్స్ చేస్తూ రచ్చ లేపుతున్నారు. IIIT-H, JNTU నుంచే వారానికి 7 వేల మంది గచ్చిబౌలి- నెక్లెస్ రోడ్ వరకు వెళ్తున్నారు. యువతలో ఒంటరితనాన్ని పోగొడుతూ, మహిళలకు భద్రతనిస్తోంది.

News January 23, 2026

ORRపైకి యువతీ యువకులు.. కిక్కు కోసం కాదు!

image

నగర Gen-Z రూటే సపరేటు. ‘మత్తు’ కిక్కు కంటే భక్తిలో వచ్చే ‘హై’కే వీరు ఫిదా అవుతున్నారు. ORR సోలార్ ట్రాక్‌లపై స్మార్ట్‌వాచ్‌లతో హార్ట్-రేట్ సింక్ చేస్తూ భజన పాటలకు రన్నింగ్ చేస్తున్నారు. కీర్తనలకు తగినట్టు SMలో AR ఎఫెక్ట్స్‌తో రీల్స్ చేస్తూ రచ్చ లేపుతున్నారు. IIIT-H, JNTU నుంచే వారానికి 7 వేల మంది గచ్చిబౌలి- నెక్లెస్ రోడ్ వరకు వెళ్తున్నారు. యువతలో ఒంటరితనాన్ని పోగొడుతూ, మహిళలకు భద్రతనిస్తోంది.

News January 22, 2026

నల్గొండ : పీజీ సెమిస్టర్-1 పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో PG ( M.A / M.Sc / M.Com / M.S.W ) సెమిస్టర్-1 రెగ్యులర్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 20 మధ్య పరీక్షలు జరుగుతాయని కంట్రోలర్ అఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్. ఉపేందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష సెంటర్ లోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.

News January 22, 2026

రామాయంపేటలో నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశం

image

రామాయంపేట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై విచారణకు కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గత రెండేళ్లుగా జరిగిన ఆర్థిక లావాదేవీలు, పనుల ఖర్చులపై నిజానిజాలు తేల్చేందుకు జిల్లా ఆడిట్ అధికారిని విచారణాధికారిగా నియమించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. త్వరలోనే ఆడిట్ అధికారి పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించనున్నారు.

News January 22, 2026

NLG: బాలికల హాస్టల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

image

జిల్లా కేంద్రంలోని SC బాలికల హాస్టల్, పాత బాలికల డి-హాస్టల్‌ను కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ గదులను పరిశీలించిన ఆయన, విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న వసతులు, భోజనం మరియు ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు లక్ష్యంతో చదువుకుని భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. హాస్టల్‌లో సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News January 22, 2026

చెరువుగట్టులో కోనేటి స్నానం చేస్తే సకల పాపాలు హరి

image

తెలంగాణలో రెండవ శ్రీశైలంగా పేరు పొందిన చెరువుగట్టు దేవస్థానం జాతరకు సిద్ధమైంది. ఈనెల 23 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు అధికారులు ముమ్ముర ఏర్పాట్లు చేస్తున్నారు. చెరువుగట్టు గుట్టపై గల కోనేటిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో అగ్ని గుండాల ప్రవేశం అత్యంత కీలకం. ‘హరిహర మహాదేవ శంభో శంకర’ అంటూ నినదిస్తూ నిప్పు కణికలపై నడుస్తారు. కష్టాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.

News January 22, 2026

ఖమ్మం: ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు

image

ఖమ్మం జిల్లా ఎమ్మార్పీఎస్ టీఎస్ అధ్యక్షుడిగా హెచ్చు వెంకటేశ్వరరావును ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న, జాతీయ ఉపాధ్యక్షుడు లంకా వెంకటేశ్వర్లు ప్రకటించారు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన ఈయన ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ 28 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడారన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల హక్కుల కోసం పోరాడుతూ సంఘాన్ని ముందుండి నడిపించాలని కోరారు.

News January 22, 2026

ఖమ్మం: గ్రామ పారిశుద్ధ్యం, రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ సమీక్ష

image

ప్రజలకు సత్వర న్యాయం అందేలా అధికారులు మెరుగైన సేవలు అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో తహశీల్దార్లు, ఎంపీడీవోలతో గ్రామ పారిశుద్ధ్యం, రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ రెవెన్యూ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.