Telangana

News March 22, 2024

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు: రామగుండం సీపీ

image

మహిళలు, పిల్లలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. మహిళల కోసం ప్రత్యేక భద్రత చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. ప్రయాణాలు, పని ప్రదేశాలు, ఇతర చోట్ల వేధింపులు జరిగితే వెంటనే రక్షణ కోసం షీ టీమ్స్‌కు సంప్రదించాలని సూచించారు. అంతేకాకుండా ఫిర్యాదుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

News March 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

∆} మ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాల అంతరాయం
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News March 22, 2024

MBNR: ఎన్నికల కోడ్ ముగిశాకే గృహజ్యోతి

image

ఉమ్మడి MBNR జిల్లాలో గృహజ్యోతి పథకం అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు. రాష్ట్రమంతట గృహ జ్యోతి అమలు అవుతుండగా కేవలం MBNR జిల్లాలో మాత్రమే అమలు కాకపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. CM రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 27న గృహ జ్యోతి పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఫిబ్రవరి 26న ఉమ్మడి జిల్లాలో MLC కోడ్ రావడంతో తాత్కాలికంగా నిలిచిపోయింది. దీంతో కోడ్ ముగిశాకే గృహజ్యోతి అమలు కానుంది.

News March 22, 2024

సంగారెడ్డి: గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆహ్వానం

image

సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని మెదక్ రీజియన్ కోఆర్డినేటర్ భీమయ్య గురువారం తెలిపారు. దరఖాస్తులను https://WWW. TSWREIS.ac.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 22, 2024

సూర్యాపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి 

image

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడులో హెచ్.పీ బంకు పక్కన గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన యువకుడు మండలంలోని వెంకట్రాంపురానికి చెందిన చింతోజు ఉపేంద్ర చారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News March 22, 2024

దుబ్బాకలో ఒగ్గుపూజారుల గొడవ.. కేసు నమోదు

image

దుబ్బాక పట్టణంలో రేకులకుంట మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి ఒగ్గు పూజారులు ఇరు వర్గాలుగా వీడిపోయి దాడి చేసుకున్నారు. ఈ గొడవపై కేసు నమోదు చేసినట్లు దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపారు. రేకులకుంట, మల్లయ్యపల్లి గ్రామాలకు చెందిన పదకొండు మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో బాధ్యులు, మరికొంత మందిపై చర్యలు తీసుకోనున్నట్లు వివరణ ఇచ్చారు.

News March 22, 2024

‘గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం’

image

మహబూబ్ నగర్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 23 తుది గడువు అని జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారిణి ఫ్లారెన్స్ రాణి తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి 6,7,8,9 తరగతుల్లో మిగులు సీట్లు ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని, వెంటనే నిర్దేశిత వెబ్ సైట్ www.tswreis.ac.in లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

News March 22, 2024

సంగారెడ్డి: వేసవి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: కలెక్టర్

image

రానున్న ఏప్రిల్, మే నెలలో తాగునీటి సమస్య లేకుండా వేసవి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని వివరించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

News March 22, 2024

MBNR: ఓ వైపు ఎన్నికల కోలాహలం.. మరోవైపు ఫిరాయింపులు

image

ఇటు పార్లమెంట్.. అటు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఒకవైపు ప్రచార ఆర్భాటాలు జరుగుతూ ఉంటే.. మరోవైపు చేరికల తతంగం కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఇక మరికొంతమంది మారేందుకు సిద్ధపడినట్లు సమాచారం.

News March 22, 2024

ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ!

image

కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించిన రెండో జాబితాలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి పేరు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ఆశావహులు, ఎవరికి వారు టికెట్ తమకే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. కాగా, కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.