Telangana

News April 23, 2025

కామారెడ్డి: ఇంటర్ ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య

image

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో భిక్కనూర్‌కి చెందిన పూజ (18) సూసైడ్ చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. పూజకు తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ వద్దే ఉంటూ చదువుకుంటోంది. పూజ మృతితో భిక్కనూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 23, 2025

HYD: యూనిట్లకు బిల్లు ఎలా నిర్ధారిస్తారంటే!

image

గ్రేటర్ HYDలో వేసవి వేళ కొందరికి కరెంట్ బిల్లులు వేలల్లో వస్తుండగా షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల వివరాలను హబ్సిగూడ అధికారులు తెలిపారు. జీరో నుంచి 50 యూనిట్లకు రూ.1.95, 50 నుంచి 100 యూనిట్లకు రూ.3.10, 101-200 యూనిట్లకు రూ.4.80, 201-300 యూనిట్లకు రూ.7.70 చొప్పున ఒక్కో యూనిట్‌పై ఇలా విద్యుత్ ఛార్జీ ఉంటుందని, లిమిట్ దాటితే యూనిట్ ఛార్జీ మారుతుందని తెలిపారు.

News April 23, 2025

HYD: యూనిట్లకు బిల్లు ఎలా నిర్ధారిస్తారంటే!

image

గ్రేటర్ HYDలో వేసవి వేళ కొందరికి కరెంట్ బిల్లులు వేలల్లో వస్తుండగా షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల వివరాలను హబ్సిగూడ అధికారులు తెలిపారు. జీరో నుంచి 50 యూనిట్లకు రూ.1.95, 50 నుంచి 100 యూనిట్లకు రూ.3.10, 101-200 యూనిట్లకు రూ.4.80, 201-300 యూనిట్లకు రూ.7.70 చొప్పున ఒక్కో యూనిట్‌పై ఇలా విద్యుత్ ఛార్జీ ఉంటుందని, లిమిట్ దాటితే యూనిట్ ఛార్జీ మారుతుందని తెలిపారు.

News April 23, 2025

కరీంనగర్ జిల్లాలో మండుతున్న ఎండలు

image

కరీంనగర్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటల తరువాత ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర, మానకొండూర్ మండలాల్లో 44.0°C నమోదు కాగా, కొత్తపల్లి, చొప్పదండి 43.8, కరీంనగర్, జమ్మికుంట 43.7, శంకరపట్నం 43.6, రామడుగు, ఇల్లందకుంట, తిమ్మాపూర్ 43.5, వీణవంక 43.4, గన్నేరువరం, కరీంనగర్ రూరల్ 43.3, చిగురుమామిడి 43.1, సైదాపూర్ 42.8, హుజూరాబాద్ 42.2°C గా నమోదైంది.

News April 23, 2025

NZB: ఇంటర్ రిజల్ట్స్.. విద్యార్థి అదృశ్యం

image

సాలూర మండలం హున్సా గ్రామానికి చెందిన కలసాయి కృష్ణ మంగళవారం మధ్యాహ్నం నుంచికనబడడం లేదని కుటుంబీకులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవలే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసిన సాయికృష్ణ నిన్న ఫలితాలు వెలుబడినప్పటి నుంచి కనబడకపోవడంతో గ్రామంలో, బంధువుల వద్ద వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో భయాందోళన గురవుతున్నారు. నేడు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

News April 23, 2025

నారాయణపేట: బాలికపై అత్యాచారం.. జైలుకు యువకుడు

image

NRPT జిల్లా దామరగిద్ద వాసి <<16176540>>బోయిని శ్రీనివాస్(24)<<>> ఓ బాలికను HYDలోని ఓ కిరాయి రూమ్‌కి తీసుకెళ్లి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని కోస్గి సీఐ సైదులు తెలిపారు. విచారణ చేపట్టిన అనంతరం నిందితుడిని పట్టుకుని కోస్గి న్యాయస్థానంలో హాజరుపరిచామన్నారు. కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించిందని చెప్పారు. అతడిని MBNR సబ్‌ జైలుకు తరలించామన్నారు.

News April 23, 2025

MNCL: జిల్లాలో విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లక్షెట్టిపేటలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని సుస్మిత (16) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెంది ఉరేసుకుందన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 23, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} మధిరలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఓపెన్ 10వ తరగతి పరీక్షలు ∆} వైరా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

News April 23, 2025

వరంగల్: గ్రేట్.. ఒకే ఏడాదిలో 11 మందికి ఆర్మీలో జాబ్స్

image

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని గిరిజన సంక్షేమ సైనిక్ స్కూల్ నుంచి ఒకే ఏడాదిలో 11 మంది అగ్నివీర్‌లో ఉద్యోగాలు సాధించారు. గత నెలలో ఇదే పాఠశాలకు చెందిన 8 మందికి జాబ్స్ వచ్చాయి. రెండు రోజుల క్రితం విడుదలైన రెండో విడత ఫలితాల్లో మరో ముగ్గురికి కేంద్ర ప్రభుత్వ కొలువులు వచ్చాయి. ఉపాధ్యాయుల అంకితభావంతోనే ఈ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు.

News April 23, 2025

మెదక్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉచిత బైక్ మెకానిక్ కోసం గ్రామీణ ప్రాంతానికి చెందిన పురుషులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్బీఐ శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ మంగళవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 18 నుంచి 45 సంవత్సరాల వరకు పురుషులు అర్హులని చెప్పారు. ఆధార్, రేషన్ కార్డు, నాలుగు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో మే 8 వరకు బైపాస్ రహదారిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.