Telangana

News September 23, 2024

దుద్యాల: రాష్ట్రస్థాయి సత్తాచాటిన హస్నాబాద్ వాసి

image

దుద్యాలలోని హస్నాబాద్‌కు చెందిన సాయికిరణ్ రాష్ట్రస్థాయి షార్ట్‌పుట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న సాయికిరణ్ 6KG షార్ట్ పుట్‌ను 16.21m దూరం విసిరి రాష్ట్రంలోనే మొదటి స్థానం నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. గోల్డ్ మెడల్ సాధించిన సాయికిరణ్‌ను గ్రామస్థులు అభినందించారు.

News September 23, 2024

నేడు వరంగల్ ఎనుమాముల మార్కెట్ ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News September 23, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.1,91,128 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.77,614, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.45,160, అన్నదానం రూ.68,354,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News September 23, 2024

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు Updates

image

జూరాల ప్రాజెక్టు ఎగువ నుంచి శనివారం రాత్రి 9 గంటలకు 17వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్టు బిజెపి అధికారులు తెలిపారు. జల విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్ల ద్వారా విద్యుత్ పత్తి కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఇందుకోసం 19,318 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు వివిధ రూపాల్లో ప్రాజెక్టు నుంచి మొత్తం21,833 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం 9.562 టీఎంసీ ల నీరు నిల్వ ఉంది .

News September 23, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

❤ఉమ్మడి జిల్లా U-19 క్రికెట్ జట్టు ఎంపిక
❤MBNR: చైన్ సిస్టమ్ అంటూ.. రూ.12కోట్లు బురిడీ
❤ఉమ్మడి జిల్లాలో కురిసిన భారీ వర్షం
❤MBNR:స్కాన్ చేస్తే..RTC సేవలు అన్నీ ఒకే చోట
❤24న అండర్-14 క్రికెట్ జట్టు ఎంపిక
❤’వైద్య సేవలు MBNRలో TOP.. NGKLలో NILL’
❤తెలకపల్లి: కరెంట్ షాక్‌తో రైతు మృతి
❤NGKLలో పిడుగుపాటుకు చెల్లి మృతి.. అక్కకు తీవ్రగాయాలు
❤క్రీడా పాఠశాలలపై ఫోకస్

News September 23, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు CRIME NEWS

image

∆} కొత్తగూడెం: గుండెపోటుతో అటవీ శాఖ అధికారి మృతి
∆} పాల్వంచ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత
∆}అశ్వారావుపేట: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
∆} నాచేపల్లి సొసైటీ కార్యదర్శి కోటయ్య మృతి
∆} మణుగూరు గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి
∆} గార్ల: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
∆} అశ్వాపురం: మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో వాహనాల తనిఖీలు

News September 22, 2024

చిరంజీవిని అభినందించిన మంత్రి కోమటిరెడ్డి

image

గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషెస్ చెప్పారు. ఆయనను కలిసి అభినందించారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించినందుకు చిరంజీవికి ఈ అరుదైన అవకాశం దక్కిందన్నారు. వారి వెంట దిల్ రాజు ఉన్నారు.

News September 22, 2024

కరీంనగర్: ఇక పల్లె బస్సుల్లోనూ క్యూఆర్ కోడ్!

image

పల్లె వెలుగు బస్సుల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులు సులభంగా ఛార్జీలు చెల్లించేందుకు క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే సూపర్ లగ్జరీ లాంటి బస్సుల్లో ఈ సదుపాయం ఉండగా ప్రస్తుతం పల్లెవెలుగు బస్సుల్లోకి సైతం తీసుకొచ్చారు. కాగా ఉమ్మడి జిల్లాలో 11 డిపోలకు సంబంధించి 811 ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో 479 ఆర్టీసీ, 332 అద్దె బస్సులు నడుపుతున్నారు.

News September 22, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సిరిసిల్లలో షార్ట్ సర్క్యూట్ తో కరెంట్ పోల్ దగ్ధం. @ గోదావరిఖని శివారు గోదావరి నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కరీంనగర్ లో రెస్టారెంట్ భవనంలో అగ్ని ప్రమాదం. @ తంగళ్ళపల్లి మండల నూతన ఎస్సైగా రామ్మోహన్. @ పెగడపల్లి మండలం లో 500 గ్రాముల గంజాయి పట్టివేత. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న బీజేపీ సభ్యత్వ నమోదు.

News September 22, 2024

కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో భక్తుల సందడి

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు కావడంతో ఆలయ పరిసరాలు మల్లన్న భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచే స్వామి వారి దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొంతమంది బోనాలు సమర్పించి గంగిరేగు చెట్లు వద్ద పట్నాలు వేశారు.