India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వక్ఫ్ సవరణ చట్టం-2025కి వ్యతిరేకంగా MIM పార్టీ ఈనెల 19న శనివారం భారీ పబ్లిక్ మీటింగ్ను నిర్వహించనుంది. దీనికి సంబంధించి నగరంలో ఇప్పటికే ‘చలో దారుస్సలామ్’ పేరుతో పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగ్లు వెలిశాయి. కేంద్రం తెచ్చిన ఈ చట్టం రాజ్యాంగ విరుద్దమని ముస్లిం సంఘాలు, పార్టీలు ఆరోపిస్తున్న వేళ ఈ సభ నిర్వహణ ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, వక్ఫ్ (సవరణ) బిల్లు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చింది.
మహబూబ్నగర్ జిల్లాకి చెందిన టి.సత్యం గౌడ్, పుష్పలత దంపతుల కుమార్తె టి.హన్సికకు ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన కూచిపూడి ప్రదర్శనలో కనబరిచిన ప్రతిభకు గాను, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. ఈ సందర్భంగా స్థానిక ఎంజే ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ వారు విద్యార్థినిని శాలువాతో సత్కరించారు. ప్రతి విద్యార్థి చదువులోనే కాకుండా ప్రతి రంగంలో రాణించాలని, ఇలాంటి సత్కారాలు ఎన్నో అందుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి – 2025 చట్టంపై రెవెన్యూ అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ‘భూ భారతి’ భూమి హక్కుల రికార్డు – 2025 చట్టంపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్ఐలు, ఇతర రెవెన్యూ సిబ్బందితో పాటు ఇతర అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
HYD జిల్లాలో 14.8 లక్షలు, రంగారెడ్డి 4.9 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 4.7 లక్షల వరకు గడువు తీరిన ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే వీటితో HYDలో కాలుష్యం పెరుగుతోందని చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఒక్కోసారి AQI 120కి పైగా నమోదవుతోందంటున్నారు. ఇటీవలే డిల్లీ కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో HYDలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వేసవి దృష్టిలో పెట్టుకుని ఉపాధి పథకం కూలీలు వడదెబ్బకు గురికాకుండా వారిని అన్ని విధాలుగా కాపాడాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర పోయి అధికారులను ఆదేశించారు. బుధవారం హన్వాడలో కొనసాగుతున్న ఉపాధి పనులను ఆమె తనిఖీ చేసి కూలీలతో కాసేపు మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేసవి ముగిసే వరకు కూలీలకు పనిచేసే దగ్గర టెంటు ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు నీటిని సిద్ధంగా ఉంచాలని సూచించారు.
ఆస్తి కోసం తండ్రి మృతదేహానికి కన్న కొడుకు తలకొరివి పెట్టకపోవడంతో చివరకు చిన్న కూతురు పెట్టింది. ఈ ఘటన బుధవారం MBNR పద్మావతి కాలనీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాలనీ వాసి మాణిక్యరావు మృతిచెందారు. దహన సంస్కారాలకు ఏర్పాట్లు జరుగుతుండగా తలకొరివి పెట్టాల్సిన కుమారుడు రూ.కోటి విలువ చేసే ఇల్లు, 10 తులాల బంగారం ఇస్తేనే తలకొరివి పెడతాననడంతో చివరకు బంధువుల సూచనతో చిన్నకూతురు తలకొరివి పెట్టింది.
మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి బుధవారం పోలీస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. నెలవారి నేర సమీక్ష, గ్రేవ్, నాన్ గ్రేవ్, యూఐ కేసులు, ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసులు, మహిళలపై నేరాలు, దొంగతనాలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, అరెస్టులు వంటి అంశాలు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలని, ప్రజలకు భరోసా కల్పించాలని సూచించారు.
రానున్న పోటీ పరీక్షల సన్నద్ధం చేసేందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నిరుద్యోగులకు జిల్లా కేంద్రంలో బుధవారం ఉచిత శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, వీఆర్వో, టెట్, వీఆర్ఏ డీఎస్సీ, తదితర పలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ అందివ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇకపై జిల్లాలో రోజూ మైనర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని నిజామాబాద్ CP సాయి చైతన్య వెల్లడించారు. ఇప్పటివరకు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే పోలీసు వారే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి జరిమానాలు వేసేవారని పేర్కొన్నారు. ఇకపై మైనర్ల డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని, జైలు శిక్షతో పాటు వాహన రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని హెచ్చరించారు.
మెదక్ జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే యుడైస్ సర్వేలో పరిశీలించిన అంశాలను పక్కగా నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థుల, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాలల మౌలిక వసతుల వివరాలను పరిశీలించి, ఏమైనా తప్పులు ఉంటే యుడైస్ వెబ్ సైట్లో సరిదిద్దుకోవాలని పాఠశాల హెచ్ఎంలకు సూచించారు.
Sorry, no posts matched your criteria.