Telangana

News March 25, 2024

NZB: కలర్ పడుద్ది.. కళ్లు భద్రం..!

image

హోలీ అంటేనే రంగుల కేళి..చిన్నా పెద్దా తేడా లేకుండా కలిసి ఆడే పండుగ. నేడు రంగుల వేడుకను జరుపుకొనేందుకు ఉమ్మడి NZB జిల్లా ప్రజలు సిద్ధమైన వేళ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సరదా సంబురం మాటున ప్రమాదం పొంచి ఉన్నదని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రంగులు కళ్లల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తే మంచిది అని అంటున్నారు.

News March 25, 2024

MBNR: మహిళా సంఘాలకు రూ.25.73 కోట్లు మంజూరు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహిళా సంఘాలకు ఊరట లభించింది. ప్రభుత్వం వారి ఖాతాల్లో కొన్ని నెలలకు సంబంధించిన వడ్డీ నగదును మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాకు రూ.25.73 కోట్లు మంజూరు కాగా నేరుగా స్వయం సహాయక సంఘాల సేవింగ్ ఖాతాల్లో ఈ నిధులను జమ చేస్తున్నారు. అయితే మొత్తం కాకుండా కేవలం మూడు నెలలకు సంబంధించిన రాయితీని మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది.

News March 25, 2024

సిద్దిపేట: ‘మట్టి స్నానంతో రోగాలు దూరం’

image

మట్టి స్నానంతో రోగాలు దూరం అవుతాయని, మట్టి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుందని యోగా శిక్షకుడు తోట సతీశ్ తెలిపారు. వ్యాస మహర్షి యోగా సోసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఆదివారం మడ్ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో దాదాపు 80 మంది మట్టి స్నానం చేశారు. అధ్యక్షుడు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హోలీ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.

News March 25, 2024

బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్

image

BJP వరంగల్ MP అభ్యర్థిగా అరూరి రమేశ్ పేరును ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం రాత్రి ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించగా.. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. అరూరి తొలిసారిగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి PRP తరఫున పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత BRSలో చేరి 2014, 2018లో వర్ధన్నపేట నుంచి MLAగా గెలిచి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

News March 25, 2024

HYD: టీవీ నటులకు పురస్కారాల ప్రదానం

image

ప్రాచీన లలిత కళలు.. మన భారతీయ శాస్త్రీయ సంగీత, నృత్య జీవన సాంప్రదాయ కళలని, వాటిని పరిరక్షించుకోవాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ సూచించారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ రమణారావు అధ్యక్షతన HYD రవీంద్రభారతిలోని ప్రధాన మందిరంలో శివరాత్రి స్వర్ణ నంది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. టీవీ నటులకు పురస్కారాలు అందించారు.

News March 25, 2024

HYD: టీవీ నటులకు పురస్కారాల ప్రదానం 

image

ప్రాచీన లలిత కళలు.. మన భారతీయ శాస్త్రీయ సంగీత, నృత్య జీవన సాంప్రదాయ కళలని, వాటిని పరిరక్షించుకోవాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ సూచించారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ రమణారావు అధ్యక్షతన HYD రవీంద్రభారతిలోని ప్రధాన మందిరంలో శివరాత్రి స్వర్ణ నంది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. టీవీ నటులకు పురస్కారాలు అందించారు.

News March 25, 2024

వనపర్తి: వికలాంగుల రాష్ట్ర నూతన కమిటీలో చోటు

image

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(NPRD) ఆధ్వర్యంలో మహిళా దివ్యాంగుల సదస్సు హైదరాబాదులో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నూతన కమిటీలో వనపర్తి పట్టణానికి చెందిన దివ్యాంగురాలు లక్ష్మీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా NPRD జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ స్వామి, శ్యాంసుందర్ రెడ్డి, మీసాల మోహన్ ప్రభాకర్ శెట్టి, గట్టన్న, భాగ్యలక్ష్మి,, మంగమ్మ హర్షిస్తూ లక్ష్మికి శుభాకాంక్షలు తెలిపారు.

News March 25, 2024

రేవంత్ రెడ్డిని కలిసిన BRS నేత శివకుమార్

image

మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బాద్మి శివకుమార్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News March 25, 2024

MLC ఉపఎన్నికలో పాల్గొనే అధికారులకు కలెక్టర్ సూచనలు

image

✓ ఉపఎన్నిక EVMల ద్వారా కాకుండా బ్యాలెట్‌ విధానంలో ఉంటుంది.
✓ బ్యాలెట్‌ బాక్స్‌ ఖాళీగా ఉందని అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు చూపాలి.
✓ బ్యాలెట్‌ బాక్సులు ఓపెన్‌ చేయడం, మూసివేయడం, సీలింగ్‌ చేసే పద్ధతి గురించి తెలుసుకోవాలి.
✓ బ్యాలెట్‌ పేపర్‌ మడత పెట్టడంపై అవగాహన కలిగి ఉండాలి.
✓ పోలింగ్‌ కేంద్రంలోకి ఒకేసారి నలుగురు ఓటర్లను మాత్రమే అనుమతి.
✓ ఓటర్లు 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపినా అనుమతించాలి.

News March 25, 2024

హోలి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

image

ఈ హోలికి కొత్త కొత్త రంగులతో కొత్త ధనానికి మరిన్ని విజయాలకు స్వాగతం పలుకుతూ అందరి జీవితాలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరూ బేధ భావాలు వీడి పరస్పర ప్రేమాభిమానాలతో సంతోషంగా మోదుగు పూల వంటి సహజ సిద్ధమైన రంగులతో వసంత కాలానికి నాందిగా మొదలైన హోలీ పండుగను జరుపుకోవాలని సూచించారు.