India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజార్షి షా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కోడ్ ముగిసిన వెంటనే తిరిగి యథావిధిగా ఫిర్యాదుల స్వీకరణ ఉంటుందని, ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.

నల్గొండ ఐటీ టవర్లో శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూల్లో మిర్యాలగూడ విద్యార్థినులు ప్రతిభ చాటారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ సంస్థల్లో వివిధ ఉద్యోగాలకు 17 మంది విద్యార్థినులు ఎంపికయ్యారు. వారికి నిర్వాహకులు నియామక పత్రాలు అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఈ సందర్భంగా నిర్వాహకులు కోరారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థినులను కళాశాల యాజమాన్యాలు, పలువురు ప్రముఖులు అభినందించారు.

తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కింద పడి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పటాన్చెరులోని హాస్టల్లో ఉన్న తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చి మరీ విజయశాంతి సూసైడ్ చేసుకున్నారు. ప్లాట్ఫారం మీద నడుస్తున్న ఫొటోలో కొడుకు వద్దు అమ్మ అన్నట్లు సంకేతం కనిపిస్తోంది. కాగా, విజయశాంతి భర్తకు సౌదీలో ఉద్యోగం. పిల్లలు బాగా చదువుతారు. ఏ కష్టాలు లేని బిడ్డ ఎందుకు ఇలా చేసిందో? అని మృతురాలి <<19011053>>తల్లి కన్నీరు<<>> పెట్టుకుంది.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం అభ్యర్థుల జాబితాను జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి విడుదల చేశారు. నల్గొండలో మహమ్మద్ సలీం, మిర్యాలగూడలో ఏకాల పద్మ, మల్సూర్, మధులత, చిట్యాలలో జిట్టా నగేష్, దేవరకొండలో బిజిలి లింగయ్య, స్వప్న, జ్యోతి, నందికొండలో గోవింద్ రాజ్ పోటీ చేయనున్నారు. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. బీఎల్ఓలు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఫారం 6, 7, 7ఏ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శనివారం వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన సందర్శించి, పరిశీలన తీరును స్వయంగా పర్యవేక్షించారు. నిబంధనల ప్రకారం ప్రతి నామినేషన్ను తనిఖీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, కమిషనర్ రాజు, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.

పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. బోధించే ఉపాధ్యాయులు సెలవులు పెట్టొద్దన్నారు. సోమవారం నుంచి ఏ ఒక్క విద్యార్థి పాఠశాలకు గైర్హాజర్ కావద్దని తెలిపారు.
ఉదయం 8:15 నుంచి సా.5:15 వరకు పాఠశాలలో సిలబస్ పునశ్చరణ తరగతులు జరగాలన్నారు. 10 మంది విద్యార్థులకు ఒక మెంటార్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంఈఓలు, హెచ్ఎం, ఉపాధ్యాయులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టరేట్తో పాటు మున్సిపల్ ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి తాత్కాలిక వాయిదా వేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా యంత్రాంగం మొత్తం పురపాలక ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఎన్నికల జరుగు మున్సిపాలిటీ ఏరియాలలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.

ఇసుక అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా ప్రవేశపెట్టిన మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ యాప్ విధానాన్ని NZB జిల్లాలో అందుబాటులోకి తెచ్చామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మ్యానువల్ విధానానికి స్వస్తి పలుకుతూ పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఇసుక బుకింగ్ చేసుకునేలా ప్రయోగత్మకంగా జిల్లాలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ఆన్లైన్లోనే UPI పేమెంట్ చేయాలని సూచించారు.

తెలంగాణ విశ్వ విద్యాలయ పరిధిలో B.Ed, B.Ped (1వ, 3వ సెమిస్టర్) పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంట చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన బీఎడ్, బీపీఎడ్ పరీక్షలకు 1,339 మంది విద్యార్థులకు 1,302 మంది హాజరయ్యారన్నారు. 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.