Telangana

News September 24, 2024

మెదక్: ఫుట్ బాల్ జట్ల ఎంపిక

image

ఫుట్బాల్ జట్ల ఎంపికను మెదక్ వెస్లీ గ్రౌండ్ లో నిర్వహించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేష్ గంగాల ఆధ్వర్యంలో రామాయంపేట పిడి నాగరాజు, ఎంబి పూర్ పీడి రూపేందర్ ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు శ్రీనివాసరావు, మాధవరెడ్డి, వినోద్ కుమార్, సుజాత కుమారి పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట క్రీడాకారులు పాల్గొన్నారు.

News September 24, 2024

MBNR: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదరుచూపులు !

image

ఇటీవల కురిసిన వర్షలకు పేద మధ్యతరగతి కుటుంబాల్లో గుబులు మొదలవుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ అధికారులు గుర్తించిన లెక్కల ప్రకారం 46,700పైగా శిథిలావస్థకు చేరిన గృహాలు, భవనాలు ఉన్నాయని, ఈ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం జిల్లా వ్యాప్తంగా 2.71లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని త్వరగా అమలు చేసి, పేద మధ్యతరగతి వారిని ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News September 24, 2024

మళ్లీ తెరుచుకున్న సరళసాగర్ సైఫర్లు

image

వనపర్తి జిల్లాలోని సరళ సాగర్ ప్రాజెక్టు గేట్లు మళ్లీ తెచ్చుకున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టు నిండడంతో గాలి పీడనం ద్వారా.. 3 సైఫర్లు తెరుచుకున్నాయి. దీంతో ప్రాజెక్టులో ఉన్న వరద నీరు గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి వరద నీరు పారుతుంది. దీంతో ప్రయాణికుల సందడిగా మారింది. మదనాపూర్ రైల్వే గేట్ సమీపంలో మారేడు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

News September 24, 2024

యాదాద్రి కలెక్టర్‌తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష సమావేశం

image

పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి ఇంటిని సర్వే చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. నేడు ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హనుమంత్, జిల్లా అదనపు కలెక్టర్లు గంగాధర్, బెన్ షాలోమ్, ఆర్డీవో అమరేందర్, ఎలక్షన్ సెల్ డిప్యూటీ తహశీల్దార్ సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.

News September 24, 2024

చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి: శ్రీనివాస్ రెడ్డి

image

విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నంగునూరు మండలంలోని నర్మెట ఉన్నత పాఠశాలలో మండల స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలను డీఈవో ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలు ఆడడం వల్ల దృఢంగా ఉండటమే కాక మానసికంగా ఎంతో పరిణితి చెందుతారని తెలిపారు.

News September 24, 2024

MBNR: విదేశాలకు పాలమూరు మామిడి..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పండించే మామిడిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఉద్యాన శాఖ కసరత్తు చేస్తోంది. ప్రయోగాత్మకంగా రానున్న వేసవిలో 50 నుంచి 100 టన్నుల మామిడిని విదేశాలకు పంపాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు ప్రతి జిల్లాలో 1000 ఎకరాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎగుమతికి జాతీయ ఉద్యాన బోర్డు రూ.165 కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందజేస్తుందని ఉద్యాన శాఖ సహాయ సంచాలకుడు నరసయ్య తెలిపారు.

News September 24, 2024

WGL: అండమాన్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు

image

ట్రైన్ నంబర్- 16032 అండమాన్ ఎక్స్ ప్రెస్ రైలును నేడు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రీ నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వరంగల్, హసన్‌పర్తి, కాజీపేట ప్రాంతాల మీదుగా వెళ్లే రైలును రద్దు చేస్తున్నందుకు చింతిస్తున్నామని, దీన్ని గమనించాలని సూచించారు. దేవి కత్రా వద్ద రాత్రి 10:25 ప్రారంభం కావాల్సి ఉండగా రద్దు చేశారు.

News September 24, 2024

ట్రైని ఎస్సైలు నిజాయితీగా ప్రజలకు సేవలందించాలి: వరంగల్ సీపీ

image

వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు నిజాయితీగా సేవలందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు కేటాయించిన 19 మంది నూతన ట్రైని ఎస్సైలు బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైలను అభినందించారు.

News September 24, 2024

వాంకిడి: ఎడ్లబండి పై వాగు దాటిన ITDA PO

image

ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ITDA PO ఖుష్బూ గుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలం వెల్గి ఆశ్రమ పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఎడ్లబండి పై వాగు దాడి వెళ్లారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల అటెండెన్స్, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.

News September 24, 2024

ఖమ్మం: పిడుగుపాటుతో ఇద్దరు యువతుల మృతి

image

దమ్మపేట మండలం జగ్గారం గ్రామంలో మంగళవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. కాగా గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు యువతులు సున్నం అనూష (23), కట్టం నాగశ్రీ (23) మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మరో మహిళ మడకం సీతమ్మ పరిస్థితి విషమంగా ఉందన్నారు. జగ్గారంలో కౌలు వ్యవసాయం చేస్తున్న రవిరాజు చేల్లో పనులకు వెళ్ళిన కూలీల సమీపంలో పిడుగు పడిందన్నారు. సీతమ్మను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.