Telangana

News September 23, 2024

ADB: సీఎంకు వివరాలు తెలిపిన మంత్రి, ఎమ్మెల్యే

image

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు జైనూర్ ఘటనపై పూర్తి వివరాలను తెలియజేశారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని వారు కలిశారు. ఉట్నూర్ కొమురం భీం కాంప్లెక్స్‌లో రాయిసెంటర్ సార్మేడీలు, రాజ్ గోండు సేవా సమితి సభ్యులు, అన్ని ఆదివాసీ, కుల సంఘాల నాయకులతో సుధీర్ఘంగా చర్చించిన అంశాలపే సీఎంకు వివరించారు.

News September 23, 2024

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ జానకి

image

కోర్టు కేసులతో రణ రంగం మాదిరి కొట్లాడే కన్నా..’జాతీయ లోక్ అదాలత్’ లో రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవటమే నయమని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి సోమవారం అన్నారు. జిల్లా కేంద్రంలో ఈనెల 28న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీఎస్పీ, సీఐలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. రాజీకి అవకాశం ఉన్న కేసును జాబితాను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

News September 23, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కోరుట్లలో ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతి. @ మెట్పల్లిలో చోరీకి పాల్పడిన ముగ్గురు అరెస్ట్. @ కరీంనగర్ ప్రజావాణిలో 267, జగిత్యాల ప్రజావాణిలో 56 ఫిర్యాదులు. @ కరీంనగర్ ఎల్ఎండి లో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం. @ ప్రజావాణికి గైర్హాజరైన అధికారులపై చర్యలు ఉంటాయన్న సిరిసిల్ల కలెక్టర్. @ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై సమీక్షించిన జగిత్యాల కలెక్టర్. @ మల్లాపూర్ మండలంలో వ్యక్తి మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్

News September 23, 2024

వనపర్తి: రోడ్డు ప్రమాదంలో మృతులు వేరే

image

శ్రీరంగాపురం సమీపంలో ఇవాళ ఉదయం డీసీఎం, బైక్ ఢీకొన్న ఘటనలో తల్లీకూతురు మృతిచెందిన విషయం తెలిసింది. SI వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. నాగరాల గ్రామానికి చెందిన పురందేశ్వర్.. భార్య పిల్లలతో కలిసి బైక్‌పై శ్రీరంగాపురం వెళ్తుండగా ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో పురందేశ్వర్ భార్య స్వాతి(26), కూతురు అశ్విత(3) అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదైంది.

News September 23, 2024

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది: మాజీ గవర్నర్

image

నాగర్ కర్నూల్ పట్టణంలోని హిమాలయ హోటల్లో సోమవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ శతజయంతి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ గవర్నర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తు ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

News September 23, 2024

ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్: ఎస్పీ

image

జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవాలని ఎస్పీ ఉదయ్ కుమార్ అన్నారు. ఈ నెల 28న జిల్లా కోర్టులో నిర్వహించనున్నారని, జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసులు ఉన్నవారు సామరస్య ధోరణితో రాజీ పడదగిన ఆయా కేసులపై న్యాయ స్థానాల చుట్టూ తిరగకుండా కేసుల పరిష్కారం చేసుకోవాలని సూచించారు. అలాగే జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడే అవకాశం ఉన్న కేసులను లిస్ట్ అవుట్ చేసుకోవాలని సిబ్బందికి తెలిపారు.

News September 23, 2024

బీసీలకు 56% రిజర్వేషన్లు కేటాయించాలి: మాజీ మంత్రి

image

HYDలో బీసీ రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 56% రిజర్వేషన్లు కేటాయించాలని, బీసీలకు 90 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలుచేయాలి, కేంద్ర ప్రభుత్వం కులాలవారీగా జనాభా లెక్కలు సేకరించాలని డిమాండ్ చేశారు.

News September 23, 2024

వనపర్తి మహిళకు గిన్నిస్ బుక్ రికార్డు.. ప్రశంసలు

image

మహిళా మనోవికాస్ వ్యవస్థాపకురాలు మాధవి సూర్యభట్ల రెండోసారి గిన్నిస్ బుక్ రికార్డుకెక్కారు. మాధవి నేతృత్వంలో 450 మంది మహిళలు 58,112 క్రోంచట్ స్క్వేర్స్‌ను అతి తక్కువ సమయంలో రూపొందించి ప్రదర్శించి గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. ఈ గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ఈ బృందంలో వనపర్తికి చెందిన మారం ప్రశాంతి ఉండటం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెపిపారు.

News September 23, 2024

రేపు U-14, 17 జిల్లాస్థాయి ఫుట్ బాల్ జట్ల ఎంపిక

image

జడ్చర్లలోని బాదేపల్లి జెడ్పీహెచ్ఎస్ ప్రాంగణంలో మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి అండర్-14,17 ఫుట్ బాల్ బాల, బాలికల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి తెలిపారు. U-14 విభాగానికి 01.01.2011, U-19 విభాగానికి 01.01.2008 తర్వాత జన్మించిన వారు అర్హులని, బోనోఫైడ్, ఆధార్ కార్డు జీరాక్సులతో హాజరుకావాలని కోరారు.

News September 23, 2024

సంగారెడ్డి: క్రికెట్ ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక

image

ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అండర్- 19 జట్టును సంగారెడ్డిలోని జూబ్లీ క్లబ్‌లో సోమవారం ఎంపిక చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 105 మంది క్రీడాకారులు ఎంపికలో పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ చూపిన 16 మందిని ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు క్రికెట్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి తెలిపారు.