India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఓపెన్ ఇంటర్, ఎస్ఎస్సీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ విఎస్ జనార్దన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. 26 ఏప్రిల్ నుంచి మే 5వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఉంటుందని పేర్కొన్నారు.
సన్నబియ్యం పంపిణీపై ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, ప్రజలందరూ సంతోషంగా సన్నబియ్యం తీసుకుంటున్నారని కరీంనగర్ జిల్లా పౌరసరఫరాల అధికారి గట్టు నరసింగ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలను ఆందోళనకు గురిచేసి సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతో కొంతమంది సన్నబియ్యం ప్లాస్టిక్ అని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని తెలిపారు. సంబంధిత సామాజిక మాధ్యమాల అకౌంట్ హోల్డర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్లైన్ దరఖాస్తు నమోదుకు ఈనెల 25 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి పద్మ తెలిపారు. ఆర్మీ రిక్రూట్మెంట్ 2025-28 సంవత్సరానికి అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.ac.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏఐ జనరేటెడ్ ఫోటోలను సోషల్ మీడియాలో స్మితా సబర్వాల్ రీ పోస్ట్ చేశారు. దీంతో స్మితా సబర్వాల్కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
నగరంలో కొద్దిరోజులుగా వరుస ఆందోళనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా చర్యలు చేపట్టారు. వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 19న ముస్లిం సంఘాలు ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ ర్యాలీకి పిలుపునిచ్చాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. SMలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టే వారిపై సైతం పోలీసులు నిఘా పెట్టారు.
నగరంలో కొద్దిరోజులుగా వరుస ఆందోళనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా చర్యలు చేపట్టారు. వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 19న ముస్లిం సంఘాలు ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ ర్యాలీకి పిలుపునిచ్చాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. SMలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టే వారిపై సైతం పోలీసులు నిఘా పెట్టారు.
అదేవిధంగా ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి. రామగిరి ఖిల్లా, JGTL ఖిల్లా, ధూళికట్ట బౌద్ద స్తూపం, మానేర్ డ్యామ్, ఎలంగందుల ఖిల్లా, జింకలపార్కు, నగునూరు కోట, KNR కేబుల్ బ్రిడ్జి, పురావస్తు ప్రదర్శనశాల, నాగులపేట సైఫన్, మొలంగూరు ఖిల్లా, ఉజ్వలపార్కు, డీర్ పార్కు నాంపల్లి, అలాగే గోదావరినదిపై కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, రామగుండంలోని రాముని గుండాలు సందర్శకులకు చూడదగినవి.
ఏప్రిల్, మే నెలలో వేసవి సెలవుల్లో సందర్శించడానికి ఉమ్మడి KNR జిల్లాలో సుందరమైన <<16117241>>పర్యాటక<<>> ప్రాంతాలు, ఆలయాలు అందుబాటులో ఉన్నాయి. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, ఇల్లందకుంట రామాలయం, ఓదెల మల్లికార్జనస్వామి, నాంపల్లి నరసింహస్వామి, కాళేశ్వరం, కోటి లింగాల, కొత్తకొండ వీరభధ్రస్వామి, పెంబట్ల దుబ్బ రాజేశ్వరస్వామి, రాయికల్లోని కేశవనాథ పంచముఖ లింగేశ్వర త్రికూట ఆలయాలు ఉన్నాయి.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని తాళ్లపెంటకు చెందిన దేవుడి ఆంబోతు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ ఊరంతా తల్లడిల్లింది. ఆ ఆంబోతును దేవుడి స్వరూపంగా భావిస్తూ గ్రామస్థులు ట్రాక్టర్పై వీధులలో మేళతాళాలు, కుంకుమ చల్లుతూ ఊరేగించారు. అనంతరం భక్తి శ్రద్దలతో సంప్రదాయబద్దంగా ఆంబోతుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. మహిళలు, పెద్దలు, గ్రామస్థులు పాల్గొని, కన్నీటి పర్యాంతమయ్యారు.
తండ్రిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సాపూర్ ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన వడ్ల దశరథ్(60)పై ఆయన పెద్ద కుమారుడు నాగరాజు ఈనెల 12న ఆస్తి పంపకాలు చేయడం లేదని కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో నాగరాజును బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Sorry, no posts matched your criteria.