India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించి తెలంగాణలోని వివిధ పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జులను పార్టీ అధ్యక్షుడు డా.విశారదన్ మహారాజ్ మంగళవారం ప్రకటించారు. మెదక్- అన్నెల లక్ష్మణ్, భువనగిరి-దుర్గాప్రసాద్, సికింద్రాబాద్-వినోద్ కుమార్, చేవెళ్ల-రాఘవేంద్ర ముదిరాజ్, కరీంనగర్- చిలువేరు శ్రీకాంత్, నిజామాబాద్-కండెల సుమన్, హైదరాబాద్- గడ్డం హరీశ్ గౌడ్, వరంగల్ – మేకల సుమన్, మహబూబాబాద్ -రవ్వ భద్రమ్మ, మహబూబ్ నగర్ -రాకేష్.
అక్రమంగా తరలిస్తున్న 134 కిలోల గంజాయిని అశ్వాపురం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వాపురం మండలం గొల్లగూడెం ప్రధాన రహదారి పై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా కారులు అక్రమంగా చింతూరు నుంచి మహారాష్ట్ర తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దుమ్ముగూడెం మండలం డి.కొత్తగూడేనికి చెందిన తిరుపతిరావు (45) సోమవారం స్కూటీపై మహాదేవపురం వెళ్లాడు. రాత్రి ఇంటికి వెళ్లే క్రమంలో సుబ్బారావుపేట వద్ద తాలిపేరు ఎడమ కాలువలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. మంగళవారం మృతదేహాన్ని గమనించిన స్థానికులు కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందజేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
HYD శివారు శంకర్పల్లి RPF SI అంటూ యువతి మాళవిక అందరినీ నమ్మించగా ఆమెను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నిజంగా SIలానే ఆమె చేసేదని స్థానికులు తెలిపారు. అవగాహన కార్యక్రమాలు, మోటివేషన్ క్లాసులకు వెళ్లి స్పీచ్లు ఇస్తూ SIలానే ప్రవర్తించేదని చెప్పారు. ఏడాదిగా నకిలీ పోలీస్ యూనిఫాం వేసుకుని తిరుగుతున్నా ఎవరూ గమనించకపోవడం గమనార్హం. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
HYD శివారు శంకర్పల్లి RPF SI అంటూ యువతి మాళవిక అందరినీ నమ్మించగా ఆమెను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నిజంగా SIలానే ఆమె చేసేదని స్థానికులు తెలిపారు. అవగాహన కార్యక్రమాలు, మోటివేషన్ క్లాసులకు వెళ్లి స్పీచ్లు ఇస్తూ SIలానే ప్రవర్తించేదని చెప్పారు. ఏడాదిగా నకిలీ పోలీస్ యూనిఫాం వేసుకుని తిరుగుతున్నా ఎవరూ గమనించకపోవడం గమనార్హం. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు నాగం జనార్ధన్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ పరిస్థితులపై పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో M.C కేశవ రావు, కనకం బాబు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో పలు మండలాల్లో వర్షం కురిసింది. ఆదిలాబాద్, గుడిహత్నూర్, బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ, బజార్ హత్నూర్, తలమడుగు మండలాల్లో వర్షం కురిసింది. పలు చోట్ల గాలులతో కూడిన వాన కురియడంతో పంటలు నేలవాలి తీవ్ర నష్టం వాటిల్లింది. బజార్ హత్నూర్ 29.5 మీమీ వర్షపాతం నమోదు కాగా.. తలమడుగులో 20.8 మీ.మీ. గుడి హత్నూర్ లో 19.3మీమీ, ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ దరి లో 18.3 మీమీగా వర్షపాతం నమోదైంది.
HYD తుక్కుగూడలో 2023 SEP 17న సోనియాగాంధీ జనగర్జన సభకు వచ్చిన సూర్యాపేట జిల్లా వాసి కొమ్ము భిక్షం.. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో హయత్నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురై గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం తన తండ్రి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, తమ పరిస్థితి దయనీయంగా ఉందని కుమారుడు కొమ్ము శ్రీకాంత్ కన్నీరు పెడుతున్నారు. సర్జరీకి రూ.లక్షల్లో ఖర్చవుతుందని, సీఎం ఆదుకోవాలని కోరుతున్నారు.
HYD తుక్కుగూడలో 2023 SEP 17న సోనియాగాంధీ జనగర్జన సభకు వచ్చిన సూర్యాపేట జిల్లా వాసి కొమ్ము భిక్షం.. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో హయత్నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురై గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం తన తండ్రి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, తమ పరిస్థితి దయనీయంగా ఉందని కుమారుడు కొమ్ము శ్రీకాంత్ కన్నీరు పెడుతున్నారు. సర్జరీకి రూ.లక్షల్లో ఖర్చవుతుందని, సీఎం ఆదుకోవాలని కోరుతున్నారు.
NLG:పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన ఎఫ్ఎస్టి,ఎస్ఎస్టి బృందాలు తనిఖీలను క్షుణ్ణంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు. ఉదయాదిత్య భవన్లో ఎఫ్ ఎస్ టి,ఎస్ ఎస్ టి బృందాలకుద్దేశించి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎఫ్ ఎస్ టి బృందాలు ఒకే చోట ఉండకుండా క్షేత్రస్థాయిలో ఒక చోట నుండి మరోచోటికి వెళ్తూ తనిఖీలు నిర్వహించాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.