Telangana

News September 24, 2024

NZB: ఇంట్లో చోరీకి యత్నం.. దొంగకు దేహశుద్ధి

image

నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్‌లో గల సీఎం రోడ్ గల్లీ మదర్సా ప్రాంతంలోని వాజిద్ ఖాన్ ఇంట్లో నసీర్ అనే యువకుడు సోమవారం పట్టపగలు చోరీకి యత్నించాడు. అదే సమయంలో యజమాని పిల్లలతో సహా తిరిగి వచ్చారు. వారిని చూసిన దొంగ కత్తితో బెదిరించి పారిపోయేందుకు యత్నించాడు. కాగా అప్రమత్తమైన స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

News September 24, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు !

image

❤ప్రజావాణి..సమస్యలపై ఫోకస్
❤దామరగిద్ద:చిరుత కోసం బోన్ ఏర్పాటు
❤GDWL:టీచర్లు కావాలంటూ ఆందోళన
❤ఉమ్మడి జిల్లాలో దంచి కొట్టిన వర్షం
❤WNPT: ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి కూతురు మృతి
❤రేపు U-14,17 ఫుట్ బాల్ జట్ల ఎంపిక
❤క్రీడా రంగానికి రూ.1,41,40,000 నిధులు
❤సమస్యలు పరిష్కరించండి: వ్యవసాయ విస్తరణాధికారులు
❤లేబర్ కోడ్స్ రద్దు చేయండి:CITU,IFTU
❤ప్రతి సోమవారం మండలంలో ప్రజావాణి: కలెక్టర్లు

News September 23, 2024

నవోదయలో ప్రవేశాలకు మరోసారి గడువు పెంపు

image

వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశం కొరకు దరఖాస్తు గడువును మరోమారు పొడిగించినట్లు మండల విద్యాధికారి రామ్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం అక్టోబర్ 7వరకు పొడిగించినట్లు తెలిపారు. ఆసక్తిగలవారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 23, 2024

ADB: సీఎంకు వివరాలు తెలిపిన మంత్రి, ఎమ్మెల్యే

image

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు జైనూర్ ఘటనపై పూర్తి వివరాలను తెలియజేశారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని వారు కలిశారు. ఉట్నూర్ కొమురం భీం కాంప్లెక్స్‌లో రాయిసెంటర్ సార్మేడీలు, రాజ్ గోండు సేవా సమితి సభ్యులు, అన్ని ఆదివాసీ, కుల సంఘాల నాయకులతో సుధీర్ఘంగా చర్చించిన అంశాలపే సీఎంకు వివరించారు.

News September 23, 2024

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ జానకి

image

కోర్టు కేసులతో రణ రంగం మాదిరి కొట్లాడే కన్నా..’జాతీయ లోక్ అదాలత్’ లో రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవటమే నయమని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి సోమవారం అన్నారు. జిల్లా కేంద్రంలో ఈనెల 28న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీఎస్పీ, సీఐలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. రాజీకి అవకాశం ఉన్న కేసును జాబితాను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

News September 23, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కోరుట్లలో ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతి. @ మెట్పల్లిలో చోరీకి పాల్పడిన ముగ్గురు అరెస్ట్. @ కరీంనగర్ ప్రజావాణిలో 267, జగిత్యాల ప్రజావాణిలో 56 ఫిర్యాదులు. @ కరీంనగర్ ఎల్ఎండి లో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం. @ ప్రజావాణికి గైర్హాజరైన అధికారులపై చర్యలు ఉంటాయన్న సిరిసిల్ల కలెక్టర్. @ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై సమీక్షించిన జగిత్యాల కలెక్టర్. @ మల్లాపూర్ మండలంలో వ్యక్తి మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్

News September 23, 2024

వనపర్తి: రోడ్డు ప్రమాదంలో మృతులు వేరే

image

శ్రీరంగాపురం సమీపంలో ఇవాళ ఉదయం డీసీఎం, బైక్ ఢీకొన్న ఘటనలో తల్లీకూతురు మృతిచెందిన విషయం తెలిసింది. SI వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. నాగరాల గ్రామానికి చెందిన పురందేశ్వర్.. భార్య పిల్లలతో కలిసి బైక్‌పై శ్రీరంగాపురం వెళ్తుండగా ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో పురందేశ్వర్ భార్య స్వాతి(26), కూతురు అశ్విత(3) అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదైంది.

News September 23, 2024

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది: మాజీ గవర్నర్

image

నాగర్ కర్నూల్ పట్టణంలోని హిమాలయ హోటల్లో సోమవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ శతజయంతి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ గవర్నర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తు ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

News September 23, 2024

ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్: ఎస్పీ

image

జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవాలని ఎస్పీ ఉదయ్ కుమార్ అన్నారు. ఈ నెల 28న జిల్లా కోర్టులో నిర్వహించనున్నారని, జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసులు ఉన్నవారు సామరస్య ధోరణితో రాజీ పడదగిన ఆయా కేసులపై న్యాయ స్థానాల చుట్టూ తిరగకుండా కేసుల పరిష్కారం చేసుకోవాలని సూచించారు. అలాగే జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడే అవకాశం ఉన్న కేసులను లిస్ట్ అవుట్ చేసుకోవాలని సిబ్బందికి తెలిపారు.

News September 23, 2024

బీసీలకు 56% రిజర్వేషన్లు కేటాయించాలి: మాజీ మంత్రి

image

HYDలో బీసీ రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 56% రిజర్వేషన్లు కేటాయించాలని, బీసీలకు 90 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలుచేయాలి, కేంద్ర ప్రభుత్వం కులాలవారీగా జనాభా లెక్కలు సేకరించాలని డిమాండ్ చేశారు.