Telangana

News September 25, 2024

HYD: నిండుకుండలా హుస్సేన్‌సాగర్

image

నగరంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. ట్యాంక్‌బండ్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.41 మీటర్లకు చేరింది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇన్​ఫ్లో ఎక్కువైతే గేట్లు తెరిచి నీటిని దిగువకు వదలనున్నారు. హైదరాబాద్‌కు వర్ష సూచన ఉండడంతో‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని GHMC అధికారులు సూచించారు.

News September 25, 2024

HYD: నిండుకుండలా హుస్సేన్‌సాగర్

image

నగరంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. ట్యాంక్‌బండ్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.41 మీటర్లకు చేరింది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇన్​ఫ్లో ఎక్కువైతే గేట్లు తెరిచి నీటిని దిగువకు వదలనున్నారు. హైదరాబాద్‌కు వర్ష సూచన ఉండడంతో‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని GHMC అధికారులు సూచించారు.

News September 25, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> MLG: యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: SP
> MHBD: నెల్లికుదురులో నల్లబెల్లం పట్టివేత
> WGL: నెక్కొండలో రేషన్ బియ్యం పట్టివేత
> MLG: కంతనపల్లి వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం
> MHBD: పిడుగుపాటుతో రైతు కూలీ మృతి
> MHBD: చేపల లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా
> HNK: జూద కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
> MLG: గొల్లగుడి ఆలయ ఘటనపై కేసు నమోదు

News September 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ హుజురాబాద్ మండలంలో పిడుగుపాటుతో పశువుల కాపరి మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో బస్సు దిగుతుండగా గుండెపోటుతో వ్యక్తి మృతి. @ సైదాపూర్ మండలంలో 18 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ గొల్లపల్లి మండలంలో అంగన్వాడి కేంద్రమును, కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ మల్యాల మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు. @ జాతీయస్థాయి ట్రెక్కింగ్ శిబిరానికి ఎంపికైన జగిత్యాల విద్యార్థిని.

News September 25, 2024

ఖమ్మం జిల్లాలో భారీ వర్షం… అప్రమత్తమైన అధికారులు

image

ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రానికి 155.3మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పెనుబల్లి మండలంలో 50.3 మిల్లిమీటర్లు అత్యల్పంగా ఎర్రుపాలెం మండలంలో కురిసింది. పెనుబల్లితో పాటు వేంసూర్, తల్లాడ సత్తుపల్లి ప్రాంతాల్లో కురిసినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. మరో రెండురోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

News September 24, 2024

NGKL: ఉరేసుకొని యువకుడి సూసైడ్.. మృతిపై అనుమానాలు

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని నాగనూల్ రోడ్డులో ఉన్న బీసీ కాలనీలో చిరు వ్యాపారి పూసల సాయి(25) మంగళవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సాయి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో చిరు వ్యాపారం నిర్వహించే సాయి ఆత్మహత్య పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 24, 2024

పాలమూరు- రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేయాలి: మాజీ మంత్రి

image

ప్రభుత్వం పంతాలు, పట్టింపులకు పోకుండా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 90 శాతం పనులు కేసీఆర్ హయాంలోని పూర్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు. వలసల జిల్లా అయిన పాలమూరు పచ్చబడే విధంగా చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని అన్నారు.

News September 24, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోండి: కలెక్టర్ క్రాంతి

image

ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన వారు ఈనెల 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. గతంలో ఓటు వేసిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్ లైన్, ఏఈఆర్ఓ నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పట్టభద్రుల ఓటర్లు ఫారం నంబర్- 18, ఉపాధ్యాయ ఓటర్లు ఫారం నంబర్- 19లో దరఖాస్తు చేయాలని తెలిపారు.

News September 24, 2024

వరంగల్ మార్కెట్లో చిరుదాన్యాల ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ ధర రూ.6 వేలు పలకగా, పచ్చి పల్లికాయ రూ.4,400 పలికింది. అలాగే 5531 రకం మిర్చికి రూ.14,000 ధర, పసుపునకు రూ.13,767 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా, నేడు మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగాయి.

News September 24, 2024

పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి: మంత్రి పొన్నం

image

హుస్నాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా అక్కన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న TGIIC ఇండస్ట్రియల్ పార్కులో ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో TGIIC అధికారులు, పారిశ్రామికవేత్తలు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.