India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 101 వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని, ఒక్క రోజే గడువు కారణంగా దరఖాస్తులు పూర్తి స్థాయిలో రాలేదని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. కలెక్టర్ సూచన మేరకు 15లోగానే నియామకాలు చేపట్టామని, ఇప్పటికే 38మందిని ఎంపిక చేశామని, ఎన్నికల తర్వాత మరోమారు నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలకు వైద్యులను భర్తీ చేస్తామని తెలిపారు.

నిర్మల్ పట్టణంలోని వివేక్ చౌక్ వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నిర్మల్ పట్టణానికి చెందిన వంశీ అనే వ్యక్తి బైక్ తనిఖీ చేయగా అతని వద్ద రూ. 2 లక్షల నగదు లభించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవటంతో నగదును స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ అనిల్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్ద మెుత్తంలో నగదును తరలించరాదని తెలిపారు.

ఖమ్మం రైల్వే స్టేషన్ నర్తకి థియేటర్ సమీపంలో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడి వయస్సు 25 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సామాజిక కార్యకర్త అన్నం శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని శరీర భాగాలు ఒకచోట చేర్చి మార్చురీకి తరలించారు. మృతుడి చేతికి రాగి కడియం ఉంది.

నగరంలో నీటి వనరుల ఆక్రమణలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. బుద్ధభవన్లోని EVDM కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. GHMC పరిధి చెరువుల వద్ద FTC, బఫర్ జోన్ బౌండరీలకు సంబంధించిన మ్యాపులను ప్రదర్శించాలని సూచించారు. చెరువు బఫర్ జోన్లో నిర్మించే భవనాలను గుర్తించి తక్షణమే నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు.

నగరంలో నీటి వనరుల ఆక్రమణలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. బుద్ధభవన్లోని EVDM కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. GHMC పరిధి చెరువుల వద్ద FTC, బఫర్ జోన్ బౌండరీలకు సంబంధించిన మ్యాపులను ప్రదర్శించాలని సూచించారు. చెరువు బఫర్ జోన్లో నిర్మించే భవనాలను గుర్తించి తక్షణమే నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు.

*MHBD జిల్లాలో 2018 మార్చిలో పోలీస్ స్టేషన్లో ఓ SI బాధితుడి నుంచి రూ.14 వేలు లంచం తీసుకుంటూ.. ACBకి దొరికాడు.
*2019లో నర్సింహులపేట MPDO రూ.35 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు.
*2021లో SC సంక్షేమ శాఖకు చెందిన అభివృద్ధి అధికారి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ దొరికాడు.
*జిల్లా పరిశ్రమల శాఖ అధికారి లోన్ మంజూరు కోసం రూ.7 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు.
* తాజాగా సబ్ రిజిస్టర్ పట్టుబడడం సంచలనంగా మారింది.

కారు వెనక్కి తీస్తుండగా చక్రాల కింద పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీను వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్కు చెందిన శ్రీను, వసుంధర దంపతులు హైదరాబాదులోని అత్తాపూర్లో ఉంటున్నారు. వీరికి తొమ్మిది నెలల పాప ఉంది. అపార్ట్మెంట్లోని ఓ వ్యక్తి కారు రివర్స్ తీస్తుండగా, చక్రాల కిందపడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆళ్లపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పెద్దూరు గ్రామానికి చెందిన పోలేబోయిన లక్ష్మయ్య(40) ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిక తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కేంద్రం ప్రవేశ పెట్టిన భారత్ రైస్ అమ్మకాలు నిర్మల్ జిల్లాలో ప్రారంభమయ్యాయి. ప్రయాణ ప్రాంగణం సమీపంలోని దుకాణంలో విక్రయాలు మెుదలు పెట్టారు. 10 కిలోల బస్తా రూ. 290 చొప్పున విక్రయించారు. కొనుగొలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. ఆధార్ కార్డు, పోన్ నంబర్ ఆధారంగా బస్తాలు పంపిణీ చేశారు. తొలిరోజే 40 క్వింటాళ్లకు పైగా బియ్యం అమ్ముడుపోయాయి. బయటి రకాలతో పోలిస్తే నాణ్యంగా ఉన్నాయని దుకాణదారుడు తెలిపారు.

సిరిసిల్లలో శుక్రవారం <<12902064>>మహిళ దారుణ హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. CI రఘుపతి ప్రకారం.. వేములవాడ మండలానికి చెందిన రమ(41) భర్త మూడేళ్ల క్రితం మరణించాడు. దీంతో రమ SRCLలో కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే అనంతనగర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న బిహార్కు చెందిన ఇద్దరు 15 రోజుల క్రితం ఓ మహిళను ఇంటికి తీసుకొచ్చారు. వారే అత్యాచారం చేసి పదునైన ఆయుధంతో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.