India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చర్ల సరిహద్దు ప్రాంతమైన బీజాపూర్ జిల్లాలో తుపాకుల మోత మోగింది. పెడియా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి జవాన్లు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పెడియా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం జవాన్లు గాలిస్తున్నారు.

బాలికపై లైంగిక దాడికి యత్నించి పోక్సో కేసులో అరెస్టయిన భూపాలపల్లి జిల్లా సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ బండారి సంపత్ కుమార్ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్- 1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రత కల్పించాల్సిన పోలీస్ అధికారి బాలికపై అత్యాచారానికి యత్నించినందుకు సంపత్పై శాఖపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశామని ఆయన వెల్లడించారు.

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్లో భాగంగా నిర్వహించిన పోషణ పక్షోత్సవాలు శనివారం ముగిశాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు ప్రాజెక్టు, మండల, గ్రామ స్థాయిలో ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.కార్యక్రమ వివరాలను సూచించే ఆన్లైన్ సైట్లో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.

తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ కొరకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా గురుకుల విద్యాలయాల సెక్రటరీ సీతాలక్ష్మీ వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ భువనగిరి ఎంపీ స్థానంపై పీటముడి ఇప్పట్లో వీడేల లేదు. ఇక్కడి నుంచి పోటీకి కిరణ్కుమార్రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు ఉన్నతస్థాయిలో చర్చలు సైతం పూర్తయ్యాయని విశ్వసనీయ సమాచారం. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కిరణ్కుమార్రెడ్డికి వస్తుందా? లేదా పార్టీలోని మరో ప్రజాప్రతినిధికి వస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీ జోన్-I ఏ.వి రంగనాథ్ సూచించారు. కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ అధికారులతో లోక్సభ ఎన్నికల సందర్భంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులందరూ సమష్టిగా విధులు నిర్వహించాలన్నారు.

వరంగల్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ మాత్రం తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. అయితే ఇక్కడ మాజీ MLA ఆరూరి రమేశ్ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆసక్తిగా ఎదురుచూసున్నారు. మీ కామెంట్?

ఆసిఫాబాద్లోని అడా ప్రాజెక్టులో ఈరోజు ఓ వ్యక్తి మృతదేహాం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. తెల్లారం కంచరగూడ గ్రామానికి చెందిన రాజ్ కుమార్(28) ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ నెల 19న ఆటోలో బయటికి వెళ్లిన అతడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతడి తండ్రి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా ఈరోజు అడా ప్రాజెక్టులలో మృతదేహాం లభ్యమైనట్లు వెల్లడించారు.

HYDలో వీధి కుక్కలు మరో బాలుడి ప్రాణం తీశాయి. బాధితులు తెలిపిన వివరాలు.. HYD శామీర్పేట్ పరిధి పెద్దమ్మ కాలనీలో భవన నిర్మాణ మేస్త్రీ బాలు.. కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి పెద్ద కుమారుడు ప్రవీణ్ (11) ఈనెల 18న ఇంటి ముందు ఉండగా ఓ వీధి కుక్క దాడి చేసి కరిచింది. బాలుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు.

HYDలో వీధి కుక్కలు మరో బాలుడి ప్రాణం తీశాయి. బాధితులు తెలిపిన వివరాలు.. HYD శామీర్పేట్ పరిధి పెద్దమ్మ కాలనీలో భవన నిర్మాణ మేస్త్రీ బాలు.. కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి పెద్ద కుమారుడు ప్రవీణ్ (11) ఈనెల 18న ఇంటి ముందు ఉండగా ఓ వీధి కుక్క దాడి చేసి కరిచింది. బాలుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు.
Sorry, no posts matched your criteria.