India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పోరేటర్లుగా పోటీ చేసే తమ అభ్యర్థుల వివరాలను కాంగ్రెస్, బీఆర్ఎస్లు నేటి వరకు ప్రకటించలేదు. ఇరు పార్టీల నుంచి పోటీ చేసే ఆశావహులు పార్టీల పేరు చెప్పి నామినేషన్లు వేసినప్పటికీ వారికి బీఫారాలు ఇంకా అందజేయ లేదు. ముందుగా ప్రకటిస్తే ఆశావహులు పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయని భావించి రేపు నామినేషన్ల విత్ డ్రా అయ్యాక బీఫారం ఇచ్చేందుకు సిద్ధం చేశాయి.

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ నెలకొంది. ఇటీవల BRS నుంచి అధికార కాంగ్రెస్లో చేరిన పలువురు తాజా మాజీ కౌన్సిలర్లకు నిరాశే మిగిలినట్లు సమాచారం. వీరిలో కొంతమంది అభ్యర్థులకు B ఫామ్ వస్తుందా రాదా అన్న సందిగ్ధత నెలకొంది. టికెట్ విషయంలో తమకు అన్యాయం జరిగిందని, ఇండిపెండెంట్గా బరిలో ఉంటున్నామని వాట్సాప్ స్టేటస్లో నేతలు ఆవేదన వెళ్లగక్కడం చర్చనీయాంశంగా మారింది.

వరంగల్లోని కాకతీయుల కాలంనాటి చారిత్రక కట్టడాల సంరక్షణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు చేపట్టాలని ఎంపీ డా. కడియం కావ్య డిమాండ్ చేశారు. సోమవారం లోక్సభలో సంస్కృతి శాఖ మంత్రిని వరంగల్ జిల్లాలోని చారిత్రక కట్టడాలను నేషనల్ మిషన్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ యాంటిక్విటీస్ కింద చేపట్టిన అభివృద్ధిపై ఎంపీ వివరణ కోరారు. అందుకు ఆ శాఖ మంత్రి సమాధానం ఇచ్చారని ఎంపీ తెలిపారు.

జిల్లాలో నెల రోజుల పాటు నిర్వహించిన ‘ఆపరేషన్ స్మైల్’ సత్ఫలితాలనిచ్చిందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో రికార్డు స్థాయిలో 118 మంది బాల కార్మికులను (105 మంది బాలురు, 13 మంది బాలికలు) రెస్క్యూ చేసినట్లు వెల్లడించారు. బాల కార్మిక వ్యవస్థకు కారణమైన వారిపై 92 కేసులు నమోదు చేశామన్నారు. చిన్నారులను పనుల్లో పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం బీ.ఎడ్ సెకండ్ ఇయర్ మూడవ సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 4వ తేది(బుధవారం) నుంచి జరగనున్నట్లు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి వెల్లడించారు. 4 నుంచి 13 వరకు జరిగే ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు జరగనున్నాయి.

గుర్రంపోడు తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒక రైతుకు సంబంధించిన భూ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు RI మహమ్మద్ హకీమ్ రూ.20,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆర్ఐ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయనను అదుపులోకి తీసుకుని కార్యాలయంలోనే విచారణ జరుపుతున్నారు.

ప్రజావాణిలో అందిన దరఖాస్తులపై అధికారులు స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. ఉపాధి, భూ సమస్యలు, పెన్షన్లు, గృహాల కోసం వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు బదిలీ చేసి, విచారణ వేగవంతం చేయాలని సూచించారు. విధుల్లో ఉత్తమ సేవలు అందించి పదవీ విరమణ చేసిన 7గురు అధికారులను కలెక్టర్ సన్మానించారు.

GHMC పునర్విభజన ప్రక్రియ పూర్తయింది.. 300 డివిజన్లుగా మహానగరం రూపుదిద్దుకుంది. కానీ పనులు మాత్రం కావడం లేదు. వివిధ సమస్యల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా విద్యుత్, ఎంటమాలజీ, పశుసంవర్ధక, పారిశుద్ధ్యం, టౌన్ ప్లానింగ్ విభాగాలకు సంబంధించి సిబ్బంది నియామకం పూర్తిస్థాయిలో కాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరిని అడగాలి? అని వాపోతున్నారు.

జాగృతి తరఫున కొన్ని చోట్ల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. తాము మంచి అభ్యర్థులను పెట్టామని వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అభ్యర్థి మనకు ఆపదలో ఆదుకుంటాడా లేదా అన్నది చూసి ఓటు వేయాలని, మనకు పనిచేసేటోళ్లను గెలిపించాలన్నారు. గుడ్డిగా లేబుల్ చూసి ఓటు వేస్తే కచ్చితంగా మనం నష్టపోతామని ఆమె అన్నారు.

బీఆర్ఎస్ అంటే ‘బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి’ అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద నేరమని, చట్టం ఎవరికీ మినహాయింపు కాదన్నారు. కేసీఆర్ ఆజ్ఞ లేకుండా ట్యాపింగ్ జరగలేదన్నది అవాస్తవన్నారు. సినీ, పారిశ్రామిక ప్రముఖులపై నిఘా, బ్లాక్మెయిల్ జరిగిందని, సిట్ విచారణతో నిజానిజాలు బయటపడాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.