Telangana

News March 22, 2024

ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఈనెల 28న జరగనున్న MBNR స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రవినాయక్ అధికారులను ఆదేశించారు. ఉపఎన్నికకు సంబంధించి నోడల్ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. ARO, నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పోలింగ్ సిబ్బందికి ఈనెల 23, 26న శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు.

News March 22, 2024

యాదాద్రి క్షేత్రంలో నేడు చండీ హోమం

image

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గం లకు మహా చండి హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.‌ ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

News March 22, 2024

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ: ఎమ్మెల్యే

image

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకాలు, దోపిడీ పాలన పోయిందని, ప్రజా పాలన వచ్చిందని చెప్పారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం తథ్యమని అన్నారు.

News March 22, 2024

MBNR: ‘తెలంగాణలో దోపిడి పాలన పోయి ప్రజల పాలన వచ్చింది’

image

రాష్ట్రంలో దోపిడీ పాలన పోయి ప్రజల పాలన వచ్చిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కేంద్రానికి చెందిన పలువురు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్ తదితరులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు.

News March 22, 2024

ఓయూ పరిధిలో బీఈడీ పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఏప్రిల్ రెండో తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.

News March 22, 2024

ఓయూ పరిధిలో బీఈడీ పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఏప్రిల్ రెండో తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.

News March 22, 2024

ఓయూ పరిధిలో బీఈడీ పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఏప్రిల్ రెండో తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.

News March 22, 2024

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: కలెక్టర్ రాహుల్ రాజ్

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని వైద్య సిబ్బందికి మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కుల్చారం మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా సిబ్బంది విధి నిర్వహణ, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి పలు సూచనలు చేసిన ఆయన.. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

News March 22, 2024

త్వరలో ధరణిపై శ్వేతపత్రం: మంత్రి పొంగులేటి

image

రాష్ట్రంలో తాగునీటి సమస్యలు రాకుండా చూస్తామని పాలేరు ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మాట్లాడుతూ.. ‘ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం. నా వద్ద ధరణికి చెందిన మరింత సమాచారం ఉంది. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం. రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తాం. మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఉండదు.’ అంటూ కీలక నిర్ణయాలు వెల్లడించారు.

News March 22, 2024

వనపర్తి: టీఆర్టీపై శిక్షణ కొరకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఎస్సి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలకు చెందిన ఎస్సీ అభ్యర్థులకు రెసిడెన్సియల్ పద్దతిలో రెండు నెలల పాటు టీఆర్టీ(DSC)పై ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎ. నుశిత తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదన్నారు. అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోగా http//tsstudycircle.co.in వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.