India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. గీసుకొండలో 2 మి.మీ, సంగెంలో 0.8 అత్యల్ప వర్షపాతం నమొదయింది. ఇక మిగతా 11 మండలాల్లో ఎక్కడా చినుకు రాలలేదు. కాగా, గురువారం ఉదయం నుంచి మబ్బు పట్టి వాతావరణం చల్లబడింది. వరంగల్ నగరంలో అక్కడక్కడా తుంపర్లు పడుతున్నాయి. గత నెలలో కురిసిన విస్తారమైన వర్సలకు చెరువులు పూర్తిగా నిండిపోయి జిల్లాలో జలకళ ఉట్టిపడుతోంది.
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు HYD నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ డైరెక్టర్ డా.విమలారెడ్డి తెలిపారు. కోర్సుల్లో చేరడానికి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిప్లొమా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 19వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
# SHARE IT
కరీంనగర్లో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. శోభాయాత్ర మార్గాలలో బందోబస్తు, రూఫ్ టాప్, పుషింగ్ పార్టీ, స్టార్టింగ్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పటిష్ట బందోబస్తుతో నిమజ్జనం విజయవంతం చేయాలన్నారు.
భారీ వర్షాలు, వరదలు మిగిల్చిన విషాదం కనులారా వీక్షించి కాస్తయినా ఉపశమనం కలిగించేందుకు సీఎం వస్తాడని ఆశించిన అన్నదాతలు ఆవిరయ్యాయి. నేడు కామారెడ్డి జిల్లాలో సీఎం పర్యటనలో భాగంగా పోచారం ప్రాజెక్ట్ సందర్శిస్తారని ప్రచారం జరిగింది. పర్యటన షెడ్యూల్ లో లేకపోవడంతో నిరాశ చెందారు. వందలాది ఎకరాల పంట, రోడ్డు, ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయి. తీరని నష్టం మిగిలింది. సీఎం వస్తే కొంత ఉపశమనం కలిగేదని ఆశించారు.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయం హుండీలను అధికారులు లెక్కించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. హుండీల ద్వారా రూ.86.39 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. అన్నదానానికి రూ.1,81,734 వచ్చాయన్నారు. 122 అమెరికా డాలర్లు, ఒక మలేషియా, 15 కథార్, ఒక యూరో, యూఏఈ, 65 చైనా, ఒక బెహరిన్ కరెన్సీ, మిక్స్డ్ బంగారం, వెండి ఆభరణాలను భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
నగరంలోని సాలార్జంగ్ మ్యూజియానికు ఈనెల 6వ తేదీన సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆరోజు గణేశ్ శోభయాత్ర, నిమజ్జనోత్సవాలలు నిర్వహించనున్న నేపథ్యంలో మ్యూజియం సందర్శన నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వచ్చే వారం నుంచి రెగ్యులర్గా సందర్శకులకు అనుమతిస్తామని పేర్కొన్నారు.
బంజారాహిల్స్లో తాగునీటిని అప్రయోజనాలకు వాడిన ఇద్దరిపై HMWSSB చర్యలు తీసుకుంది. బైక్, కారు కడిగిన వ్యక్తికి రూ.10,000, నీరు ఓవర్ఫ్లో అయ్యేలా వదిలిన మరొకరికి రూ.5,000 జరిమానా విధించింది. తాగునీరు వినియోగం కోసం మాత్రమేనని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. ఇక ఉదయాన్నే ఈ నీటితో రోడ్లు, ఇంటిపరిసరాలు కడిగేవారూ.. జాగ్రత్త నెక్ట్స్ మీ వంతే.
KNR నగరంలోని భగత్ నగర్ లో విశ్వనాథ్ చెస్ అకాడమీలో ఈ నెల 6న గ్రాండ్ మాస్టర్ చెస్ కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు, అకాడమీ డైరెక్టర్ విశ్వనాథ్ ప్రసాద్, జిల్లా చెస్ అసోసియేషన్ కో-ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్, అకాడమీ సీనియర్ కోచ్ శివయ్య తెలిపారు. ఈ క్యాంపునకు ప్రముఖ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబు హాజరవుతున్నారని పేర్కొన్నారు. వివరాలకు 7569229294, 9030177607 సంప్రదించాలన్నారు.
అంబేడ్కర్ స్టేడియంలో ఈ నెల 6న జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ యోగాసన ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సర్దార్ రవీందర్ సింగ్, నాగిరెడ్డి సిద్ధారెడ్డిలు తెలిపారు. 8-18 సం.ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు బెర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో ఈ నెల 6న ఉ.9 గం.కు కోచ్లు వద్ద నమోదు చేసుకోవాలన్నారు. 8985275068 సంప్రదించాలన్నారు
విద్యుత్తు వినియోగదారుల కోసం TGNPDCL వాట్సప్ చాట్ బాట్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని KNR ఎస్ఈ రమేష్ బాబు తెలిపారు. వినియోగదారులు తమ మొబైల్ వాట్సాప్లో 7901628348 నంబరుకు ‘హాయ్’ అని మెస్సేజ్ పంపగానే వెల్కమ్ టూ TGNPDCL కాల్ సెంటర్ అని సందేశం అందుతుంది. వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యను ఎంచుకొని ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు అని తెలిపారు. పరిష్కారమైన తర్వాత వినియోగదారుడికి IVRL కాల్ వస్తుందన్నారు.
Sorry, no posts matched your criteria.