Telangana

News March 27, 2024

KMM: అడుగంటిన జలాలు.. ఎండుతున్న పంటలు

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. 2,3 బోర్లు వేయిస్తున్నా ఫలితం ఉండట్లేదని, తడి లేక పంట ఎండిపోతోందని రైతులు వాపోతున్నారు. అనేక ప్రాంతాల్లో 500 అడుగుల మేర తవ్వినా నీటి జాడ లభించకపోవడం గమనార్హం. దీంతో ఆరు తడులతో ఎలాగో నెట్టుకొస్తున్నామని రైతన్నలు చెబుతున్నారు. ఎండల తీవ్రతతో మున్ముందు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.

News March 27, 2024

పాలమూరుపై సీఎం రేవంత్ రెడ్డి SPECIAL ఫోకస్!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని MBNR, NGKL ఎంపీ సీట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. తన సొంత జిల్లా కావడంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎంపీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు స్థానిక నేతలతో సీఎం సమావేశమై చర్చించారు. MBNR అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి, NGKL అభ్యర్థి మల్లురవిల గెలుపే లక్ష్యంగా ప్రచారానికి సిద్ధం కావాలని ఆయన వారికి సూచించారు.

News March 27, 2024

IPL: ఉప్పల్ వెళుతున్నారా.. ఇది మీ కోసమే..!

image

నేడు ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో IPL మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 11:30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని రాచకొండ CP తరుణ్ జోషి తెలిపారు. లారీ, డంపర్, వాటర్ ట్యాంకర్లు, మట్టి తరలించే వాహనాలు, రెడీ మిక్స్ ట్రక్ తదితర భారీ వాహనాలను దారి మళ్లించనున్నారు. ఉప్పల్ టయోటా షోరూం, నాగోల్ మెట్రో స్టేషన్ యూటర్న్, హబ్సిగూడ క్రాస్ రోడ్ వద్ద డైవర్షన్ పాయింట్లు పెట్టారు. SHARE IT

News March 27, 2024

IPL: ఉప్పల్ వెళుతున్నారా.. ఇది మీ కోసమే..!

image

నేడు ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో IPL మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 11:30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని రాచకొండ CP తరుణ్ జోషి తెలిపారు. లారీ, డంపర్, వాటర్ ట్యాంకర్లు, మట్టి తరలించే వాహనాలు, రెడీ మిక్స్ ట్రక్ తదితర భారీ వాహనాలను దారి మళ్లించనున్నారు. ఉప్పల్ టయోటా షోరూం, నాగోల్ మెట్రో స్టేషన్ యూటర్న్, హబ్సిగూడ క్రాస్ రోడ్ వద్ద డైవర్షన్ పాయింట్లు పెట్టారు. SHARE IT

News March 27, 2024

ఆన్ లైన్‌లో సీతారాముల కల్యాణ మహోత్సవ టికెట్లు

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న జరగనున్న సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం సెక్టార్ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఉభయ దాతల కళ్యాణోత్సవ టికెట్ల ధరలు రూ.7500, 2500, 2000, 1000, 300, 150, పట్టాభిషేకానికి టికెట్ల ధరలు రూ.1500, రూ.500 నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆయా టికెట్లను భక్తులు ఆన్లైన్ లో పొందవచ్చు అని చెప్పారు.

News March 27, 2024

KMR: రహదారులు కన్నీరు పెట్టిస్తున్నాయి..

image

కామారెడ్డి జిల్లాలోని రహదారులు రక్త మోడుతూ..కన్నీరు పెట్టిస్తున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. రోడ్డు ప్రమాదాలకు గురై ఎక్కడో చోట మరణాలు సంభవిస్తునే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో 96 ప్రమాదాలు జరగడం గమనార్హం. తాజాగా ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాల పరిసర ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో హాసన్ పల్లి యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

News March 27, 2024

కలిసికట్టుగా పని చేస్తే విజయం మనదే: అత్రం సక్కు

image

బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేస్తే విజయం సాధిస్తామని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. ఘనపూర్, ఉట్నూర్ గ్రామంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మాట్లాడారు. ప్రతి ఒక్క కార్యకర్త కలిసికట్టుగా పని చేస్తే విజయం తథ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్రా జైవంత్ రావు ఉన్నారు.

News March 27, 2024

‘పోలింగ్ కేంద్రాలకు సంబంధించి జాబితా సిద్ధం చేయాలి’

image

ఖమ్మం: రానున్న లోకసభ ఎన్నికల నిర్వహణకై పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లాలోని 1459 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పీవో, ఏపీవో, ఎంవోల జాబితా సిద్ధం చేయాలన్నారు. వాస్తవ సిబ్బంది ఆవశ్యకతతో పాటు, రిజర్వ్ సిబ్బంది జాబితాలో ఉండాలని అధికారులను సూచించారు.

News March 27, 2024

ఎస్సీ గ్రాడ్యుయేట్ల నుండి దరఖాస్తుల ఆహ్వానం

image

గ్రూప్ 1,2,3,4, బ్యాంకింగ్, RRB, SSC రాష్ట్ర స్థాయి& కేంద్ర స్థాయి ఉద్యోగాల కొరకు ఫౌండేషన్ కోర్సు ద్వారా మూడు నెలల పాటు డిగ్రీ చదివిన ఎస్సీ విద్యార్థులకు ఉచిత వసతి, శిక్షణ అందచేస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి L. శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 28న NLGలో గల విశ్వదీప్ విద్యాపీట్ హైస్కూల్ లో స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు.

News March 27, 2024

NRPT: ‘గ్రూప్స్ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి’

image

గ్రూప్స్ పరీక్షల ఉచిత శిక్షణకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కన్యాకుమారి అన్నారు. మంగళవారం నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. గ్రూప్స్ 1,2,3,4 అభ్యర్థులు ఈనెల 28 లోపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం సీట్లు కేటాయిస్తామన్నారు.