Telangana

News September 23, 2024

NZB: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు.. పదిమంది అరెస్ట్

image

నగరంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు వన్ టౌన్ పరిధిలోని నాగేంద్రుడి గుడి వెనకాల గల ప్రదేశంలో పేకాట ఆడుతుండగా వన్ టౌన్ SHO విజయబాబు, తన సిబ్బందితో ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పదిమంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9200 నగదు, రెండు బైక్లు, 9 స్మార్ట్ ఫోన్ లను స్వాధీన పరుచుకున్నారు.

News September 23, 2024

ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

ఇవాళ జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి ప్రజావాణిలో ఫిర్యాదు సమర్పించడానికి కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.

News September 23, 2024

ఖేడ్‌: ఆ మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలి: KVPS

image

నారాయణఖేడ్‌లో అధిక ధరలకు టాబ్లెట్లు అమ్ముతున్న మెడికల్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం ఆయన స్థానిక కేవీపీఎస్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రజలకు అధిక ధరలకు మెడికల్ యజమానులు మందులు అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని.. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News September 23, 2024

దుద్యాల: రాష్ట్రస్థాయి సత్తాచాటిన హస్నాబాద్ వాసి

image

దుద్యాలలోని హస్నాబాద్‌కు చెందిన సాయికిరణ్ రాష్ట్రస్థాయి షార్ట్‌పుట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న సాయికిరణ్ 6KG షార్ట్ పుట్‌ను 16.21m దూరం విసిరి రాష్ట్రంలోనే మొదటి స్థానం నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. గోల్డ్ మెడల్ సాధించిన సాయికిరణ్‌ను గ్రామస్థులు అభినందించారు.

News September 23, 2024

నేడు వరంగల్ ఎనుమాముల మార్కెట్ ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News September 23, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.1,91,128 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.77,614, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.45,160, అన్నదానం రూ.68,354,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News September 23, 2024

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు Updates

image

జూరాల ప్రాజెక్టు ఎగువ నుంచి శనివారం రాత్రి 9 గంటలకు 17వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్టు బిజెపి అధికారులు తెలిపారు. జల విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్ల ద్వారా విద్యుత్ పత్తి కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఇందుకోసం 19,318 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు వివిధ రూపాల్లో ప్రాజెక్టు నుంచి మొత్తం21,833 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం 9.562 టీఎంసీ ల నీరు నిల్వ ఉంది .

News September 23, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

❤ఉమ్మడి జిల్లా U-19 క్రికెట్ జట్టు ఎంపిక
❤MBNR: చైన్ సిస్టమ్ అంటూ.. రూ.12కోట్లు బురిడీ
❤ఉమ్మడి జిల్లాలో కురిసిన భారీ వర్షం
❤MBNR:స్కాన్ చేస్తే..RTC సేవలు అన్నీ ఒకే చోట
❤24న అండర్-14 క్రికెట్ జట్టు ఎంపిక
❤’వైద్య సేవలు MBNRలో TOP.. NGKLలో NILL’
❤తెలకపల్లి: కరెంట్ షాక్‌తో రైతు మృతి
❤NGKLలో పిడుగుపాటుకు చెల్లి మృతి.. అక్కకు తీవ్రగాయాలు
❤క్రీడా పాఠశాలలపై ఫోకస్

News September 23, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు CRIME NEWS

image

∆} కొత్తగూడెం: గుండెపోటుతో అటవీ శాఖ అధికారి మృతి
∆} పాల్వంచ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత
∆}అశ్వారావుపేట: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
∆} నాచేపల్లి సొసైటీ కార్యదర్శి కోటయ్య మృతి
∆} మణుగూరు గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి
∆} గార్ల: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
∆} అశ్వాపురం: మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో వాహనాల తనిఖీలు

News September 22, 2024

చిరంజీవిని అభినందించిన మంత్రి కోమటిరెడ్డి

image

గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషెస్ చెప్పారు. ఆయనను కలిసి అభినందించారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించినందుకు చిరంజీవికి ఈ అరుదైన అవకాశం దక్కిందన్నారు. వారి వెంట దిల్ రాజు ఉన్నారు.