Telangana

News March 22, 2024

HYD: 72.88 లీటర్ల అక్రమ లిక్కర్ సీజ్: రోనాల్డ్ రోస్

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్ గురువారం 72.88 లీటర్ల అక్రమ లిక్కర్, రూ.38,150/- విలువైన ఇతర వస్తువులు జప్తు చేసినట్లు HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. పోలీస్, ఎస్.ఎస్.టీ., ఎఫ్.ఎస్.టీ. బృందాలు క్షేత్ర స్థాయిలో 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. HYDలో ఇప్పటి వరకు మొత్తం రూ.47,18,300 నగదు పట్టుకున్నట్లు వెల్లడించారు.

News March 22, 2024

సూర్యాపేట: భారీగా నగదు, బంగారం పట్టివేత

image

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అన్ని చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు తెలిపారు. తనిఖీల్లో భాగంగా రూ.15.65 లక్షలు, 690 లీటర్ల మద్యంతో పాటు 27 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అలాగే 229 గ్రాముల బంగారం, పట్టుబడిన రెడీ మేడ్ దుస్తులు విలువ రూ.21.45 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. బాధితులు ఆధారాలు అందజేస్తే పరిశీలన చేసి అందచేస్తామని చెప్పారు.

News March 22, 2024

HYD: 72.88 లీటర్ల అక్రమ లిక్కర్ సీజ్: రోనాల్డ్ రోస్ 

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్ గురువారం 72.88 లీటర్ల అక్రమ లిక్కర్, రూ.38,150/- విలువైన ఇతర వస్తువులు జప్తు చేసినట్లు HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. పోలీస్, ఎస్.ఎస్.టీ., ఎఫ్.ఎస్.టీ. బృందాలు క్షేత్ర స్థాయిలో 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. HYDలో ఇప్పటి వరకు మొత్తం రూ.47,18,300 నగదు పట్టుకున్నట్లు వెల్లడించారు.

News March 22, 2024

కామారెడ్డి: అనుమతులు లేని డబ్బు, మద్యం పట్టివేత

image

జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వెలువడిన నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. గత 3 రోజుల్లో రూ.7.6 లక్షలు, నేడు రూ.4.50 లక్షల నగదుతో పాటు 986 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు వెల్లడించారు. అధికారులు సమిష్టిగా కృషిచేస్తూ అక్రమ డబ్బు, మద్యం రవాణాను అరికట్టాలని ఆమె సూచించారు.

News March 21, 2024

జనగామ: ఫుడ్ పాయిజన్‌తో ఐదుగురు విద్యార్థుల అస్వస్థత

image

జనగామ మండలం పెంబర్తిలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలికల గురుకులంలో గురువారం ఫుడ్ పాయిజన్‌తో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన గురుకులం సిబ్బంది చంపక్ హిల్స్‌లోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పై గురుకుల ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

News March 21, 2024

GDK: లారీని ఢీకొన్న బైక్.. ఒకరు మృతి

image

లారీని ఢీకొని ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన GDKలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. GDK నుంచి మంథని రహదారిలో మూసి వేసిన త్రీ ఇంక్లైన్ రోడ్డు వద్ద ఆగి ఉన్న బొగ్గు లారీని ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాకతీయ నగర్‌కి చెందిన మంద కిరణ్ తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మంథని ఎగ్లాస్పూర్‌కి చెందిన రాకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 21, 2024

NGKL: సంపత్‌కు NO.. మల్లు రవికి OK

image

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మల్లు రవిని అధిష్ఠానం ప్రకటించింది. ఈ సీటు కోసం అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సైతం పట్టుబడ్డారు. ఒక దశలో ఆయనకే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం సైతం జరిగింది. వారి అనుచరులు ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. కానీ అధిష్ఠానం టికెట్‌ను మల్లు రవికి కేటాయించింది. దీంతో కొన్ని రోజులుగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది.

News March 21, 2024

బయ్యారంలో రజాకార్ సినిమా బృందం సందడి

image

రజాకార్ సినిమా బృందానికి గురువారం బయ్యారం మండలం కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్ యాట సత్యనారాయణ, సినిమా నటి అనసూయ అమరవీరుల స్తూపానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్, మండల కళాకారులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

News March 21, 2024

పోలీస్ స్టేషన్లలో 50 నాటు తుపాకీలు అప్పగింత: ఎఎస్పీ 

image

కుక్కునూరు, కూనవరం, విఆర్ పురం, ఐ పోలవరం, చింతూరు, ఎటుపా, రాజవొమ్మంగి మండలాల్లో ఇప్పటి వరకు గిరిజనులు 50 సింగిల్ బార్ తుపాకులను వివిధ పోలీస్టేషన్లలో అందజేశారని ఎఎస్పీ జగదీష్ అన్నారు. రాజవొమ్మంగి పోలీస్ సిబ్బంది విశ్రాంతి భవనాన్ని ఆయన ప్రారభించారు. ఆయుధాల నియంత్రణ చట్టం ప్రకారం నిషేధిత తుపాకులు కలిగి ఉండడం నేరమని, ఇకపై తుపాకీతో దొరికితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 21, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

image

*ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తాం: మంత్రి జూపల్లి
*చైనాలో గుండెపోటుతో పాలమూరు వాసి మృతి
*MBNR:కారు,బైక్ ఢీ.. కాంగ్రెస్ నేత మృతి
*జాగ్రత్త..ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
*NGKL:కన్న కొడుకును హత్య చేసిన తల్లి
*దేశం కోసం మోదీ అనే నినాదంతో ముందుకు వెళ్ళాలి: డీకే అరుణ
*MPగా గెలిపించండి: వంశీ చంద్ రెడ్డి
*ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పదో తరగతి పరీక్షలు
*NRPT:పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఎస్పీ