India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నేడు నిజామాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మంగళవారం కామారెడ్డిలోనూ వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.
SHARE IT

రాజధానిలో MP ఎన్నికల సందడి మొదలైంది. నేడే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదలకానుంది. HYD, SEC, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ పరిధిలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొన్నటి సాధారణ ఎన్నికల్లో BRS 17, MIM 7, INC 3, BJP 1 స్థానాల్లో విజయం సాధించాయి. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్లో వలసలు జోరందుకోవడంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. లోక్సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.

ఉమ్మడి నల్గొండలో MP ఎన్నికల సందడి మొదలైంది. నేడే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదలకానుంది. నల్గొండ, భువనగిరి లోక్సభ పరిధిలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 11, BRS 1 ఓ చోట విజయం సాధించాయి. ఖాతా తెరవకున్న బీజేపీ బలంగానే కనిపిస్తోంది. మరి లోక్సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.

కేయూ పరిధిలో ఎల్ఎల్ఎం మూడో సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) పరీక్షలు ఈనెల 22 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నర్సింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సి హెచ్. రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22, 26, 28వ తేదీల్లో మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

నకిలీ ధ్రువపత్రాల అభియోగంతో కొడంగల్ వ్యవసాయ శాఖ అధికారి బాలాజీ ప్రసాద్ సస్పెండ్ అయ్యారు. దాదాపు 14 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే హైదరాబాద్ వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలనలో 10వ తరగతి సర్టిఫికెట్ నకిలీదని రుజువు అయినట్లు సమాచారం. ఈ విషయంపై కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్ను వివరణ కోరగా బాలాజీ ప్రసాద్ సస్పెండైన విషయం వాస్తవమే అన్నారు.

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్య అభివృద్ధి కోర్సులలో శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించినట్లు ఆర్జి-3 జిఎం సుధాకర్ రావు, ఏపీఏ జిఎం వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30 వరకు సింగరేణి పరిసర ప్రాంతాల యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక నిఘా బృందాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. డబ్బు అక్రమ రవాణా, మద్యం పంపిణీకి అడ్డుకట్ట వేసేలా పోలీసులు చర్యలు చేపట్టారు. భద్రాద్రి జిల్లాలో రెండు, ఖమ్మం జిల్లా పరిధిలో పది అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 15 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు, 15 స్టాటిస్టికల్ సర్వైలెన్స్ బృందాలు, 5 అకౌంటింగ్ బృందాలను నియమించారు.

బహుజన నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు BRSలో చేరిన సందర్భంగా స్వాగతం పలుకుతున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. BRSలో బహుజన నాయకత్వం బలంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు. కొందరు BRS పార్టీలో లాభం పొంది ఇతర పార్టీలోకి వెళ్తున్నారని మండిపడ్డారు.

లోక్ సభ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు కృషి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా సరిహద్దు లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద పటిష్ట నిఘా పెట్టి తనిఖీ చేయాలన్నారు. నగదు మద్యం అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. సీ విజిల్ యాప్ ఫిర్యాదులు 100 నిమిషాల్లో పరిష్కరించాలన్నారు.

ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్, BJP విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల మహబూబ్నగర్లో నిర్వహించిన ప్రజా దీవెన సభలో CM రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ MBNR, NGKL స్థానాల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లను గెలిపిస్తే పాలమూరుకు ఢిల్లీలో ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. తాజాగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీ నాగర్ కర్నూల్ పార్లమెంట్లో విజయ్ సంకల్ప్ సభలో పాల్గొని బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
Sorry, no posts matched your criteria.