Telangana

News September 25, 2024

జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చూపాలి: DEO

image

జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చూపాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. పటాన్ చెరులోని మైత్రి మైదానంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను రెండో రోజు మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 28 వరకు జిల్లా స్థాయి క్రీడలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి అమూల్యమ్మ పాల్గొన్నారు.

News September 25, 2024

వివిధ శాఖల అధికారులతో ఆదిలాబాద్ కలెక్టర్ సమావేశం

image

గ్రామ పంచాయితీ ఎన్నికలు, నర్సరీ ప్లాంటేషన్, హరితనిది, హార్టికల్చర్ ప్లాంటేషన్, వైద్యం, స్వచ్ఛదనం పచ్చదనం, పీసా యాక్ట్ తదితర అంశాలపై మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించారు. సీజినల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం అందేలా చూడాలన్నారు.

News September 25, 2024

కామారెడ్డి: సీఎంఆర్ బియ్యం సరఫరా త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

సీఎంఆర్ బియ్యాన్ని త్వరగా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రాజంపేటలోని శంకధార రైస్ మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైసుమిల్లుకు కేటాయించిన వరి ధాన్యాన్ని తొందరగా సరఫరా చేయాలని అన్నారు. రైస్ మిల్లులో వరి ధాన్యం బస్తాలను లెక్కించే విధంగా పెట్టాలని అన్నారు.

News September 25, 2024

ఓటరు జాబితా పకడ్బందీగా ఉండాలి: కలెక్టర్

image

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కట్టుదిట్టంగా చేపడుతూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రం కొనసాగుతున్న ప్రదేశాన్ని తెలిపేలా ఫోటోలను యాప్ లో అప్ లోడ్ చేయాలని బీఎల్ఓలకు సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

News September 25, 2024

ఉమ్మడి జిల్లాలో నేడు మంత్రుల పర్యటన

image

పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులు, పనుల పురోగతిపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఈనెల 25న పరిశీలించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లపూర్, వట్టెం, ఉదండాపూర్ జలాశయాలను సందర్శించనున్నారు. అనంతరం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై నీటి పారుదలశాఖతోపాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

News September 25, 2024

తత్కాల్ ద్వారా ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం: డీఈవో

image

అక్టోబర్ 3 నుంచి జరిగే ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్ష ఫీజు తత్కాల్ విధానంలో ఈనెల 25, 26న చెల్లించే అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు పరీక్ష ఫీజుతోపాటు పదవ తరగతికి అదనంగా 500, ఇంటర్ కు అదనంగా వెయ్యి రూపాయలు చెల్లించాలని చెప్పారు. పరీక్ష ఫీజు మీ సేవలో మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు.

News September 25, 2024

HYD: నిండుకుండలా హుస్సేన్‌సాగర్

image

నగరంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. ట్యాంక్‌బండ్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.41 మీటర్లకు చేరింది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇన్​ఫ్లో ఎక్కువైతే గేట్లు తెరిచి నీటిని దిగువకు వదలనున్నారు. హైదరాబాద్‌కు వర్ష సూచన ఉండడంతో‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని GHMC అధికారులు సూచించారు.

News September 25, 2024

HYD: నిండుకుండలా హుస్సేన్‌సాగర్

image

నగరంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. ట్యాంక్‌బండ్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.41 మీటర్లకు చేరింది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇన్​ఫ్లో ఎక్కువైతే గేట్లు తెరిచి నీటిని దిగువకు వదలనున్నారు. హైదరాబాద్‌కు వర్ష సూచన ఉండడంతో‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని GHMC అధికారులు సూచించారు.

News September 25, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> MLG: యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: SP
> MHBD: నెల్లికుదురులో నల్లబెల్లం పట్టివేత
> WGL: నెక్కొండలో రేషన్ బియ్యం పట్టివేత
> MLG: కంతనపల్లి వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం
> MHBD: పిడుగుపాటుతో రైతు కూలీ మృతి
> MHBD: చేపల లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా
> HNK: జూద కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
> MLG: గొల్లగుడి ఆలయ ఘటనపై కేసు నమోదు

News September 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ హుజురాబాద్ మండలంలో పిడుగుపాటుతో పశువుల కాపరి మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో బస్సు దిగుతుండగా గుండెపోటుతో వ్యక్తి మృతి. @ సైదాపూర్ మండలంలో 18 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ గొల్లపల్లి మండలంలో అంగన్వాడి కేంద్రమును, కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ మల్యాల మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు. @ జాతీయస్థాయి ట్రెక్కింగ్ శిబిరానికి ఎంపికైన జగిత్యాల విద్యార్థిని.