Telangana

News September 25, 2024

ADB: విషాదం.. పురుగు మందు తాగిన ప్రేమికులు

image

ఉట్నూరు మండలం రాంజీగూడకు చెందిన ఆత్రం హనుమంత్, నార్నూర్ మండలానికి చెందిన ఓ యువతీ ప్రేమించుకుంటున్నారు. కాగా వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందారు. సోమవారం పురుగు మందు తాగేశారు. హనుమంత్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా పొలం వద్ద ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. హనుమంత్ మృతి చెందగా, యువతిని మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 25, 2024

కొడంగల్: ఉదయం నుంచే బ్యాంకు వద్ద రైతుల పడిగాపులు

image

బ్యాంకులలో తీసుకున్న రుణాలు నేటి వరకు మాఫీ అవ్వకపోవడంతో రైతులు ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ తిరిగుతున్నారు. రోజు వందల మందికి పైగా బ్యాంకుకు వస్తుండడంతో వారిని అదుపు చేయడం సిబ్బంది కష్టంగా మారింది. రుణమాఫీ కోసం వచ్చే రైతుల రద్దీని నియంత్రించడానికి ప్రతిరోజు 50 మంది రైతులకు టోకెన్‌లు ఇస్తున్నారు. టోకన్లు తీసుకోవడానికి ఉదయం 6 గంటల నుంచి రైతులు బ్యాంకుల వద్దకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు.

News September 25, 2024

చొప్పదండి: నవోదయ ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు

image

జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాల దరఖాస్తు గడువు అక్టోబర్ 7 వరకు పొడిగించినట్టు చొప్పదండి నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ మంగతాయారు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా 8, 9వ తేదీల్లో దరఖాస్తుదారులు మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు చెప్పారు.

News September 25, 2024

రాజాపూర్: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత మృతి

image

మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి శివార్లలోని నేషనల్ హైవే 44పై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాజాపూర్ మండలం చొక్కంపేట గ్రామానికి చెందిన యువ కాంగ్రెస్ నేత వెంకటేశ్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. ముదిరెడ్డిపల్లి నుంచి మహబూబ్ నగర్ వైపు బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. మృతదేహాన్ని బాదేపల్లి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

News September 25, 2024

సిద్దిపేట: కరెంట్ షాక్‌తో ఇద్దరి మృతి

image

సిద్దిపేట జిల్లాలో మంగళవారం కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి చెందారు. వివరాలిలా.. ధూళ్మొట్ట మండలం కొండాపూర్‌కు చెందిన తిరుపతి(25) ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఏజీ స్విచ్ అఫ్ చేస్తుండగా కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. దుబ్బాక మండలం రఘొత్తంపల్లి గ్రామానికి చెందిన అంజయ్య పొలంలో మొక్కలు కొస్తుండగా కరెంట్ షాక్‌తో చనిపోయాడు.

News September 25, 2024

హైదరాబాద్‌‌కు వర్ష సూచన⛈️

image

హైదరాబాద్‌కు బుధవారం వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. నగరంలో నిన్నటి మాదిరిగానే మళ్లీ మధ్యాహ్నం, రాత్రి సమయంలో (వరుసగా 6వ రోజు) ఉరుములతో కూడిన వర్షం పడనుంది అని తెలంగాణ వెదర్‌మ్యాన్ ట్వీట్ చేశారు. నగరవాసులు తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిదని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో HYDలో 154 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, 252 స్టాటిక్ బృందాలను ఏర్పాటు చేసిన GHMC సహాయక చర్యలు చేపడుతోంది.

News September 25, 2024

KLPR: అన్ని కళాశాలల్లో ఇన్‌ఛార్జ్‌ల పాలన

image

KLPR: మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. కొల్లాపూర్ పట్టణంలో ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు, పానగల్, వీపనగండ్ల, కోడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో శాశ్వత ప్రాతిపదికన ప్రిన్సిపళ్లు లేకపోవడంతో ఇన్‌ఛార్జ్‌ల పాలనలో నడుస్తున్నాయి. పదోన్నతుల ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయవలసి ఉంది.

News September 25, 2024

హైదరాబాద్‌‌కు వర్ష సూచన⛈️

image

హైదరాబాద్‌కు బుధవారం వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. నగరంలో నిన్నటి మాదిరిగానే మళ్లీ మధ్యాహ్నం, రాత్రి సమయంలో (వరుసగా 6వ రోజు) ఉరుములతో కూడిన వర్షం పడనుంది అని తెలంగాణ వెదర్‌మ్యాన్ ట్వీట్ చేశారు. నగరవాసులు తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిదని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో HYDలో 154 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, 252 స్టాటిక్ బృందాలను ఏర్పాటు చేసిన GHMC సహాయక చర్యలు చేపడుతోంది.

News September 25, 2024

NZB: ఇద్దరు మత్స్యకారులు మృతి

image

నవీపేట, సాలూరా మండలాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు మత్స్యకారులు నీటిలో మునిగి మృతి చెందారు. నవీపేట మండల మహంతానికి చెందిన భూమన్న స్థానిక చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లగా కాళ్లకు వల చుట్టుకుని చనిపోయాడు. సాలూర మండలం హున్నాకు చెందిన సాయిలు మందర్న శివారులోని రాంసాలకుంటలో చేపలు పట్టేందుకు వెళ్లి వలకు చుట్టుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News September 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు భారీ వర్ష సూచన

image

కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో రానున్న 5 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు జగిత్యాల పరిశోధన స్థానం సహ పరిశోధన డైరెక్టర్ డా.శ్రీనివాస్ తెలిపారు. 22-24 డిగ్రీల కనిష్ఠ, 33-34 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ముఖ్యంగా రైతులు, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండొద్దన్నారు.