India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏదైనా వాణిజ్య సముదాయం, భవనం, దుకాణం, షోరూమ్స్ ఫైర్ సేఫ్టీ లేనట్లు గమనించినా, నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించినా తక్షణం హైడ్రా కంట్రోల్ రూమ్ 9000113667, 7207923085 నంబర్లలో సమాచారం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. వాట్సాప్ ద్వారా, ఫొటోలు, వీడియోలు పంపించాలని, ‘Commissioner& HYDRAA’ హ్యాష్ ట్యాగ్తో Xలో ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ కోరారు.

NZB జిల్లాలో రెండు రోజుల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటితో ముగియనుండటంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. నేతలు గెలుపు గుర్రాల వేటలో ఉండగా.. టికెట్ వస్తుందన్న ధీమాతో కొందరు, నేతల హామీతో మరికొందరు నామినేషన్లు సమర్పిస్తున్నారు. కాగా టికెట్ దక్కుతుందో లేదోనని పలువురు ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. టికెట్ దక్కని వారు పక్క పార్టీ నేతలలో సంప్రదింపులు జరుపుతున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరుకుంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రాజకీయ సమీకరణాలకు స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. అసలైన పోరు అప్పుడే ప్రారంభం కానుంది. ఇటీవల ముగిసిన GP ఎన్నికల్లో తనదైన ముద్ర వేసిన అధికార కాంగ్రెస్ అదే ఉత్సాహాన్ని మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగిస్తుందా చూడాలి. మరోవైపు ప్రతిపక్ష BRS సైతం అధికార పార్టీ వ్యూహాలను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది.

నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెం గురుకుల కళాశాల విద్యార్థిని వి.రూప బాక్సింగ్లో సత్తా చాటింది. హైదరాబాద్లో జరిగిన అండర్-19 రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఆమె బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఫిబ్రవరిలో కర్ణాటకలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు రూప ఎంపికైంది. ప్రతిభ చాటిన రూపను ప్రిన్సిపాల్ శ్రీలత, క్రీడా విభాగం సిబ్బంది ఘనంగా అభినందించారు.

MBNR :ఎస్సీ స్టడీ సర్కిల్ నందు 5 నెలల ఉచిత శిక్షణకు (GROUP-1,2,3&4 BANKING, SSC, RRB,) నేటితో గడువు ముగియనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో డిగ్రీ అర్హత గల SC, ST, BC, and Minority అభ్యర్థులు https://www.tsstudycircle.co.in” నందు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఎంపికైన వారికి 5 నెలల పాటు ఉచిత భోజనం, వసతి, Books, నిష్ణార్థులైన అధ్యాపకులచే బోధన ఉంటుందన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తొలి ఘట్టమైన నామినేషన్ల దాఖలు పర్వం శుక్రవారం ముగియనుంది. దీంతో చివరి రోజు జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ నగరపాలక సంస్థలతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లో భారీగా నామినేషన్లు దాఖలు కానున్నాయి. కాగా నిన్న, మొన్న 2 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 400 నామినేషన్లు దాఖలు అయిన సంగతి తెలిసిందే. ఇందులో NZBలో 242, ఆర్మూర్లో 66, బోధన్లో 72, భీంగల్లో 37 నామినేషన్లు వచ్చాయి.

మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో పోటీ చేసే అభ్యర్థులను రాజకీయ పార్టీలు ఖరారు చేసే పనిలో పడ్డాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉండనుండగా ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇరు పార్టీలు అభ్యర్థుల ఎంపిక కోసం వివిధ రకాలుగా సర్వేలు నిర్వహించాయి. ప్రధానంగా సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికను చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయకపోవడంతో ‘భీ’ ఫారాలు అందజేయలేదు.

జిల్లాలో అపరాల పంటల సాగు ఏటేటా గణనీయంగా తగ్గుతోంది. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో సాగు చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ, రైతులు అపరాల సాగుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గతంలో జిల్లాలో విస్తృతంగా సాగైన కంది, బొబ్బెర, పెసర, మినుము వంటి పప్పు ధాన్యాల పంటలు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కనుమరుగవుతున్నాయి. ఐదేళ్ల క్రితం పదివేల ఎకరాలకు పైగా సాగుచేసిన కంది పంట.. ప్రస్తుతం 1700 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు.

జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీన ముగిసిపోనున్న తరుణంలో దాదాపు రూ.3,405 కోట్ల పనులకు గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం 53 అంశాలను అజెండాలో చేర్చగా ఎగ్జిబిషన్ సొసైటీకి స్థలం అద్దె తగ్గింపు వ్యవహారం తప్ప మిగతావాటిని ఆమోదించింది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్, సభ్యులు తదితరులు ఉన్నారు.

ఖమ్మం జిల్లాలో 2వ రోజు 309 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటితో ముగియనుండటంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. నేతలు గెలుపు గుర్రాల వేటలో ఉండగా.. టికెట్ వస్తుందన్న ధీమాతో కొందరు, నేతలహామీతో మరికొందరు నామినేషన్లు సమర్పిస్తున్నారు. కాగా టికెట్ దక్కుతుందో లేదోనని పలువురు ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. టికెట్ దక్కని వారు పక్క పార్టీ నేతలలో సంప్రదింపులు జరుపుతున్నారు.
Sorry, no posts matched your criteria.