Telangana

News February 2, 2026

పోటాపోటీ నామినేషన్లు.. వైరాలో ఎమ్మెల్యే రాజీ ఫార్ములా

image

వైరాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గాల నుంచి పోటాపోటీగా నామినేషన్లు దాఖలు కావడంతో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ రంగంలోకి దిగారు. ఆయన మంత్రి పొంగులేటితో చర్చించి, ఒక వర్గానికి ఛైర్మన్, మరో వర్గానికి వైస్ ఛైర్మన్ పదవి ఇచ్చేలా రాజీ కుదిర్చారు. ముఖ్య నేతలకు భవిష్యత్తులో పదవులు ఇస్తామని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి అంతర్గత విభేదాలు సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.

News February 2, 2026

TU: B.Tech విద్యార్థులకు అలర్ట్

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని B.Tech మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపుకు నేడే చివరి తేదీ అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈరోజు సాయంత్రం 5 గం.లోపు చెల్లించాలని ఆయన వెల్లడించారు. అపరాధ రుసుము రూ.100 తో రేపటికి చివరి తేదీయని పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.

News February 2, 2026

HYDలో మళ్లీ పెరిగిన ఎయిర్ పొల్యూషన్ @318

image

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ సోమవారం తెల్లవారుజామున సోమాజిగూడలోని టీచర్స్ కాలనీలో 318గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News February 2, 2026

ఖమ్మం పాలిటిక్స్.. పోలీసుల విలవిల

image

ఖమ్మం జిల్లాలో రాజకీయ పార్టీల ఆధిపత్య పోరు పోలీసులకు శాపంగా మారింది. BRS నిరసనలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న వన్ టౌన్ సీఐ కరుణాకర్ చేయి విరగింది. సీఐపై దాడిని సీరియస్‌గా తీసుకున్న సీపీ సునీల్ దత్ అరుగురిపై కేసు నమోదు చేశారు. గతంలోనూ కొందరు అధికారులు సస్పెన్షన్లు, వీఆర్ఎస్‌లతో ఇబ్బందులు పడ్డారు. పార్టీల మధ్య నలిగిపోతూ విధులు నిర్వర్తించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది.

News February 2, 2026

కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలలో బరిలో 698 మంది

image

కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. మొత్తం 60 డివిజన్లలో 698 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. వీరు దాఖలు చేసిన 1,231 సెట్ల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు తేలింది. నగరంలో కొత్తగా విలీనమైన 6వ డివిజన్‌ (బొమ్మకల్‌) లో అత్యధికంగా 22 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 32, 49వ డివిజన్లలో అత్యల్పంగా ఐదుగురు చొప్పున బరిలో ఉన్నారు.

News February 2, 2026

KNR వైభవంగా వేంకటేశ్వరుని శోభాయాత్ర

image

కరీంనగర్ నగరంలోని మార్కెట్ రోడ్ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీవారి శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. గజ వాహనంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు నీరాజనాలు పలికారు. గుర్రాలు, ఒంటెలు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చాయి. ఈ వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

News February 2, 2026

కేసీఆర్‌తో పాలమూరు నేతల భేటీ.. మున్సిపల్ ఎన్నికలపై చర్చ

image

నందినగర్‌లోని కేసీఆర్ నివాసం ఆదివారం రాజకీయ చర్చలకు వేదికైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలు మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి గులాబీ బాస్‌తో భేటీ అయ్యారు. విచారణ వివరాలతో పాటు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.

News February 2, 2026

HYD: భార్య ఆత్మహత్య బెదిరింపు.. స్టూల్‌ తన్నేసిన భర్త!

image

క్షణికావేశం, మద్యం మత్తు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫిలింనగర్‌కు చెందిన కొండల్ శనివారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్య అరుణతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తనను బెదిరించేందుకు అరుణ స్టూల్‌పై ఎక్కి ఉరి వేసుకోబోగా, ఆగ్రహంతో ఉన్న కొండల్ స్టూల్‌ను కాలితో తన్నేశాడు. దీంతో ఆమె ఊపిరాడక ప్రాణాలు విడిచింది. కుమారుడు ఇచ్చిన సాక్ష్యంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

News February 2, 2026

HYD: వంటరితనమే ఆ కుటుంబాన్ని కబళించిందా..?

image

చర్లపల్లి వద్ద రైలుకింద పడి <<19011053>>తల్లి, పిల్లలు సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. భర్త సురేందర్‌ ఉద్యోగ రీత్యా దుబాయ్‌లో ఉండగా మృతురాలు విజయ IT కంపెనీలో టీమ్‌లీడర్‌. పిల్లలు హాస్టల్‌‌లో ఉంటున్నారు. ఒంటరితనం పీడిస్తోందని బందువులతో చెప్పి, సూసైడ్‌ నోట్‌‌ రాసి తన కారులో పెట్టి, వాట్సప్‌ స్టేటస్‌గా కూడా సూసైడ్ లెటర్ పెట్టినట్లు సమాచారం. సూసైడ్‌కు కారణం ఒంటరితనమా, మరేదైనా కారణమా అన్నది తెలియాల్సి ఉంది.

News February 2, 2026

NZB: కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద..!

image

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద తలనొప్పిగా మారింది. ప్రతీ డివిజన్లో సగటున ఇద్దరు తరపున ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ ఉపసంహరణకు మూడో తేదీ వరకూ సమయం ఉండటంతో రెబెల్స్ డ్రాప్ అయ్యేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మేయర్ ఆశావహులు తక్కువగానే ఉన్నా.. కార్పొరేటర్ రేస్‌లో ఎక్కువ మంది ఉన్నారు. అయితే బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ ఇప్పటికీ ప్రకటించలేదు.