India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గచ్చిబౌలి పరిధిలోని T-HUBలో సెప్టెంబర్ 27న ఇండియా ఇంటర్నెట్ డే వేడుకలు నిర్వహిస్తామని కార్య నిర్వాహకులు తెలిపారు. AI, డిజిటల్ విధానం, ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో విస్తృతంగా చర్చలు జరపనున్నారు. మైక్రోసాఫ్ట్, ఇతర కంపెనీలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.
HYDలో 2024 జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల్లో 54,483 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక్క ఆగస్టులోనే ఏకంగా 6,439 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 18% పెరగడం గమనార్హం. 2023లో 46,287 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడించింది.
ఈనెల 26 నుండి వరంగల్ కేంద్రంగా అండర్-19 అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ జరగనున్న నేపథ్యంలో జిల్లా జట్టును ఎంపిక చేశారు. సీకేఎం కళాశాల మైదానంలో నిన్న, ఈరోజు ఏర్పాటుచేసిన సెలక్షన్ ప్రాసెస్లో 200 మంది క్రీడాకారులు పాల్గొనగా 18 మందిని జట్టుగా ఎంపిక చేసినట్లు క్రికెటర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జట్టు సభ్యులకు సూచించారు.
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయే లక్ష్మి ఆధ్వర్యంలో కార్పొరేటర్ల బృందం ఈరోజు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్లను ఆయనకు మేయర్ పరిచయం చేశారు. ఈ సందర్బంగా జీహెచ్ఎంసీలో బెస్ట్ ప్రాక్టీసెస్, శానిటేషన్, పచ్చదనం, యస్ఎన్డీపి, సీఆర్ఎంపీ, హెచ్ సిటీ పథకాలపై యూపి సీఎంకి మేయర్ వివరించారు.
HYDలో 2024 జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల్లో 54,483 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక్క ఆగస్టులోనే ఏకంగా 6,439 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 18% పెరగడం గమనార్హం. 2023లో 46,287 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడించింది.
ప్రజావాణికి 97 ఫిర్యాదులు అందాయి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 97 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు, అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్లకు సమర్పించారు.
HYD, సికింద్రాబాద్, రంగారెడ్డి ఆర్టీసీ రీజియన్ల పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో గతంలో 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఆ సంఖ్య సుమారు 22 లక్షలకు చేరుకుందని అధికారులు తెలియజేశారు. దీన్నిబట్టి గమనిస్తే మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయినట్లుగా తెలుస్తోంది.
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పక్కనున్న గొల్లగుడిలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు స్థానికులు గుర్తించారు. గుడి పైకప్పు ధ్వంసం చేసి, లోపల తవ్వకాలు చేపట్టి, శిల్పాలను కూడా ధ్వంసం చేశారు. గుడి వద్ద దుండగులు ఉపయోగించిన నిచ్చెనతో పాటు పలు వస్తువులు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకున్న పురావస్తు శాఖ అధికారులు వెంకటాపురం ఠాణాలో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.
వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి గీతం యూనివర్సిటీ రూ.కోటి విరాళం అందజేశారు. గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఎంపీ శ్రీ భరత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచిన వారిని ముఖ్యమంత్రి అభినందించారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు రూ.50 లక్షల విరాళం అందించడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు కాసేపు మహేశ్ బాబు సతీమణి నమ్రతతో సీతక్క ముచ్చటించారు. ఉదారత అందరికీ స్ఫూర్తి అని, మహేశ్ బాబు దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నానని సీతక్క చెప్పుకొచ్చారు.
Sorry, no posts matched your criteria.