India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్లో BRSకు ఎదురుదెబ్బలు తప్పడంలేదు. గత GHMC ఎన్నికల్లో 48 స్థానాల్లో విజయం సాధించిన గులాబీ పార్టీ ప్రస్తుతం 10 మందిని కోల్పోయింది. మేయర్, డిప్యూటీ మేయర్, బొంతు శ్రీదేవి, బాబా ఫసియుద్దీన్తో పాటు కీలక నేతలు INCలోకి చేరిపోయారు. మరో 10 మంది కార్పొరేటర్లు కూడా BRSను వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా రోజుకొకరు పార్టీని వీడుతుండటం గులాబీ శ్రేణులను నిరాశ పరుస్తోంది. దీనిపై మీ కామెంట్..?

ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శనివారం అయన హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు,జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, అధికారులు పాల్గొన్నారు.

కేసీఆర్ నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎండిపోయిన పంటల పరిశీలనలో భాగంగా నేడు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దరవాత్తండాకు రానున్నారు. ఉదయం ఎర్రవల్లి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10.30కు దరవాత్ తండాకు చేరుకుంటారు. అక్కడ పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేట జిల్లాకు వెళ్తారు. కేసీఆర్ పర్యటనకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేస్తున్నారు.

> కాంగ్రెస్ పార్టీలో చేరిన GHMC మేయర్
> సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద డీజిల్ పోసుకొని ఓ వ్యక్తి హల్చల్ > లంచం తీసుకుంటూ దొరికిన మీర్పేట SI
> HYD ఎన్నికల అధికారులకు కాంప్రహెన్సివ్ ట్రైనింగ్
> టెట్ ఫీజు తగ్గించాలని ఓయూలో విద్యార్థులు డిమాండ్
> నల్లగండ్ల చెరువును పరిశీలించిన GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్
> త్యాగరాయగానసభలో ఆకట్టుకున్న గానవిభావరి
> OYO హోటల్లో యువతిపై అత్యాచారం

RR: కేతిరెడ్డిపల్లిలో 42.4℃, రెడ్డిపల్లె 41.7, హైదరాబాద్ యూనివర్సిటీ 41.1, షాబాద్ 41.1, మంగళపల్లె 41.1, మైలార్దేవ్పల్లి 40.9, మియాపూర్ 40.9, అలకాపురి 40.9, మొగలిగిద్ద 40.7, ప్రొద్దుటూరు 40.9, ధర్మసాగర్ 40.6, హఫీజ్పేట 40.5, హస్తినాపురం 40.4, కందుకూరు 40.4, కాసులాబాద్ 40.4, మణికొండ 40.3, రాజేంద్రనగర్ 40.2, మధురానగర్ 40.2, ఎల్బీనగర్ 40.2, గచ్చిబౌలి 40.2, పసుమాముల 40.1, మాదాపూర్లో 40℃గా నమోదైంది.

@ సుల్తానాబాద్ మండలంలో ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య. @ వేములవాడలో వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు. @ సైదాపూర్ మండలానికి చెందిన ఆర్మీ జవాన్ పంజాబ్ లో మృతి. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ వేములవాడలో వైభవంగా రాజన్న రథోత్సవం. @ నీటిని విడుదల చేయాలని కథలాపూర్ మండలంలో రైతుల ధర్నా. @ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్లు.

తాటి చెట్టుపై నుంచి పడి యువకుడు మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన మక్కల శేఖర్(33) శనివారం గ్రామంలోని తాటి ముంజల కోసం చెట్టు ఎక్కి ప్రమాదవ శాత్తు కిందపడ్డాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి భార్య రాజ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వంశీకృష్ణ పేర్కొన్నారు.

HYDలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతోంది. గత GHMC ఎన్నికల్లో 150 స్థానాలకు ఉప్పల్, ASరావునగర్లోనే విజయం సాధించిన కాంగ్రెస్ ఎట్టకేలకు లింగోజిగూడ బైపోల్లో గెలిచింది. ఇటీవల కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సైతం పార్టీని వీడారు. ఎన్నికల ముందు HYDలో బలహీనంగా ఉన్న INC అధికారం చేపట్టిన తర్వాత పుంజుకుంది. వరుస చేరికలతో గ్రేటర్లో కాంగ్రెస్ కార్పొరేటర్లు డబుల్ డిజిట్(12)కు చేరారు. మరో 10 మంది చేరుతారని టాక్.

HYDలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతోంది. గత GHMC ఎన్నికల్లో 150 స్థానాలకు ఉప్పల్, ASరావునగర్లోనే విజయం సాధించిన కాంగ్రెస్ ఎట్టకేలకు లింగోజిగూడ బైపోల్లో గెలిచింది. ఇటీవల కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సైతం పార్టీని వీడారు. ఎన్నికల ముందు HYDలో బలహీనంగా ఉన్న INC అధికారం చేపట్టిన తర్వాత పుంజుకుంది. వరుస చేరికలతో గ్రేటర్లో కాంగ్రెస్ కార్పొరేటర్లు డబుల్ డిజిట్(12)కు చేరారు. మరో 10 మంది చేరుతారని టాక్.

కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా సింధగికి చెందిన మల్లికార్జున స్వామి భక్తుడు శ్రీశైలానికి 50 కేజీల జొన్నల బస్తాతో కాలినడకన బయలుదేరాడు. 200 కీ.మీ దాటి గద్వాల జిల్లా గట్టు మండలం బల్గెరకు చేరుకుని సేద తీరాడు. అక్కడి స్థానికులు జొన్నల మూటపై ఆరా తీయగా తాను పండించిన జొన్నలు స్వామికి అర్పించేందుకు తీసుకు వెళుతున్నట్లు చెప్పడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మరో 200 KM కాలినడకన వెళ్లాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.