Telangana

News March 23, 2024

భద్రాద్రి కంటే ఖమ్మంలోనే ఎక్కువ..

image

ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో పోలీసుశాఖ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై నిఘాను కట్టుదిట్టం చేస్తోంది. ఖమ్మంలో 83, భద్రాద్రిలో 15 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయి. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు భద్రాద్రిలో 128 ఉండగా.. ఖమ్మంలో లేవు. రౌడీ షీటర్లు ఖమ్మంలో 244, భద్రాద్రిలో 236 మంది ఉండగా.. వారికి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.

News March 23, 2024

అచ్చంపేట : అధిక రక్తస్రావం.. బాలింత మృతి

image

ఓ బాలింత మృతిచెందిన సంఘటన అచ్చంపేటలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామానికి చెందిన కల్పన (29) ప్రసవం కోసం గురువారం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ ఓ వైద్యుడు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లమన్నాడు. డెలివరీ అనంతరం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నా.. బాలింతకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. జిల్లా ఆస్పత్రి నుంచి HYD గాంధీ ఆసుపత్రికి తరలించగా మరణించింది.

News March 23, 2024

నల్గొండ, భువనగిరిపై తర్జనభర్జన

image

నల్గొండ, భువనగిరి లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ తర్జనభర్జన పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక బీఆర్ఎస్ కత్తిమీద సాములా మారింది. ఇప్పటివరకు విజయం సాధించని నల్గొండ స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలో దింపేలా ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. రాజధాని ప్రాంతం కాకుండా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న స్థానాలు ఇక్కడివే కావడం గమనార్హం.

News March 23, 2024

ADB: ఫలితాలు ప్రకటించకముందే మరొక షెడ్యూల్

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్ డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్-జనవరి నెలలో రాసిన 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు ఇప్పటివరకు వెలువడలేదు. ఫలితాలు రాకముందే మరో పరీక్షల షెడ్యూల్ ఎలా విడుదల చేస్తారంటూ డిగ్రీ విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. వెంటనే 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

News March 23, 2024

NZB: ప్రేమ పెళ్లి.. ఒకరోజు ముందు లవర్‌ దుర్మరణం

image

పెళ్లికి ఒకరోజు ముందు ప్రియుడు మృతి చెందాడు. HYDలో ఉంటున్న శంకర్‌, నిజామాబాద్‌కు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈనెల 20న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఊరెళ్లేందుకు 19న సిటీలో అమ్మాయిని బస్సెక్కించి.. తాను బైక్‌పై బయల్దేరాడు. కందుకూరులో కారు ఢీకొని శంకర్ గాయపడగా.. అదే రూట్‌లో వస్తున్న ప్రియురాలు గమనించి బస్‌ దిగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శంకర్ చనిపోవడం బాధాకరం.

News March 23, 2024

MBNR: ప్రేమ పెళ్లి.. ఒకరోజు ముందు లవర్‌ దుర్మరణం

image

పెళ్లికి ఒకరోజు ముందు ప్రియుడు మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ వాసి శంకర్‌, నిజామాబాద్‌కు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈనెల 20న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఊరెళ్లేందుకు 19న HYDలో అమ్మాయిని బస్సెక్కించి.. తాను బైక్‌పై బయల్దేరాడు. కందుకూరులో కారు ఢీకొని శంకర్ గాయపడగా.. అదే రూట్‌లో వస్తున్న ప్రేయసి గమనించి బస్‌ దిగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శంకర్ చనిపోవడం బాధాకరం.

News March 23, 2024

HYD: ప్రేమ పెళ్లి.. ఒకరోజు ముందు లవర్‌ దుర్మరణం

image

పెళ్లికి ఒకరోజు ముందు ప్రియుడు మృతి చెందాడు. HYDలో ఉంటున్న శంకర్‌, నిజామాబాద్‌కు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈనెల 20న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఊరెళ్లేందుకు 19న సిటీలో అమ్మాయిని బస్సెక్కించి.. తాను బైక్‌పై బయల్దేరాడు. కందుకూరులో కారు ఢీకొని శంకర్ గాయపడగా.. అదే రూట్‌లో వస్తున్న ప్రియురాలు గమనించి బస్‌ దిగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శంకర్ చనిపోవడం బాధాకరం.

News March 23, 2024

HYD: ప్రేమ పెళ్లి.. ఒకరోజు ముందు లవర్‌ దుర్మరణం

image

పెళ్లికి ఒకరోజు ముందు ప్రియుడు మృతి చెందాడు. HYDలో ఉంటున్న శంకర్‌, నిజామాబాద్‌కు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈనెల 20న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఊరెళ్లేందుకు 19న సిటీలో అమ్మాయిని బస్సెక్కించి.. తాను బైక్‌పై బయల్దేరాడు. కందుకూరులో కారు ఢీకొని శంకర్ గాయపడగా.. అదే రూట్‌లో వస్తున్న ప్రియురాలు గమనించి బస్‌ దిగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శంకర్ చనిపోవడం బాధాకరం.

News March 23, 2024

BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి ?

image

BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఆరూరి రమేష్ రాజీనామాతో ఈ పదవి ఖాళీ అవ్వగా.. ఈ పదవిని ఎవరికి ఇస్తారో అని సందిగ్ధం నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కార్యకర్తలు, సీనియర్ లీడర్లు చాలామంది పార్టీ ఫిరాయించడంతో క్యాడర్ అయోమయానికి గురవుతోంది. నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్, పరకాల మాజీ MLA చల్లా ధర్మారెడ్డిలలో ఎవరో ఒకరికి ఈ పదవి రానున్నట్లు సమాచారం.

News March 23, 2024

మహబూబ్ నగర్: త్రాగునీటికి నిధులు విడుదల!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 పురపాలికలకు మంచినీటి సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.NGKL-రూ.59.79 కోట్లు,WNPT-రూ.128.29 కోట్లు,MBNR-రూ.341.25 కోట్లు, NRPT- రూ.55.57 కోట్లు,GDWL- రూ.89.46 కోట్లు మంజూరయ్యాయి.వేసవిలో భూగర్భ జలాలు ఇంకి తరచూ పట్టణాల్లో తాగు నీటి సమస్య తలెత్తుతోంది.ఈ క్రమంలో అమృత్-2లో సమస్యకు చెక్ పెడుతూ నిధులు విడుదల చేశారు.