Telangana

News April 17, 2025

ALERT: నెత్తురోడుతున్న హైదరాబాద్!

image

HYDలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 790 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో ఏకంగా 70 మంది చనిపోవడం గమనార్హం. త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు సంబంధించిన యాక్సిడెంట్ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇకనైనా ట్రాఫిక్ రూల్స్ పాటించండి.
SHARE IT

News April 17, 2025

NLG: వివాహితపై హత్యాయత్నం.. 20 ఏళ్లు జైలు

image

వివాహితపై యాసిడ్‌తో దాడి చేసిన వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ NLG జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. నాంపల్లి(M) దామెర వాసి మహేశ్ గిరిజన మహిళను తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తూ 2018లో ఆమెపై యాసిడ్ దాడికి యత్నించాడు. ఆమె నాంపల్లి PSలో ఫిర్యాదు చేయగా అప్పటి SI కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. జడ్జి రోజారమణి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

News April 17, 2025

ADB: ‘మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి’

image

జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో మహిళా సంఘాల సభ్యులకు ఆడిట్ నిర్వహణ తదితరాంశాలపై శిక్షణ తరగతులను బుధవారం నిర్వహించారు. డీఆర్డీవో రాథోడ్ రవీందర్ పాల్గొన్న మాట్లాడారు. మహిళా సంఘాల పుస్తకాలను పారదర్శకంగా ఆడిట్ నిర్వహిస్తూ వారి బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న శ్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించాలని సూచించారు.

News April 17, 2025

గోదావరిఖని పట్టణంలో యువతి ఆత్మహత్య

image

గోదావరిఖని పవర్ హౌస్‌కాలనీకి చెందిన చుంచు ప్రత్యూష(26) ఆత్మహత్య చేసుకుంది. PG పూర్తిచేసిన ప్రత్యూష కొద్ది రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. అయితే, ఇటీవల వెలువడ్డ గ్రూప్స్ ఫలితాల్లో ఉద్యోగం సాధించలేకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో బుధవారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి తండ్రి విఠల్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భూమేష్ తెలిపారు.

News April 17, 2025

ఎడపల్లి: బ్రాహ్మణపల్లిలో వివాహిత ఆత్మహత్య

image

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఎర్రోళ్ల అనిత(35) సూసైడ్ చేసుకుంది. ఆమె బంధువులు కొందరు అవమానపరిచారని మనస్థాపం చెంది ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.

News April 17, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} కల్లూరులో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ ∆} నేలకొండపల్లిలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ∆} పెనుబల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మంలో జాబ్ మేళా ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News April 17, 2025

HYD: BRS కార్పొరేటర్లు ఓటేస్తారా?

image

ఈనెల 23న జరిగే HYD స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఓటేస్తారో, లేదో అని రాజకీయ పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, MIM పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అనధికారికంగా MIMకు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. BRS ఓటర్లు కాంగ్రెస్ మద్దతిచ్చే MIM వైపు మొగ్గు చూపుతారా? లేక తటస్థంగా ఉంటారా అనేదానిపై రాజకీయంగా చర్చసాగుతోంది.

News April 17, 2025

కరీంనగర్: ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షల తేదీలు

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఓపెన్ ఇంటర్, ఎస్ఎస్సీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ విఎస్ జనార్దన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. 26 ఏప్రిల్ నుంచి మే 5వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఉంటుందని పేర్కొన్నారు.

News April 17, 2025

కరీంనగర్ జిల్లా పౌరసరఫరాల అధికారి హెచ్చరిక

image

సన్నబియ్యం పంపిణీపై ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, ప్రజలందరూ సంతోషంగా సన్నబియ్యం తీసుకుంటున్నారని కరీంనగర్ జిల్లా పౌరసరఫరాల అధికారి గట్టు నరసింగ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలను ఆందోళనకు గురిచేసి సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతో కొంతమంది సన్నబియ్యం ప్లాస్టిక్ అని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని తెలిపారు. సంబంధిత సామాజిక మాధ్యమాల అకౌంట్ హోల్డర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 17, 2025

NLG: ఉద్యోగాలు.. APPLY NOW

image

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు నమోదుకు ఈనెల 25 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి పద్మ తెలిపారు. ఆర్మీ రిక్రూట్మెంట్ 2025-28 సంవత్సరానికి అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!