India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని 1847 నాటి పురాతన పర్సి ఫైర్ టెంపుల్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇటీవల హైదరాబాద్ సైకిల్ లిస్టులో బృందం టెంపుల్ వెళ్లి సందర్శించి, ఆనాటి చరిత్ర ఆనవాళ్ల గురించి తెలుసుకున్నారు. పర్షియా ప్రాంతం నుంచి వచ్చిన పేస్తోంజి, విక్కాజి మెహర్జీలు HYD, సికింద్రాబాద్ జంట నగరాలకు వచ్చి దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని 1847 నాటి పురాతన పర్సి ఫైర్ టెంపుల్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇటీవల హైదరాబాద్ సైకిల్ లిస్టులో బృందం టెంపుల్ వెళ్లి సందర్శించి, ఆనాటి చరిత్ర ఆనవాళ్ల గురించి తెలుసుకున్నారు. పర్షియా ప్రాంతం నుంచి వచ్చిన పేస్తోంజి, విక్కాజి మెహర్జీలు HYD, సికింద్రాబాద్ జంట నగరాలకు వచ్చి దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
జనగామ జిల్లా సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు, సీఐటీయూ అధ్యక్షుడు కామ్రేడ్ బొట్ల శ్రీనివాస్ సోమవారం తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాస్ ఆకస్మిక మృతిపట్ల సీపీఎం జిల్లా నాయకులు, ఇతర పార్టీల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయన మృతి ప్రజా పోరాటాలకు, సీపీఎంకి తీరని లోటు అన్నారు.
కాజీపేట-బల్లార్ష మధ్య రైల్వే ట్రాక్ పనుల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి బల్లార్షా వరకు నడిచే పలు రైళ్లను నేటి నుంచి అక్టోబర్ 8వరకు రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించారు. రైళ్ల రద్దుతో దసరా పండుగ నేపథ్యంలో పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట ప్రజలకు ప్రయాణ కష్టాలు ఎదురుకానున్నాయి. విద్యార్థులు, వ్యాపారస్థులు, ఉద్యోగులు ప్రయాణాలకు ఆర్టీసీపై ఆధారపడాల్సి ఉంటుంది.
గోదావరిఖని శివారులోని గోదావరి నదిలో ఆదివారం గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గోదావరిఖని రెండో పట్టణ పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని చున్నంబట్టికి చెందిన వెంకటేశ్గా గుర్తించారు. కాగా, జులైలో ఈతను అత్తను హత్య చేసి ఇటీవల జైలుకి వెళ్లాడు. బెయిల్పై విడుదలైన వెంకటేశ్ గోదావరిఖని సమీపంలోని గోదావరి నదిలో శమమై కనిపించాడు. వెంకటేశ్ ది ఆత్మహత్య? హత్య అనేది తేలాల్సి ఉంది.
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడిమృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం రెంజల్ మండలం మౌలాలి తండాకు చెందిన జాదవ్ సంతోష్ (38)ఆదివారం చేపలవేటకు అలీసాగర్ మెయిన్ కెనాల్కి వెళ్లాడు. అతడు తిరిగిరాక పోయేసరికి కుటుంబీకులు కెనాల్ వద్ద గాలించగా కాలువ వద్ద సంతోష్ దుస్తులు కనిపించాయి. ఇరిగేషన్ సిబ్బందికి సమాచారం అందించి నీటివిడుదలను నిలిపివేయగా కాలువలో సంతోష్ మృతదేహం లభ్యమైంది.
పాల్వంచలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. కిన్నెరసాని జలాశయాన్ని, డీర్ పార్క్లోని దుప్పులను పర్యాటకులు వీక్షించారు. 420 మంది పర్యాటకులు కిన్నెరసానికి వెళ్లగా.. వాహనాల ప్రవేశ రుసుం ద్వారా వైల్డ్ లైఫ్ శాఖకు రూ.12,350 ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. 190 మంది బోటు షికారు, టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.9,200 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
మూసీకి వరద పొటెత్తగా అధికారులు ప్రాజెక్టు గేట్లు తెరిచారు. హెచ్చరికలు లేకుండా నీటిని వదలడంతో కేతపల్లి మండలం భీమారంలో వరద పొట్టెత్తింది. పశువుల కాపర్లు వాగులో చిక్కుకున్నారు. 20 గేదెలు, ట్రాక్టర్ కొట్టుకుపోయింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ శివరామ్ రెడ్డి ఆదేశాలతో వారిని జేసీబీ సాయంతో తీసుకోచ్చారు. హెచ్చరికలు లేకుండా గేట్లు ఎత్తడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటలో రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం సాయంత్రం ఉమ్మడి జిల్లాలోని ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడునున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాలో అధికారులు సూచించారు.
SHARE IT
కాజీపేట-బల్లార్ష మధ్య రైల్వే ట్రాక్ పనుల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి బల్లార్షా వరకు నడిచే పలు రైళ్లను నేటి నుంచి అక్టోబర్ 8వరకు రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించారు. రైళ్ల రద్దుతో దసరా పండుగ నేపథ్యంలో మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలకు ప్రయాణ కష్టాలు ఎదురుకానున్నాయి. విద్యార్థులు, వ్యాపారస్థులు, ఉద్యోగులు ప్రయాణాలకు ఆర్టీసీపై ఆధారపడాల్సి ఉంటుంది.
Sorry, no posts matched your criteria.