India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యుత్తు వినియోగదారుల కోసం TGNPDCL వాట్సప్ చాట్ బాట్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని KNR ఎస్ఈ రమేష్ బాబు తెలిపారు. వినియోగదారులు తమ మొబైల్ వాట్సాప్లో 7901628348 నంబరుకు ‘హాయ్’ అని మెస్సేజ్ పంపగానే వెల్కమ్ టూ TGNPDCL కాల్ సెంటర్ అని సందేశం అందుతుంది. వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యను ఎంచుకొని ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు అని తెలిపారు. పరిష్కారమైన తర్వాత వినియోగదారుడికి IVRL కాల్ వస్తుందన్నారు.
నగరంలో ఈ నెల 6న జరిగే ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పోలీసులకు బిగ్గెస్ట్ టాస్క్. భక్తులకు ఇది అతిపెద్ద శోభాయాత్ర. ఈ నేపథ్యంలో పోలీసులతో పాటు అధికారులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిమజ్జన ఏర్పాట్లపై కసరత్తులు చేసి పక్కా రూట్ మ్యాప్ను రిలీజ్ చేశారు. ఖైరతాబాద్- పాత సైఫాబాద్ PS- ఇక్బాల్ మినార్- తెలుగు తల్లివిగ్రహం- అంబేడ్కర్ విగ్రహం- ట్యాంక్ బండ్ మీదుగా నిమజ్జనానికి తరలించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అధిక సి-సెక్షన్లు చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హెచ్చరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నిబంధనలు పాటించిన ప్రైవేటు ఆసుపత్రులకు మాత్రమే అనుమతులు మంజూరు చేస్తామని, రిజిస్ట్రేషన్ లేని ఆసుపత్రులు, క్లినిక్లు, ల్యాబ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్స్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, క్లబ్బులు బంద్ చేయాలని సీపీ సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా CP నిర్ణయం తీసుకున్నారు. గణపతి నిమజ్జనం సందర్భంగా జిల్లాలో గురువారం ఉదయం
6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ పాటించాలన్నారు.
HYD బంజారాహిల్స్లో తాగునీటిని అప్రయోజనాలకు వాడిన ఇద్దరిపై హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) చర్యలు తీసుకుంది. బైక్, కారు కడిగిన వ్యక్తికి రూ.10,000, నీరు ఓవర్ఫ్లో అయ్యేలా వదిలిన మరొకరికి రూ.5,000 జరిమానా విధించింది. తాగునీరు వినియోగం కోసం మాత్రమేనని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు.
జిల్లా నుంచి ఎంపికైన 301 మంది గ్రామ పంచాయతీ అధికారులకు (జీపీవో) ఈ నెల 5న ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేయనున్నారు. వారిని ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నిజామాబాద్ డివిజన్ వారు పాత కలెక్టరేట్ మైదానం నుంచి, ఆర్మూర్ డివిజన్ వారు ఆర్మూర్ తహశీల్దార్ కార్యాలయం, బోధన్ డివిజన్ వారు బోధన్ తహశీల్దార్ కార్యాలయం నుంచి బయలుదేరుతారన్నారు.
గీసుగొండ మండలం తిమ్మాపురంలో రైతులకు అవగాహన కల్పించేందుకు డ్రోన్ సాయంతో నానో యూరియా పిచికారీ ప్రదర్శనను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై పరిశీలించారు. నానో యూరియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్ రైతులకు వివరించారు. ఉత్పాదకత పెంపుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, రైతులు దీనిని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువు పెంచడం జరిగిందని అదనపు కలెక్టర్ శ్రీజ తెలిపారు. అపరాధ రుసుం లేకుండా ఈనెల 7 వరకు, అపరాధ రుసుంతో 20వ తేదీ వరకు పొడిగించారన్నారు. ఆసక్తిగల అభ్యాసకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 80084 03522 నెంబరును సంప్రదించాలని పేర్కొన్నారు.
కరీంనగర్ పట్టణం భగత్నగర్లో సాయి కృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న లీగల్ మెట్రోలజీ (తూనికలు, కొలతలు) కార్యాలయాలను LMD కాలనీ, మహాత్మా నగర్ (తిమ్మాపూర్ మండలం), సర్వే నంబర్: 443లో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ భవనంలోకి మార్చారు. ఈ కొత్త భవనంలో లీగల్ మెట్రోలజీకి సంబంధించిన మూడు విభాగాల కార్యాలయాలను మార్చారు. ప్రజలు ఇకపై కొత్త చిరునామాలో సేవలు పొందగలరని అధికార విభాగం తెలిపింది.
2025-26 విద్యా సంవత్సరానికి PHD ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఉర్దూ, బిజినెస్ మేనేజ్మెంట్, కామర్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, బాటని, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, జియో ఇన్ఫర్మాటిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మాసూటికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, సోషల్ వర్క్, లా విభాగాల్లో ఖాళీల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి తెలిపారు.
Sorry, no posts matched your criteria.