Telangana

News September 23, 2024

సంగారెడ్డి: క్రికెట్ ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక

image

ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అండర్- 19 జట్టును సంగారెడ్డిలోని జూబ్లీ క్లబ్‌లో సోమవారం ఎంపిక చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 105 మంది క్రీడాకారులు ఎంపికలో పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ చూపిన 16 మందిని ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు క్రికెట్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి తెలిపారు.

News September 23, 2024

దాడుల‌తో MLA సునీత మ‌నో ధైర్యాన్ని దెబ్బ‌తీయ‌లేరు: కేటీఆర్

image

శివంపేట మండ‌లం గోమారంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతాల‌క్ష్మారెడ్డి ఇంటిపై నిన్న రాత్రి దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సునీతా ల‌క్ష్మారెడ్డితో కేటీఆర్ మాట్లాడారు. నిన్న రాత్రి గోమారంలో ఆమె ఇంటిపై జ‌రిగిన దాడి వివ‌రాల‌ను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. దాడుల‌తో MLA సునీత మ‌నో ధైర్యాన్ని దెబ్బ‌తీయ‌లేరు అన్న కేటీఆర్ ఆమెకు అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు.

News September 23, 2024

గచ్చిబౌలి: సెప్టెంబర్ 27న ఇండియా ఇంటర్నెట్ డే

image

గచ్చిబౌలి పరిధిలోని T-HUBలో సెప్టెంబర్ 27న ఇండియా ఇంటర్నెట్ డే వేడుకలు నిర్వహిస్తామని కార్య నిర్వాహకులు తెలిపారు. AI, డిజిటల్ విధానం, ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో విస్తృతంగా చర్చలు జరపనున్నారు. మైక్రోసాఫ్ట్, ఇతర కంపెనీలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.

News September 23, 2024

HYD: 8 నెలల్లో 54,483 గృహాల రిజిస్ట్రేషన్లు

image

HYDలో 2024 జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల్లో 54,483 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక్క ఆగస్టులోనే ఏకంగా 6,439 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 18% పెరగడం గమనార్హం. 2023లో 46,287 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడించింది.

News September 23, 2024

WGL: అండర్-19 జిల్లా జట్టు ఎంపిక..

image

ఈనెల 26 నుండి వరంగల్ కేంద్రంగా అండర్-19 అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ జరగనున్న నేపథ్యంలో జిల్లా జట్టును ఎంపిక చేశారు. సీకేఎం కళాశాల మైదానంలో నిన్న, ఈరోజు ఏర్పాటుచేసిన సెలక్షన్ ప్రాసెస్లో 200 మంది క్రీడాకారులు పాల్గొనగా 18 మందిని జట్టుగా ఎంపిక చేసినట్లు క్రికెటర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జట్టు సభ్యులకు సూచించారు.

News September 23, 2024

యూపీ సీఎంను కలిసిన మేయర్, కార్పొరేటర్ల బృందం

image

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయే లక్ష్మి ఆధ్వర్యంలో కార్పొరేటర్‌ల బృందం ఈరోజు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్‌లను ఆయనకు మేయర్ పరిచయం చేశారు. ఈ సందర్బంగా జీహెచ్ఎంసీలో బెస్ట్ ప్రాక్టీసెస్, శానిటేషన్, పచ్చదనం, యస్ఎన్డీపి, సీఆర్ఎంపీ, హెచ్ సిటీ పథకాలపై యూపి సీఎంకి మేయర్ వివరించారు.

News September 23, 2024

HYD: 8 నెలల్లో 54,483 గృహాల రిజిస్ట్రేషన్లు

image

HYDలో 2024 జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల్లో 54,483 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక్క ఆగస్టులోనే ఏకంగా 6,439 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 18% పెరగడం గమనార్హం. 2023లో 46,287 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడించింది.

News September 23, 2024

NZB: ప్రజావాణి కార్యక్రమానికి 97 ఫిర్యాదులు

image

ప్రజావాణికి 97 ఫిర్యాదులు అందాయి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 97 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్‌లకు సమర్పించారు.

News September 23, 2024

HYD: మహాలక్ష్మి పథకంతో ప్రయాణికులు డబుల్

image

HYD, సికింద్రాబాద్, రంగారెడ్డి ఆర్టీసీ రీజియన్ల పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో గతంలో 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఆ సంఖ్య సుమారు 22 లక్షలకు చేరుకుందని అధికారులు తెలియజేశారు. దీన్నిబట్టి గమనిస్తే మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయినట్లుగా తెలుస్తోంది.

News September 23, 2024

రామప్ప దేవాలయం సమీపంలో గుప్తనిధుల తవ్వకం

image

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పక్కనున్న గొల్లగుడిలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు స్థానికులు గుర్తించారు. గుడి పైకప్పు ధ్వంసం చేసి, లోపల తవ్వకాలు చేపట్టి, శిల్పాలను కూడా ధ్వంసం చేశారు. గుడి వద్ద దుండగులు ఉపయోగించిన నిచ్చెనతో పాటు పలు వస్తువులు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకున్న పురావస్తు శాఖ అధికారులు వెంకటాపురం ఠాణాలో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.