Telangana

News March 25, 2024

HYD: రాష్ట్రంలో 12 MP సీట్లు గెలుస్తాం: ఈటల

image

BRS, కాంగ్రెస్‌కి ఓటేస్తే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమేనని BJP మల్కాజిగిరి MP అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్‌లో BJP జిల్లా రూరల్ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. రాహుల్‌కి, మోదీకి పోలిక ఉందా? నక్కకు నాగలోకానికి ఉన్న తేడా అని ఎద్దేవా చేశారు. మోదీ హయాంలో ఒక్క స్కామ్ లేదని, ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేశారన్నారు. రాష్ట్రంలో 12 MP సీట్లు గెలుస్తామన్నారు.

News March 25, 2024

NZB జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్క చోట చేర్చే ఈ హోలీ వేడుక ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోలీ వేడుక జరుపుకోవాలన్నారు.

News March 25, 2024

28న సిద్దిపేటలో స్పాట్ అడ్మిషన్లు

image

సిద్దిపేటలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ఈనెల 28వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కవిత తెలిపారు. గ్రూప్ 1, 2, 3,4, ఎస్ఎసీసి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్సై, కానిస్టేబుల్ తదితర కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉద్యోగాల కోసం ఫౌండేషన్ కోర్సు ద్వారా మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 25, 2024

మీడియా సెంటర్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్

image

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం, గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ (31)లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మొదటి అంతస్తులో ఉన్న కంట్రోల్ రూమ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..  పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సమాచారం అందించడానికి, వివిధ రాజకీయ పార్టీల ప్రచార అనుమతుల నిమిత్తం మీడియా సర్టిఫికేషన్ ఏర్పాటు చేశామన్నారు.

News March 25, 2024

హోలీ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు

image

హోలీ (Holi) సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. హోలి రోజున రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన, బైక్‌లపై తిరుగుతూ ఇతరులకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని పెర్కొన్నారు. వాహనాలపై గుంపులు.. గుంపులుగా ప్రయాణించవద్దని ఒకవేళ అలా ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News March 25, 2024

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌‌వి అబద్ధపు ప్రచారాలు

image

నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారన్నారు. నల్గొండలో శనివారం ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ 6 పథకాలు అమలు చేయలేదు. వంద రోజుల్లో వంద రూపాయల పని కూడా జరగలేదు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిన రోజునే రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు.

News March 24, 2024

ఉమ్మడి జిల్లా నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా భారీ బహిరంగ సభలు, రోడ్షోలు, సమావేశాలు ఏర్పాటు విషయమై చర్చించామని నేతలు తెలిపారు. పాలమూరు మహాసభకు రాహుల్ గాంధీ ఆహ్వానించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పార్టీ నేతలు పాల్గొన్నారు.

News March 24, 2024

మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ హోలీ శుభాకాంక్షలు

image

హోళీ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్క చోట చేర్చే ఈ హోళీ వేడుకను ప్రజలందరి జీవితాలలో సంతోషం వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. మన సంస్కృతి, సాంప్రదాయాల కనుగుణంగా జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని కలెక్టర్ అభిలషించారు.

News March 24, 2024

బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు నేపథ్యం..

image

బీజేపీ ఖమ్మం ఎంపీ టికెట్‌ను తాండ్ర వినోద్ రావుకు అధిష్ఠానం కేటాయించింది. కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన ఆయన.. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకు అంకితమైన కుటుంబం నుంచి వచ్చారు. 2015 నుంచి 2021 వరకూ ఏకలవ్య ఫౌండేషన్ తరఫున విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో సేవలందించారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేసి పలువురి ప్రసంశలు అందుకున్నారు.

News March 24, 2024

HYD: కడుపు కోసి.. దారుణంగా చంపాడు..!

image

HYD బాలానగర్‌లో <<12918850>>యువకుడు ప్రణీత్ తేజ<<>> (20)ను స్నేహితుడే చంపిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మద్యం తాగుదామని తీసుకెళ్లిన స్నేహితుడు.. ప్రణీత్‌ మత్తులోకి జారుకున్నాక మెడ, కడుపు కోసి చంపేశాడు. అనంతరం సైకో లాగా కడుపులోని పేగులను బయటకు తీశాడు. ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.