Telangana

News September 28, 2024

సిద్దిపేట: పెళ్లి చేసుకుంటానని మోసం.. కేసు నమోదు

image

సిద్దిపేట జిల్లాలో యువకుడిపై కేసు నమోదైంది. యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన చేసినట్లు తొగుట ఎస్సై రవికాంతరావు తెలిపారు. మిరుదొడ్డి మండలానికి చెందిన యువతిని తొగుట మండల కేంద్రానికి చెందిన సిలివేరి నరేశ్ గౌడ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె వద్ద నుంచి నగదు తీసుకున్నాడు. చివరకు పెళ్లికి నిరాకరించడంతో శుక్రవారం యువతి పోలీసులను ఆశ్రయించింది.

News September 28, 2024

జూరాలలో 11 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి

image

జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో శుక్రవారం 11 యూనిట్ల నుంచి ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈలు సురేశ్, సూరిబాబు తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల నుంచి 196 మెగావాట్లు, 201.187 ఎం.యూ, దిగువలో 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 174.750 ఎం.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ కేంద్రాల్లో 32,475 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి 360.108 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించారు.

News September 28, 2024

ALERT.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వర్ష సూచన!

image

కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు రానున్న 5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉందని పొలాస పరిశోధన స్థానం శాస్త్రవేత్త లక్ష్మి తెలిపారు. ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 22-24 డిగ్రీలు, గరిష్ఠంగా 32-36 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యంగా రైతులు గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News September 28, 2024

పెబ్బేరు: శేరుపల్లిలో ఐదు రోజులుగా నిలిచిన నీటి సరఫరా

image

వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలంలోని శేరుపల్లిలో 5రోజుల నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. వెంకటాపురం శేరుపల్లి మధ్యన నిర్మిస్తున్న బ్రిడ్జి పనుల్లో పైపులైన్ పగిలిపోవడంతో సమస్య ఏర్పడింది. మరమ్మతు చేపట్టాలని గ్రామస్థులు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే పంచాయతీ సిబ్బంది ట్యాంకులతో గ్రామాల్లోకి నీటిని తీసుకొస్తున్నట్లు తెలిపారు.

News September 28, 2024

ఖమ్మం: వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవు

image

ఖమ్మం మార్కెటుకు 2 రోజులు సెలవులను మార్కెట్ అధికారులు ప్రకటించారు. నేడు, రేపు వారాంతపు సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌‌కి సరుకులు తీసుకొని రావద్దని అధికారులు సూచిస్తున్నారు. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభమవుతుందని తెలిపారు.

News September 28, 2024

కరీంనగర్: 4 వరకు DSC అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

image

DSC 2008 అభ్యర్థుల కల ఎట్టకేలకు సాకారం కానుంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బీఈడీతో డీఎస్సీ రాసి ఉద్యోగాలు రానివారు 220కి పైగా అభ్యర్థులున్నారు. అభ్యర్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ వెబ్‌సైట్ పొందుపరిచినట్లు DEO జనార్ధన్‌రావు పేర్కొన్నారు. ఈ జాబితాలోని అభ్యర్థులు అక్టోబర్‌ 4 వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉ.10.30 గంటల నుంచి సా.5 గంటల వరకు సర్టిఫికెట్లను పరిశీలన చేసుకోవాలని సూచించారు.

News September 28, 2024

NLG: దసరా బంపర్ ఆఫర్లు.. మన జిల్లాలోనే!

image

తెలంగాణలో అతిపెద్ద పండగ ‘దసరా’. ఈ పండుగకు వస్త్ర, నగల వ్యాపార సంస్థలు భారీగా ఆఫర్లను పెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. NLG జిల్లాలోని లెంకలపల్లి, వెల్మకన్నె గ్రామాలలోని యువకులు వినూత్నంగా ఆలోచించి ఓ ఆఫర్ పెట్టారు. 2024 దసరాకు బంపర్ ఆఫర్ అంటూ.. ‘రూ. 100 కొట్టు మేకను పట్టు’ అనే ఆఫర్ పెట్టారు. ఆఫర్‌లో మేక, నాటు కోళ్లు, మందు బాటిళ్లు గెలిచిన వారికి బహుమతిగా ప్రకటించారు.

News September 28, 2024

కామారెడ్డి డాక్టర్‌ను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు

image

గాంధారిలో పనిచేసే ప్రభుత్వ వైద్యుడు ప్రవీణ్‌ను మహారాష్ట్ర పోలీసులు లింగ నిర్ధారణ కేసులో శుక్రవారం అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉద్గిర్ మండలానికి చెందిన ఓ గర్భిణికి లింగనిర్ధారణ చేయడంతో ఉద్గీర్‌లోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ చేయించుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు దానికి కారణమైన డా.ప్రవీణ్‌ను అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం మహారాష్ట్రకు తరలించారు.

News September 28, 2024

2 నెలలు ఆగండి.. సబ్సిడీ పడుతుంది: చొప్పదండి MLA

image

మల్యాల రైతు వేదికలో సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లబ్ధిదారులకు అందజేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. త్వరలో తులం బంగారం హామీ అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అందరికీ పడుతుంది కదా అని అడగగా? చాలా మంది తమకు పడటం లేదని చెప్పడంతో 2 నెలలు ఆగండి.. అందరికీ పడుతాయన్నారు.

News September 28, 2024

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో మెదక్ ఎంపీకి చోటు

image

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ కమిటీ సభ్యుడిగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు చోటు దక్కింది. ఈ కమిటీలో 21 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులుంటారు. మొదటి సారిగా మెదక్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలుపొందిన రఘునందన్ రావు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.