India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లాలో పత్తి రైతుపై ధరల పిడుగు పడింది. రానున్న వర్షాకాలం ప్రారంభానికి ముందే విత్తన కంపెనీలు అమాంతం ధరలు పెంచేశాయి. దీంతో ఇప్పటికే అతివృష్టి, అనావృష్టితో నష్టాలు చవి చూస్తున్న రైతులపై ఆర్థిక భారం మరింత పడనుంది. దీంతో పత్తి సాగువైపు ఈసారి రైతులు మొగ్గు చూపుతారని అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2019లో ప్యాకెట్ ధర రూ.710 ఉండగా ప్రస్తుతం 901కి చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భోరజ్ మండలం పూసాయిలో ఈనెల 18న ఏర్పాటు చేయనున్న భూ భారతి రెవెన్యు సదస్సులో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. బుధవారం గ్రామంలో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సందర్భంగా మంత్రిచే ప్రారంభించే సదస్సుకు ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈనెల 17వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పథకంపై అవగాహన కార్యక్రమాలను మండలాల వారీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. ముందుగా గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జడ్చర్లలో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని అవగాహన కల్పిస్తారన్నారు.
అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్లైన్ దరఖాస్తు నమోదుకు ఈనెల 25వ వరకు గడువు పొడిగించినట్లు ADB జిల్లా ఉపాధికల్పన అధికారి మిల్కా తెలిపారు. ఆర్మీ రిక్రూట్మెంట్ 2025-28 సంవత్సరానికి అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.ac.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. నెలవారి నేర సమీక్షా సమావేశంలో పెండింగ్లో ఉన్న కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు తీరు మార్చుకోవాలని, లేకుంటే నిజామాబాద్ జిల్లాలో కాలుపెట్టలేవుని ఖబడ్దార్ అని BRS జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల హామీల అమలు చేయాలని అడిగిన వారి మీదకు పోలీసులను ఉసిగొల్పి చితకబాదించడం ప్రజా పాలన అంటారా? అని ఆయన మండిపడ్డారు. పోలీసుల లాఠీచార్జికి గురైన బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు.
వక్ఫ్ సవరణ చట్టం-2025కి వ్యతిరేకంగా MIM పార్టీ ఈనెల 19న శనివారం భారీ పబ్లిక్ మీటింగ్ను నిర్వహించనుంది. దీనికి సంబంధించి నగరంలో ఇప్పటికే ‘చలో దారుస్సలామ్’ పేరుతో పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగ్లు వెలిశాయి. కేంద్రం తెచ్చిన ఈ చట్టం రాజ్యాంగ విరుద్దమని ముస్లిం సంఘాలు, పార్టీలు ఆరోపిస్తున్న వేళ ఈ సభ నిర్వహణ ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, వక్ఫ్ (సవరణ) బిల్లు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చింది.
మహబూబ్నగర్ జిల్లాకి చెందిన టి.సత్యం గౌడ్, పుష్పలత దంపతుల కుమార్తె టి.హన్సికకు ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన కూచిపూడి ప్రదర్శనలో కనబరిచిన ప్రతిభకు గాను, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. ఈ సందర్భంగా స్థానిక ఎంజే ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ వారు విద్యార్థినిని శాలువాతో సత్కరించారు. ప్రతి విద్యార్థి చదువులోనే కాకుండా ప్రతి రంగంలో రాణించాలని, ఇలాంటి సత్కారాలు ఎన్నో అందుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి – 2025 చట్టంపై రెవెన్యూ అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ‘భూ భారతి’ భూమి హక్కుల రికార్డు – 2025 చట్టంపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్ఐలు, ఇతర రెవెన్యూ సిబ్బందితో పాటు ఇతర అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
HYD జిల్లాలో 14.8 లక్షలు, రంగారెడ్డి 4.9 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 4.7 లక్షల వరకు గడువు తీరిన ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే వీటితో HYDలో కాలుష్యం పెరుగుతోందని చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఒక్కోసారి AQI 120కి పైగా నమోదవుతోందంటున్నారు. ఇటీవలే డిల్లీ కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో HYDలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.