Telangana

News September 23, 2024

HYD: అక్టోబర్ 2 నుంచి ఆపరేషన్ సీవరెజ్

image

గ్రేటర్ HYD నగరంలో అక్టోబర్ 2 నుంచి జలమండలి ఆపరేషన్ సీవరెజ్ చేపట్టనుంది. 30 రోజుల పాటు 7050 కిలోమీటర్ల డ్రైనేజీ లైన్లను క్లీన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 225 ఎయిర్ టేక్ యంత్రాలను సైతం వినియోగించనున్నారు. జలమండలి పరిధిలోని అనేక చోట్ల చిన్నపాటి వర్షాలకే దాదాపు 3 లక్షల వరకు మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి.

News September 23, 2024

HYD: NIMSలో జెనెటిక్స్ రోగులకు డే కేర్ సేవలు

image

HYD నగరంలో పంజాగుట్ట NIMSలో జెనెటిక్స్ రోగులకు డే కేర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉప్పల్‌లోని CDFD సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి డాక్టర్ బీరప్ప తెలిపారు. ఇటీవల గర్భస్థ శిశువుల్లో వచ్చే గుండె, ఊపిరితిత్తుల వైఫల్యానికి కారణమయ్యే జన్యు లోపాలను పరిష్కరించే మార్గాన్ని వైద్యులు గుర్తించారు. ఈ మేరకు జెనెటిక్ రోగాలకు వైద్యం అందించనున్నట్లు తెలిపారు.

News September 23, 2024

వికారాబాద్: జిల్లాలో ముఖ్యంశాలు!

image

✒VKBD: SAVE దామగుండం ఉద్యమంలో ప్రొ.నాగేశ్వరరావు, విమలక్క
✒మహమ్మదాబాద్: రిపోర్టర్‌పై స్కూల్ యాజమాన్యం చిందులు
✒వికారాబాద్: శివరాంనగర్‌లో చైన్ స్నాచింగ్
✒ పలుచోట్ల భారీ వర్షాలు
✒ఎంపీ విశ్వేశ్వర్ తీరు బాధ్యతారాహిత్యం: AIKMS
✒దామగుండం: Way2Newsతో పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి
✒ VKBకు KTRను తీసుకొస్తాం: BRS
✒ఘనంగా తాండూరు నూతన రజక కార్యవర్గ ప్రమాణ స్వీకారం

News September 23, 2024

వరంగల్: నేటి నుంచి బొడ్డెమ్మ పండగ ప్రారంభం

image

నేటి నుంచి బొడ్డెమ్మ పండుగ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. తొమ్మిది రోజులపాటు ప్రధాన ప్రాంతాల్లో, దేవాలయాల్లో జరిగే బొడ్డెమ్మ సంబరాల్లో చిన్నారులు బొడ్డెమ్మ ఆడతారు. తొమ్మిది రోజులు బొడ్డెమ్మ పండుగను ఆడుకుని చివరికి నిమజ్జనం చేస్తారు.

News September 23, 2024

KMM: తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు ప్యాకెట్

image

తిరుమల లడ్డూ కల్తీపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోసారి అపవిత్రమైందంటూ ఖమ్మంలో జరిగిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది. గొల్లగూడెం శివారులో కార్తికేయ టౌన్ షిప్‌కు చెందిన దొంతు పద్మావతి 19న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వచ్చింది. ప్రసాదాన్ని వారి బంధువులకు, ఇరుగు పోరుగు వాళ్లకు పంచేందుకు చూడగా పొగాకు వంటి పదార్థం కనిపించిందని ఆరోపించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు స్థానిక మధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

News September 23, 2024

కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడీ చేస్తోంది: మాజీ MLA

image

సింగరేణి కార్మికులకు లాభాల వాటా ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంకెల గారడీ చేస్తోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. సంస్థ సాధించిన లాభాలలో సగం పక్కనపెట్టి మరో సగంలో 33% ఇవ్వటం సరైన విధానం కాదన్నారు. సంస్థ సాధించిన పూర్తి లాభాలలో 33 శాతాన్ని కార్మికులకు ఇస్తే ఒక్కొక్క కార్మికునికి రూ.4 లక్షలువచ్చే అవకాశం ఉందన్నారు.

News September 23, 2024

తాంసీలో క్షుద్రపూజల కలకలం..!

image

తాంసి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల ఎదుట క్షుద్రపూజల ఆనవాలు కలకలం రేపుతున్నాయి. రహదారి మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి కుంకుమ, ఇస్తారాకు, ఎర్రని, నల్లని దారాలు, గుడ్డును ఉంచారు. వాటిని చూసిన గ్రామస్థులు భయందోళనకు గురవుతున్నారు.

News September 23, 2024

కోనరావుపేట: నాటు బాంబుల తయారీ ముఠా అరెస్ట్

image

కోనరావుపేట మండలంలో నాటు బాంబులు తయారు చేస్తూ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన రాజలింగం పలువురికి నాటు బాంబులు, గన్ పౌడర్ విక్రయించారు. ఈ నాటు బాంబులతో జంతువులను వేటాడుతున్నట్లు గుర్తించిన పోలీసులు గ్రామాలపై నిఘా పెట్టారు. పోలీసులు 47 నాటు బాంబులు, గన్ పౌడర్‌ను స్వాధీనం చేసుకుని రాజలింగాన్ని అరెస్ట్ చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

News September 23, 2024

మన ఉమ్మడి పాలమూరు U-19 జట్టు ఇదే!

image

మహబూబ్‌నగర్‌లోని ఎండీసీఏ మైదానంలో ఆదివారం జిల్లా క్రికెట్ సంఘం (MDCA) ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ఆధ్వర్యంలో జట్టును ఎంపిక చేశారు. అబ్దుల్ రాఫె, మహ్మద్ షాదాబ్, అభిలాష్ గౌడ్, హెచ్.రాథోడ్, ఎండీ ముఖీత్, శశాంక్, మనోజ్, రాజు, రాంచరణ్, డి.అభినవ్, కనిష్క్, నగేశ్, వివేక్, జె.అంకిత్ రాయ్, ఎస్. అభినయ్ తేజ, చరణ్, అర్జున్, సాత్విక్ రెడ్డి, అర్షద్ అహ్మద్, జి.దినేశ్, కేవీ శ్రీహర్ష, కె.రాభి ఎంపికయ్యారు.

News September 23, 2024

సికింద్రాబాద్‌లో పురాతన అద్భుతమైన టెంపుల్

image

సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని 1847 నాటి పురాతన పర్సి ఫైర్ టెంపుల్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇటీవల హైదరాబాద్ సైకిల్ లిస్టులో బృందం టెంపుల్ వెళ్లి సందర్శించి, ఆనాటి చరిత్ర ఆనవాళ్ల గురించి తెలుసుకున్నారు. పర్షియా ప్రాంతం నుంచి వచ్చిన పేస్తోంజి, విక్కాజి మెహర్జీలు HYD, సికింద్రాబాద్ జంట నగరాలకు వచ్చి దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.