Telangana

News September 25, 2024

సంగారెడ్డి: MBBS ఫస్ట్ ఇయర్‌లో 98.66% ఉత్తీర్ణత

image

సంగారెడ్డిలోని ప్రభుత్వం మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలో 98.66% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఫలితాల్లో 145 మంది ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధా మాధురి తెలిపారు. ఇందులో నలుగురు డిస్టింక్షన్‌లో సాధించగా, 108 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు.

News September 25, 2024

అచ్చంపేట: రూ.1.5కోట్లు కాజేసిన బ్యాంక్ ఉద్యోగి అరెస్ట్

image

అచ్చంపేటలోని ఎస్బీఐ బ్యాంకులో ఉద్యోగి కిరణ్ కుమార్ రెడ్డి పలువురు ఖాతాదారుల నుంచి వారికి తెలియకుండా రూ.1,49,50,000, ఇతరులకు బదిలీ చేసి అక్రమాలకు పాల్పడ్డాడు. ఖాతాదారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఉద్యోగిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధించినట్లు అచ్చంపేట సీఐ రవీందర్ తెలిపారు.

News September 25, 2024

బాలికపై అత్యాచారం

image

భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలంలో దారుణం జరిగింది. పోలీసుల వివరాలిలా.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బిజ్జా సాంబయ్య అనే వ్యక్తి మైనర్ బాలికను తన ఇంటికి ఎత్తుకెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఏడూళ్ళబయ్యారం సీఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేస్తున్నారు.

News September 25, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} వైరాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} మణుగూరులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

News September 25, 2024

ఇద్దరు గ్రామపంచాయతీ కార్యదర్శులపై సస్పెండ్ వేటు

image

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మంగళవారం సస్పెండ్ చేశారు. పెద్దవూర మండలం పులిచెర్లకు చెందిన కార్యదర్శి కే.నాగరాజు అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. అదేవిధంగా దామరచర్ల మండలం వాచ్యా తండాకు చెందిన జేపీఎస్ కే.స్వప్న విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో ఆమెను సస్పెండ్ చేశారు.

News September 25, 2024

కరీంనగర్: SU పీజీ ఫలితాలు విడుదల

image

కరీంనగర్ SU పీజీ ఫలితాలు విడుదలయ్యాయి. జులై, ఆగస్టులో నిర్వహించిన ఇంగ్లిష్, ఉర్దూ, తెలుగు, ఎకనామిక్స్, సోషియాలజీ, ఎంఎస్‌డబ్ల్యూ, బాటనీ, జువాలజీ తదితర విభాగాల్లో 2, 4వ సెమిస్టర్ ఫలితాలు రిలీజ్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.శ్రీరంగప్రసాద్ తెలిపారు. https://satavahana.ac.in/ ఫలితాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.

News September 25, 2024

హైదరాబాద్‌లో పెరిగిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత రెండు వారాల క్రితం స్కిన్ లెస్ కిలో రూ. 160 నుంచి రూ. 180 మధ్య విక్రయించారు. గత ఆదివారం నుంచి క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. మంగళవారం, బుధవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ KG రూ. 213, స్కిన్‌లెస్ KG రూ. 243‌గా నిర్ణయించారు. ఫాంరేటు రూ. 125, రిటైల్ రూ. 147 చొప్పున అమ్ముతున్నారు.

News September 25, 2024

హైదరాబాద్‌లో పెరిగిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత రెండు వారాల క్రితం స్కిన్ లెస్ కిలో రూ. 160 నుంచి రూ. 180 మధ్య విక్రయించారు. గత ఆదివారం నుంచి క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. మంగళవారం, బుధవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ KG రూ. 213, స్కిన్‌లెస్ KG రూ. 243‌గా నిర్ణయించారు. ఫాంరేటు రూ. 125, రిటైల్ రూ. 147 చొప్పున అమ్ముతున్నారు.

News September 25, 2024

ADB: పోలీసుల విధులకు ఆటంకం.. 13మందికి పైగా కేసులు

image

పోలీసుల విధులకు అడ్డుపడి, పోలీస్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రోడ్డు పై వచ్చి పోయే వారికి ఇబ్బంది పెట్టిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ 2 టౌన్ సీఐ కరుణాకర్ రావ్ తెలిపారు. ఇటీవల ఓ విద్యార్థి చనిపోగా కారకులపై చర్యలు తీసుకోవాలని బస్టాండ్ ఎదుట ధర్నా చేపట్టారు. 30 పోలీస్‌యాక్ట్ అమలులో ఉన్నా ఆందోళన చేపట్టిన నేపథ్యంలో 13 మందితో పాటు మరికొంత మందిపై కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

News September 25, 2024

కామారెడ్డిలో నూతన ఎంఈఓలు వీరే

image

కామరెడ్డి జిల్లాలోని పలు మండలాలకు నూతన ఎంఈఓలను విద్యాశాఖ మంగళవారం నియమించింది. మాచారెడ్డి-దేవేందర్ రావు, లింగంపేట్-షౌకత్, బీర్కూర్-వెంకన్న, జుక్కల్-తిరుపతయ్య, రాజంపేట్-పూర్ణ చందర్, రామారెడ్డి-ఆనందరావు, నిజాంసాగర్-తిరుపతి రెడ్డి, నాగిరెడ్డిపేట్-భాస్కర్ రెడ్డి, నస్రుల్లాబాద్-చందర్, బిబిపేట్-అశోక్, దోమకొండ-విజయ్ కుమార్, పాల్వంచ-జేతాలాల్, గాంధారి-శ్రీహరిని నియమించినట్లు ఉత్తర్వులు వచ్చాయి.