Telangana

News March 22, 2024

పెద్దపల్లి: కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థి గడ్డం వంశీ నేపథ్యం ఇదీ!

image

పెద్దపల్లి MP అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీకృష్ణ పేరును ఖరారు చేసింది. 2010లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్, మేనేజ్‌మెంట్ డిగ్రీ USAలో పూర్తి చేశాడు. 2011లో విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలో శిక్షణ తీసుకుని, 2012లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. వీ6 ఛానల్ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు తొలిసారిగా రాజకీయ అరంగ్రేటం చేయనున్నారు.

News March 22, 2024

సదాశివనగర్: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

image

రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామ శివారులోని గంజి వాగు దగ్గర ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పోసానిపేటకు చెందిన బలగం రాజయ్యకు తీవ్ర గాయాలయ్యాయ. ఆయనను కామారెడ్డి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు.

News March 22, 2024

మహబూబ్‌నగర్: గిరిజన గురుకులాల్లో ప్రవేశాలు

image

గిరిజన గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి కె.నాగార్జునరావు తెలిపారు. అర్హులైన గిరిజన విద్యార్థులు నిర్దేశిత వెబ్ సైడ్ http:///tgtwgu-rukulam.telangana.gov.in ద్వారా ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

News March 22, 2024

KCR నియోజకవర్గంలో కాంగ్రెస్ పాగా..!

image

KCR ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని తూప్రాన్‌ మున్సిపల్‌ ఛైర్మన్ పదవిని కాంగ్రెస్‌ చేజిక్కించుకుంది. నూతన ఛైర్ పర్సన్‌గా మామిండ్ల జ్యోతికృష్ణ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి, తూప్రాన్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఛైర్మన్ ఎన్నిక గురువారం నిర్వహించారు. గత ఛైర్మన్‌(BRS)పై అవిశ్వాసం నెగ్గడంతో ఈ ఎన్నిక నిర్వహించారు. ఇందులో గజ్వేల్‌ మాజీ MLA నర్సారెడ్డి కీలకంగా వ్యవహరించారు.

News March 22, 2024

హైదరాబాద్‌లో ఇవి నిషేధం..!

image

హైదరాబాద్‌లో 144 సెక్షన్ విధించినట్లు CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున EC సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇవి నిషేధం:
*లైసెన్స్‌ ఆయుధాలు తీసుకెళ్లడం
*ఆయుధాలకు కొత్త లైసెన్స్‌ జారీ చేయడం
ఇప్పటికే వెపన్స్‌ కలిగి ఉన్నవారు డిపాజిట్ చేయాలని.. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
SHARE IT

News March 22, 2024

నాగర్‌కర్నూల్ ఎంపీ బరిలో ఈసారి త్రిముఖ పోటీ..!

image

గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి, బీజేపీ అభ్యర్థిగా భరత్ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈసారి అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఇక్కడ బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

News March 22, 2024

హైదరాబాద్‌లో ఇవి నిషేధం..!

image

హైదరాబాద్‌లో 144 సెక్షన్ విధించినట్లు CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున EC సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇవి నిషేధం:
*లైసెన్స్‌ ఆయుధాలు తీసుకెళ్లడం
*ఆయుధాలకు కొత్త లైసెన్స్‌ జారీ చేయడం
ఇప్పటికే వెపన్స్‌ కలిగి ఉన్నవారు డిపాజిట్ చేయాలని.. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
SHARE IT

News March 22, 2024

NLG: ఊపందుకుంటున్న ప్రచార ప్రక్రియ

image

ఉమ్మడి జిల్లాలో ఈ సారి ఎండాకాలం లోక్‌సభ ఎన్నికలతో మరింత వేడెక్కనుంది . రాజకీయ పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు, అభ్యర్థుల ప్రకటనలతో ప్రచార ప్రక్రియ ఊపందుకుంటుంది. ఇప్పటికే నల్లగొండకు అభ్యర్థిని ప్రకటించి కాంగ్రెస్, బిజెపిలు ఒక అడుగు ముందుకు వేశాయి. భువనగిరి ఎంపీ స్థానానికి ఏ పార్టీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్లో టికెట్ కోసం పోటీ పడుతుండగా.. బీఆర్ఎస్‌లో అయోమయం నెలకొంది.

News March 22, 2024

పెద్దపల్లి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు వేరే

image

పెద్దపల్లి లోక్ సభ ఎన్నికల్లో మూడు పార్టీల అభ్యర్థులను ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ బరిలో ఉన్నారు. అయితే పెద్దపల్లిలో మూడు పార్టీల అభ్యర్థులను ప్రకటించడంతో రాజకీయం వేడెక్కింది. మూడు పార్టీల నాయకులు ప్రచారంతో హోరెత్తించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎవరు గెలుస్తారో మీరు కామెంట్ చేయండి.

News March 22, 2024

NLG: ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

image

లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఈ మేరకు భువనగిరి స్థానానికి అభ్యర్థిని కూడా ప్రకటించింది. సీపీఐతో కలిసి పోటీ చేయాలని భావించినా.. ఆ పార్టీ కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలనే యోచనలో ఉండడంతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కాగా సీపీఎంకు పడే ఓట్ల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్..