Telangana

News April 17, 2025

ఉమ్మడి కరీంనగర్ వాసులు.. వీటిలో ఎక్కడికి వెళ్తున్నారు? 1/2

image

ఏప్రిల్, మే నెలలో వేసవి సెలవుల్లో సందర్శించడానికి ఉమ్మడి KNR జిల్లాలో సుందరమైన <<16117241>>పర్యాటక<<>> ప్రాంతాలు, ఆలయాలు అందుబాటులో ఉన్నాయి. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, ఇల్లందకుంట రామాలయం, ఓదెల మల్లికార్జనస్వామి, నాంపల్లి నరసింహస్వామి, కాళేశ్వరం, కోటి లింగాల, కొత్తకొండ వీరభధ్రస్వామి, పెంబట్ల దుబ్బ రాజేశ్వరస్వామి, రాయికల్‌లోని కేశవనాథ పంచముఖ లింగేశ్వర త్రికూట ఆలయాలు ఉన్నాయి.

News April 17, 2025

KMM: ఆంబోతు మృతి.. ఆ ఊరంతా తల్లడిల్లింది.!

image

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని తాళ్లపెంటకు చెందిన దేవుడి ఆంబోతు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ ఊరంతా తల్లడిల్లింది. ఆ ఆంబోతును దేవుడి స్వరూపంగా భావిస్తూ గ్రామస్థులు ట్రాక్టర్‌పై వీధులలో మేళతాళాలు, కుంకుమ చల్లుతూ ఊరేగించారు. అనంతరం భక్తి శ్రద్దలతో సంప్రదాయబద్దంగా ఆంబోతుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. మహిళలు, పెద్దలు, గ్రామస్థులు పాల్గొని, కన్నీటి పర్యాంతమయ్యారు.

News April 17, 2025

నర్సాపూర్: తండ్రి హత్యకు ప్రయత్నించిన కొడుకు అరెస్ట్

image

తండ్రిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సాపూర్ ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన వడ్ల దశరథ్(60)పై ఆయన పెద్ద కుమారుడు నాగరాజు ఈనెల 12న ఆస్తి పంపకాలు చేయడం లేదని కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో నాగరాజును బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News April 17, 2025

ADB: యువతికు వేధింపులు.. రహీం ARREST

image

మహిళల, విద్యార్థుల రక్షణకు షీటీం నిత్యం అందుబాటులో ఉంటుందని షీటీం ఇన్‌ఛార్జ్ ఏఎస్ఐ సునీత తెలిపారు. ADBకు చెందిన యువతిని HYDలో చార్మినార్ వద్ద దుస్తుల దుకాణంలో దిగిన ఫొటోను అక్కడ పనిచేస్తున్న షేక్ రహీం మార్పింగ్ చేశాడు. దానిని ఆధారం చేసుకొని సోషల్ మీడియాలో ఆమెపై దుష్ప్రచారం చేస్తూ వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని స్పెషల్ ఆపరేషన్ ద్వారా ADBకు రప్పించి అరెస్టు చేసినట్లు ASI తెలిపారు.

News April 17, 2025

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో జమ్మికుంట విద్యార్థికి అరుదైన గౌరవం

image

జమ్మికుంట పట్టణానికి చెందిన 9వ తరగతి చదువుతున్న జోయల్ మెక్‌కు గిన్నిస్ బుక్‌లో అరుదైన గౌరవం దక్కింది. డిసెంబర్ 1, 2024లో పియానో వాయించే పోటీల్లో పాల్గొని ప్రపంచ స్థాయిలో మ్యూజిక్ ప్రదర్శనలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం పొందాడు. కీబోర్డ్ సంగీత కళాకారుల బృందం గంటలో 1046 వీడియోలు అప్లోడ్ చేసి స్థానం సాధించారు. జోయల్ మెక్‌ను స్కూల్ కరస్పాండెంట్ సునీల్ కుమార్, తల్లిదండ్రులు అభినందించారు.

News April 17, 2025

నేరడిగొండ: గంజాయి కేసులో ఇద్దరు ARREST

image

నేడిగొండ మండలంలో గంజాయి పట్టుబడ్డ కేసులో ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్టు సీఐ భీమేశ్ తెలిపారు. నేరడిగొండకు చెందిన బత్తుల కిరణ్(20) గంజాయితో ఉన్నారన్న సమాచారం మేరకు ఎస్సై శ్రీకాంత్‌తో కలిసి సోదాలు నిర్వహించగా పట్టుబడ్డారన్నారు. బత్తుల కిరణ్ విచారించగా ధాంస తండాకు చెందిన పెందూర్ లచ్చు వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారు. రూ.11,250 విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

News April 17, 2025

నర్సంపేట: రాజకీయ భీష్ముడిగా పేరు.. ఈయన గురించి మీకు తెలుసా?

image

నర్సంపేటలో తిరుగులేని రాజకీయ నాయకుడిగా మద్ధికాయల ఓంకార్‌కు గుర్తింపు ఉంది. 1972 నుంచి 1989 వరకు వరుసగా 5 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి MLAగా (MCPI(U))గెలిచి రికార్డు సృష్టించారు. రాజకీయ భీష్మునిగా పేరు ఉన్న ఈయన.. 16 ఏళ్ల వయస్సులోనే నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తుపాకీ చేత పట్టి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. 1924లో జన్మించిన ఆయన 17 OCT 2008లో మరణించారు.

News April 17, 2025

ఎంజీఎంలో దొంగలు ఉన్నారు.. జాగ్రత్త! 

image

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటూ ఆవరణలో మట్టెవాడ పోలీసులు బుధవారం బ్యానర్ కట్టారు.  ఈ మేరకు ఆసుపత్రికి వచ్చే వారికి ఈ విషయాన్ని చెబుతున్నారు. ఆసుపత్రిలో గుర్తు తెలియని దొంగలు తిరుగుతున్నారని, వాహనాలు, సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

News April 17, 2025

KNR: ఊరు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి: సీపీ

image

వేసవి సెలవుల దృష్ట్యా ఇంటికి తాళం వేసి వెళ్లేవారు, అలాగే బస్సుల్లో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఐపీఎస్ తెలిపారు. ఊరెళ్లేవారు ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదును బ్యాంక్ లాకర్‌లో భద్రపరుచుకోవాలని లేదా సురక్షితంగా తమ వెంట దాచుకోవాలని సూచించారు. ఊరికి వెళ్లే ముందు చుట్టుపక్కల నమ్మకస్తులకు, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు.

News April 17, 2025

వరంగల్ జిల్లాలో పత్తి సాగు ప్రశ్నార్థకమేనా?

image

వరంగల్ జిల్లాలో పత్తి రైతుపై ధరల పిడుగు పడింది. రానున్న వర్షాకాలం ప్రారంభానికి ముందే విత్తన కంపెనీలు అమాంతం ధరలు పెంచేశాయి. దీంతో ఇప్పటికే అతివృష్టి, అనావృష్టితో నష్టాలు చవి చూస్తున్న రైతులపై ఆర్థిక భారం మరింత పడనుంది. దీంతో పత్తి సాగువైపు ఈసారి రైతులు మొగ్గు చూపుతారని అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2019లో ప్యాకెట్ ధర రూ.710 ఉండగా ప్రస్తుతం 901కి చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!