Telangana

News September 4, 2025

OU బీఫార్మసీ పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఫార్మసీ(పీసీఐ) ఎనిమిదో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజు స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 15లోగా ఫీజులను సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని ఓయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.

News September 4, 2025

బీఏ వన్ టైం చాన్స్ పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఏ వన్ టైం చాన్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఏ(ఇయర్ వైస్ స్కీమ్) వన్ టైం చాన్స్ పరీక్షలను వచ్చే నెల 7 నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

News September 4, 2025

నిబద్ధతతో పనిచేస్తేనే మనుగడ: ఖమ్మం అ.కలెక్టర్

image

నిబద్ధతతో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన గ్రామ పాలన అధికారులతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ గురువారం సమావేశం నిర్వహించి, ఆప్షన్ ఫారంలను స్వీకరించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో 253 మంది ఉత్తీర్ణత సాధించారని, వీరిలో 240 మంది లోకల్, 13 మంది నాన్ లోకల్ ఉన్నారని పేర్కొన్నారు.

News September 4, 2025

గణేష్ నిమజ్జనం.. ఓయూ పరిధిలో పరీక్షలు వాయిదా

image

గణేష్ నిమజ్జనం నేపథ్యంలో జంటనగరాల్లోని అన్ని విద్యాసంస్థలకు శనివారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ రోజు ఓయూ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలతో పాటు, బీఈడీ రెండు, మూడో సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

News September 4, 2025

ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో ఓయూకు మెరుగైన స్థానం

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్‌ఐఆర్‌ఎఫ్ (NIRF) ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానం సాధించింది. ఓవరాల్ ర్యాంకింగ్‌లో జాతీయ స్థాయిలో 53వ స్థానానికి (గతేడాది 70వ స్థానం) ఎగబాకింది. యూనివర్సిటీల కేటగిరీలో 30వ స్థానం(గతేడాది 43వ స్థానం), రాష్ట్ర యూనివర్సిటీల కేటగిరీలో 6వ స్థానం (గతేడాది 7వ స్థానం) సంపాదించింది. ఈ ఫలితాలపై వీసీ ప్రొఫెసర్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

News September 4, 2025

MBNR: రేపు వినాయక నిమజ్జనం.. పటిష్ఠ ఏర్పాట్లు

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న గణనాథులను రేపు నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి వెల్లడించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పట్టణంలో పలు డైవర్షన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ డైవర్షన్స్‌కి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రజలు శాంతియుత వాతావరణంలో కార్యక్రమంలో నిర్వహించాలన్నారు.

News September 4, 2025

HYD నుంచి నెదర్లాండ్స్ వెళ్లేందుకు డైరెక్ట్ విమాన సర్వీస్

image

హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నెదర్లాండ్స్ Amsterdam విమానాశ్రయానికి డైరెక్ట్ సర్వీస్ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు, ఢిల్లీ, ముంబై తర్వాత ఆ ప్రాంతానికి సేవలు అందించడంలో హైదరాబాద్‌కు చేరినట్లు వెల్లడించారు. 777-200ER బోయింగ్ విమానం సేవలు అందిస్తుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 4, 2025

గ్రేటర్ పరిధిలో నిమజ్జన పర్వం.. కూకట్‌పల్లిలో అత్యధికం

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జనాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. యువకులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. జీహెచ్‌ఎంసీ తాజా నివేదిక ప్రకారం ఈ నెల 2 వరకు 1,21,905 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. జోన్‌ల వారీగా చూస్తే కూకట్‌పల్లి జోన్‌లో అత్యధికంగా 41,000 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. మరోవైపు, చార్మినార్ జోన్‌లో అత్యల్పంగా 6,254 విగ్రహాలు నిమజ్జనమయ్యాయని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది.

News September 4, 2025

అటానమస్ గుర్తింపుపై జేఎన్‌టీయూ కీలక నిర్ణయం

image

రాష్ట్రంలో చాలా ఇంజినీరింగ్ కళాశాలలు తగిన ప్రమాణాలు లేకపోయినా అటానమస్ హోదా పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కళాశాలల నాణ్యతపై జేఎన్‌టీయూ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో నాక్ (NAAC) బీ, సీ గ్రేడ్ పొందిన కళాశాలలకు అటానమస్ హోదా ఇవ్వొద్దని కోరుతూ యూజీసీకి ప్రత్యేకంగా లేఖ రాయాలని జేఎన్‌టీయూ వీసీ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. ఈ నిర్ణయంతో విద్యలో ప్రమాణాలను మెరుగుపరచాలని జేఎన్‌టీయూ లక్ష్యంగా పెట్టుకుంది.

News September 4, 2025

HYD: రోబో టెక్నాలజీతో స్ట్రాం వాటర్ డ్రైన్ క్లీనింగ్

image

GHMC వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోబో టెక్నాలజీతో స్ట్రాం వాటర్ డ్రైన్ క్లీనింగ్ పనులను పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించారు. సర్కిల్ 12 మెహదీపట్నంను ఎంచుకున్నారు. వర్షపు నీటిని తరలించే డ్రైన్ పైపులలో ఉండే సిల్టును రోబోటిక్, CCTV టెక్నాలజీ సహాయంతో తొలగిస్తున్నారు. మొదట రోడ్డు క్రాసింగ్ ప్రాంతాల్లో పనులు చేపట్టారు.