India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి WGL చెందిన అర్జున్ చదరంగంలో చరిత్ర సృష్టించాడు. HNK అడ్వకేట్స్ కాలనీకి చెందిన శ్రీనివాసరావు జ్యోతి దంపతుల కుమారుడు అర్జున్ చదరంగంలో ప్రపంచ ర్యాంకింగ్లో 3వ స్థానంలో నిలిచాడు. 14ఏళ్ల వయసులోనే యూఏఈలో నిర్వహించిన అబుదాబి మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో 17వ స్థానంలో నిలిచి గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నారు. తాజాగా జరిగిన 45వ ప్రపంచ చెస్ ఒలింపియాడ్లో భారత్కు బంగారు పతకాన్ని అందించారు.
వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డు జారీపై మంత్రివర్గ ఉపసంఘం క్లారిటీ ఇచ్చింది. దీంతో తొందర్లోనే కార్డులు రానున్నాయి. కాగా ఉమ్మడి జిల్లాలో జగిత్యాల జిల్లాలో 3317, పెద్దపల్లి జిల్లాలో 2436, కరీంనగర్ జిల్లాలో 5303, సిరిసిల్ల జిల్లాలో 1355 దరఖాస్తులు రేషన్ కార్డు కోసం పెండింగ్లో ఉన్నాయి.
ప్రయాణికుల రవాణా కష్టాలను తెలుసుకునేందుకు వరంగల్-2 డిపో కార్యాలయంలో మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ జోత్న్స తెలిపారు. ప్రయాణికులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. 99592 26048 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు తెలిపి, సలహాలు ఇవ్వాలని కోరారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహమ్మదాబాద్, చిన్నచింతకుంట, పెద్దకొత్తపల్లి, తలకొండపల్లి మండల కేంద్రాల్లో కొత్తగా జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో బోధన, బోధనేతర పోస్టులను మంజూరు చేయకపోవడంతో సమస్యలు నెలకొన్నాయి. కళాశాల భవన నిర్మాణాలు, మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని పోస్టుల మంజూరుకు కృషి చేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నెక్కొండ, వరంగల్, కాజీపేట, మీదుగా సికింద్రాబాద్ వెళ్లనున్న ఈ రైలును పలు కారణాలతో నేడు రద్దు చేశామని, ప్రయాణికులు ప్రయాణానికి వేరే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నెక్కొండ, వరంగల్ రైల్వే స్టేషన్ల వద్దకు ఇప్పటికే చేరుకున్న ప్రయాణికులు అక్కడి నుంచి వెనుతిరిగి వెళుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి ఇన్ ఫ్లో పెరుగుతోంది. తాజాగా మంగళవారం ఉ.9 గంటలకు 40 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఔట్ ఫ్లోగా 29,666 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల (80.5TMC)కు గాను ప్రస్తుతం 1091 అడుగుల (80.501TMC) నీరు నిల్వ ఉందని తెలిపారు.
నేడు పటాన్చెరులో న్యాయమైన డిమాండ్లకు రేషన్ డీలర్ల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని రాష్ట్ర అధ్యక్షుడు గూడెం మహిపాల్ రెడ్డి (MLA), రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నాయికోటి రాజు తెలిపారు. ఓ కన్వెన్షన్ హాల్లో జరిగే సభకి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో డీలర్లు హాజరు కానున్నారు. అలాగే ఈ సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారని రేషన్ డీలర్ల సంఘం సభ్యులు తెలిపారు.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో భర్తను భార్య హత్య చేసిన ఘటన బాలానగర్ మండలం పెద్దాయపల్లిలో ఈనెల 18న జరిగింది. సీఐ నాగార్జున గౌడ్ వివరాల ప్రకారం.. బాలరాజు అనే వ్యక్తి అనసూయతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అనసూయ భర్త పర్వతాలు తమకు అడ్డుగా ఉన్నాడని భావించిన బాలరాజు అనసూయతో కలిసి ఈనెల 18న పర్వతాలుకు మద్యం తాగించి గొడ్డలితో నరికి చంపారు. పోలీసులు సోమవారం ఇద్దరిని అరెస్టు చేశారు.
పదిహేడు రోజులు పూజలందుకున్న గణపతి లడ్డూను వేలం పాటలో ఓ ముస్లి యువకుడు దక్కించుకున్నాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మార్కెట్లో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూను నిమజ్జనం సందర్భంగా సోమవారం వేలం వేశారు. లడ్డూను దక్కించుకునేందుకు హోరా హోరీగా పోటీ సాగగా.. చివరకు మక్బూల్ అనే యువకుడు రూ.36,616 వేలకు సొంతం చేసుకున్నాడు. మరో లడ్డూను రూ.7వేలకు పోల జనార్ధన్ దక్కించుకున్నాడు.
మావల పోలీసుస్టేషన్ పరిధిలోని బాలాజీనగర్లో వ్యభిచారం గృహంపై సోమవారం రాత్రి దాడి చేసినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆ కాలనీలో గల ఓ ఇంట్లో మహిళ వ్యభిచారం నడిపిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. మహిళతో పాటు ముగ్గురు విటులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారివద్ద నుంచి రూ.3200 నగదు, రెండు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
Sorry, no posts matched your criteria.