Telangana

News January 27, 2026

ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా పాటించాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు కలెక్టరేట్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ ప్రక్రియ దృష్ట్యా, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపులో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News January 27, 2026

రెచ్చగొట్టే ప్రచారంపై కఠిన చర్యలు: డీఎస్పీ

image

ఆదిలాబాద్ పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో గెలుపోటములపై రెచ్చగొట్టే పోస్టులు, వ్యక్తులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం చట్టరీత్య నేరమని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు, తప్పుడు సర్వేలు, అసత్య ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియా పర్యవేక్షణకు ప్రత్యేక నిఘా సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News January 27, 2026

ఎదులాపురం మున్సిపల్‌ బరిలో బీజేపీ

image

మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకుడు శాసనాల శ్రీరామ్ వెల్లడించారు. మంగళవారం ఎదులాపురంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారానే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News January 27, 2026

JBS TO మేడారం.. DAY/NIGHT బస్సులు

image

మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే నగరవాసులకు శుభవార్త. సికింద్రాబాద్ JBS నుంచి వన జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మేనేజర్ ఎల్.రవీందర్ తెలిపారు. రేపటి నుంచి జనవరి 31 వరకు 24 గంటల పాటు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్లాట్‌ఫాం నంబర్ 13 వద్ద బస్సులు ఉంటాయని వెల్లడించారు. ఈ విషయాన్ని జంట నగరాల ప్రయాణికులు గమనించి, ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT

News January 27, 2026

మున్సిపల్ పోరుకు సిద్ధం కావాలి: కలెక్టర్

image

నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఈసీ రాణి కుమిదిని, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ ఆర్డీవోలు, కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు.

News January 27, 2026

KNR: సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు బలగాల మోహరింపు

image

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 25 నుంచి 30 శాతం పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. ఈ ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

News January 27, 2026

MDK: అధికారులందరూ సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో 75 వార్డులుండగా
150 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉండాలన్నారు. నామినేషన్ పక్రియ నుంచి ఎన్నికలు పూర్తి అయ్యే వరకు అప్రమత్తంగా ఉండి, ఎన్నికల సంఘం నియమాల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించాలన్నారు.

News January 27, 2026

మెదక్: ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం మున్సిపల్ ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు.

News January 27, 2026

లక్ష్యాలను సాధించని సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు: DMHO

image

సకాలంలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని ఏ ఒక్క రోగిని వదలకుండా వైద్య పరీక్షలు నిర్వహించి రోగుల వివరాలను అంతర్జాలంలో నమోదు చేయాలని జిల్లా వైద్యశాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్ అన్నారు. మంగళవారం DMHO కార్యాలయ సమావేశ మందిరంలో ఏంఎల్.హెచ్.పీ, ఏఎన్ఎంలతో అసాంక్రమిత వ్యాధుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. లక్ష్యాలను సాధించని సిబ్బందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

News January 27, 2026

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆదిలాబాద్ కలెక్టర్, ఎస్పీ

image

పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్, సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులతో కలిసి హాజరయ్యారు.