India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం ఎస్పీ డి.జానకి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహబూబ్నగర్ కార్పొరేషన్, భూత్పూర్ మున్సిపాలిటీల్లోని కేంద్రాలను సందర్శించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అభ్యర్థులు, అనుచరులు శాంతియుతంగా సహకరించాలని కోరారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల్లో మూడో రోజు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం పట్టణంలోని గోశాల 27వ వార్డు నుంచి మైనారిటీ మహిళ ఆసియా బేగం బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

అగ్నిమాపక శాఖ నోటీసులు ఇస్తుంది.. కానీ భవనాన్ని సీజ్ చేసే అధికారం మాత్రం లేదు. అటు GHMCకి అధికారం ఉన్నా ఫైర్ సేఫ్టీ అంశం వారి పరిధిలోకి రాదు. దీంతో నిబంధనలు పాటించని బిల్డర్లు పండుగ చేసుకుంటున్నారు. అందుకే GHMC చట్టాన్ని సవరించి 370-4B సెక్షన్లో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫైర్ సేఫ్టీని చేర్చాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ అధికారం వస్తే HYDRAA అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపగలదని అధికారులు తెలిపారు.

కరీంనగర్ జిల్లాలోని గిరిజన విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాల కోసం మార్చి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (DTDO) కె.సంగీత తెలిపారు. 5 నుంచి 8వ తరగతి విద్యార్థులు ‘న్యూ స్కీమ్’ కింద, 9, 10వ తరగతి విద్యార్థులు ‘రాజీవ్ విద్యా దీవెన’ పథకం ద్వారా ఈపాస్ (e-pass) పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. దరఖాస్తుల హార్డ్ కాపీలను వెంటనే కార్యాలయంలో సమర్పించాలన్నారు.

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయం వేడెక్కింది. మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు కోసం అధికార బలంతో పావులు కదుపుతుండగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామపంచాయతీ ఎన్నికల జోరును కొనసాగించేలా ‘కమల వ్యూహం’ అమలు చేస్తున్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ తన కేడర్ను కాపాడుకుంటూ గులాబీ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉన్నారు. దీంతో ప్రధాన పార్టీల మధ్య ఆధిపత్య పోరు రసవత్తరంగా మారింది.

HYDలో అగ్నిప్రమాదం జరిగితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనని ఇటీవలి ఘటనలు కళ్లకుగట్టాయి. విస్తుపోయే నిజం ఏంటంటే GHMC హెడ్ ఆఫీస్, హైడ్రా ఆఫీస్లోనూ ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించడం లేదనే విమర్శలున్నాయి. నగరంలో 99.99% భవనాలకు ఫైర్ NOC లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిబంధనలు కాగితాలకు పరిమితం అయ్యాయని పలువురి మాట. చట్టాలు అమలు చేసే కార్యాలయాలే ప్రమాదపు అంచున నిలబడటం శోచనీయం.

భారత జాతిపిత మహాత్మా గాంధీ పేరును రూపుమాపాలని BJP కుట్ర చేస్తున్నదని NZB జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆరోపించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా DCC కార్యాలయంలో గాంధీ చిత్ర పటానికి, నగరంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. గాంధీ పేరును మార్చాలనే కుట్రతో ఉపాధి హామీ పని పేరును మారుస్తూ జీ రామ్ జీ అని పెట్టారన్నారు. ప్రజలు BJP కుట్రలను గమనిస్తున్నారన్నారు.

ప్రజలందరి భాగస్వామ్యంతో కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మిద్దామని డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ పిలుపునిచ్చారు. గతలమడుగు గ్రామపంచాయతీ కార్యాలయంలో స్పర్ష్ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుష్ఠు వ్యాధిపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు

రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల కోసం అనేక ఉచిత గుర్తులను కేటాయించింది. వాటిలో ఏసీ, యాపిల్, గాజులు, పండ్ల బుట్ట, బ్యాట్, బ్రెడ్, గ్యాస్ సిలిండర్, కుక్కర్, రిఫ్రిజిరేటర్, జామకాయ, ద్రాక్ష, పుచ్చకాయ, కెమెరా, టెలిఫోన్, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్, బ్యాట్, ఫుట్బాల్, క్యారమ్ బోర్డు, విజిల్, కుర్చీ, టేబుల్, సోఫా, మంచం లాంటి 75 గుర్తులను కేటాయించారు.

చెంగిచర్లలో వరుస చోరీలతో ప్రజలకు కునుకు లేకుండా చేసిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరెళ్లిన సందర్భాన్ని అవకాశంగా తీసుకుని 8 ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన నిందితులను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులపై పూర్తి వివరాలు వెల్లడించేందుకు కాసేపట్లో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఉప్పల్ డీసీపీ, మల్కాజిగిరి క్రైమ్ డీసీపీ ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించనున్నారు.
Sorry, no posts matched your criteria.