India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులపాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మద్యానికి బానిసైన యువకుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నార్సింగిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం గ్రామానికి చెందిన శ్రీకాంత్రెడ్డి అనే యువకుడు గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై ఏ పని చేయడం లేదు. దీంతో అతని భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో విరక్తి చెందిన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై తెలిపారు.

చర్ల సరిహద్దుకు ఆనుకుని ఉన్న సుకుమా జిల్లా కిస్టారం ఏరియా కమిటీకి చెందిన సోడి కొస, సోడి సుక్కి అనే మావోయిస్టు దంపతులు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిద్దరూ గతంలో పలు దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సుకుమా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. సుక్కా అలియాస్ సోడి కోసపై రూ.5లక్షలు రివార్డు, సోడి సుక్కి మీద రూ.2 లక్షలు రివార్డు ఉంది.

కాంగ్రెస్లోకి HYD BRS నేతలు చేరుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇందులో నలుగురు MLAలే ఉన్నట్లు టాక్. ఇప్పటికే MP రంజిత్ రెడ్డి, MLA దానం, బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఒక్కరిద్దరు MLAలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. MP ఎన్నికల వేళ పార్టీ మార్పుల అంశం గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది.

కాంగ్రెస్లోకి HYD BRS నేతలు చేరుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇందులో నలుగురు MLAలే ఉన్నట్లు టాక్. ఇప్పటికే MP రంజిత్ రెడ్డి, MLA దానం, బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఒక్కరిద్దరు MLAలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. MP ఎన్నికల వేళ పార్టీ మార్పుల అంశం గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది.

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్ ,ఇంప్రూవ్మెంట్) ఈనెల 21 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఎస్ నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ రాధిక తెలిపారు. ఈనెల 21, 23, 26, 28, 30, ఏప్రిల్ 1న పరీక్షలు ఉంటాయని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

MBNR ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీల బలాబలాలు తారుమారు అవుతున్నాయి. జిల్లాలో మొత్తం 1439 ఓట్లు ఉండగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్కు 800 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పలువురు ఎంపీటీసీలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. దీంతో పార్టీల బలాబలాలు పూర్తిగా మారిపోతున్నాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని జిల్లాలో చర్చ సాగుతోంది.

ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి పలుచోట్ల నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఇటీవల ఎండ వేడి మీతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఖమ్మం: బీజేపీ అధిష్ఠానం విడుదల చేసే ఎంపీ అభ్యర్థుల నెక్స్ట్ లిస్టులో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తన పేరు ఉంటుందని జిల్లా బీజేపీ నేత జలగం వెంకట్రావు అన్నారు. మొదటి లిస్టులో తన పేరు ఎందుకు ఆగిందో పార్టీకే తెలియాలన్నారు. పాత బీజేపీ నేతలతో మాట్లాడే తాను పార్టీలో చేరినట్లు చెప్పారు. బీజేపీ సీనియర్ నేతల సహకారం తనకే ఉందన్నారు. ఖమ్మంలో బీజేపీ సత్తా ఏంటో ఎన్నికల్లో తెలుస్తుందని పేర్కొన్నారు.

ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్పీ దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30ల నుంచి 5.30ల వరకు జరగుతాయన్నారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.