India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకుడు శాసనాల శ్రీరామ్ వెల్లడించారు. మంగళవారం ఎదులాపురంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారానే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే నగరవాసులకు శుభవార్త. సికింద్రాబాద్ JBS నుంచి వన జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మేనేజర్ ఎల్.రవీందర్ తెలిపారు. రేపటి నుంచి జనవరి 31 వరకు 24 గంటల పాటు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్లాట్ఫాం నంబర్ 13 వద్ద బస్సులు ఉంటాయని వెల్లడించారు. ఈ విషయాన్ని జంట నగరాల ప్రయాణికులు గమనించి, ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT

నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎస్ఈసీ రాణి కుమిదిని, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ ఆర్డీవోలు, కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు.

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 25 నుంచి 30 శాతం పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. ఈ ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో 75 వార్డులుండగా
150 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉండాలన్నారు. నామినేషన్ పక్రియ నుంచి ఎన్నికలు పూర్తి అయ్యే వరకు అప్రమత్తంగా ఉండి, ఎన్నికల సంఘం నియమాల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించాలన్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం మున్సిపల్ ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు.

సకాలంలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని ఏ ఒక్క రోగిని వదలకుండా వైద్య పరీక్షలు నిర్వహించి రోగుల వివరాలను అంతర్జాలంలో నమోదు చేయాలని జిల్లా వైద్యశాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్ అన్నారు. మంగళవారం DMHO కార్యాలయ సమావేశ మందిరంలో ఏంఎల్.హెచ్.పీ, ఏఎన్ఎంలతో అసాంక్రమిత వ్యాధుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. లక్ష్యాలను సాధించని సిబ్బందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్, సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులతో కలిసి హాజరయ్యారు.

మహాత్మా గాంధీ వర్ధంతి(JAN 30)ని పురస్కరించుకొని నగరంలోని బీఫ్, గొర్రెలు, మేకల కబేళాలు, మాంసం దుకాణాలు మూసివేయాలని GHMC ఆదేశించింది. స్టాండింగ్ కమిటీ తీర్మానం ప్రకారం GHMC చట్టం 1955లోని సెక్షన్ 533 (b) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అధికారులు ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని, మాంసం దుకాణాల యజమానులు, ప్రజలు సహకరించాలని GHMC విజ్ఞప్తి చేసింది.
SHARE IT

ఎన్నికల సంఘం నియమ, నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఎన్నికల షెడ్యూల్ ను అనుసరిస్తూ బుధవారం నుండి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా ఆయా మున్సిపాలిటీల పరిధిలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.