Telangana

News April 22, 2025

రంగారెడ్డి: రైతు బిడ్డకు ఇంటర్‌లో TOP RANK

image

రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతుబిడ్డ తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌లో టాపర్‌గా నిలిచింది. ఇబ్రహీంపట్నం మం. పోచారానికి చెందిన నగేశ్ గౌడ్-సబిత దంపతుల కూతురు శ్రీవార్షిక MPCలో 470 మార్కులకు 468 మార్కులు సాధించింది. ఇంగ్లిష్, సంస్కృతంలోనే ఒక్కో మార్కు రాలేదు. మిగతా అన్ని సబ్జెక్టుల్లో ఫుల్ మార్క్స్ వచ్చాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో తెలంగాణ స్టేట్ టాప్ ర్యాంకర్‌గా రైతు బిడ్డ నిలవడం గర్వకారణం.
SHARE IT

News April 22, 2025

పాలమూరు జిల్లాల STATE ర్యాంకులు ఇవే..!

image

ఫస్ట్ ఇయర్‌లో స్టేట్..
> MBNRజిల్లా 64.24 శాతంతో 9వ RANK
> GDWL జిల్లా 59.25 శాతంతో 14వ RANK
> WNP జిల్లా 59.17 శాతంతో 16వ RANK
> NRPT జిల్లా 57.87 శాతంతో 19వ RANK
> NGKLజిల్లా 48.77 శాతంతో 32వ RANK
సెకండ్ ఇయర్‌లో
> MBNRజిల్లా 71.35 శాతంతో 10వ RANK
> NRPT జిల్లా 69.54 శాతంతో 14వ RANK
> GDWL జిల్లా 68.34 శాతంతో 20వ RANK
> WNP జిల్లా 66.89 శాతంతో 24వ RANK
> NGKLజిల్లా 63.93 శాతంతో 28వ RANK

News April 22, 2025

INTER RESULTS: 32వ స్థానంలో నిజామాబాద్

image

ఇంటర్ ఫలితాలలో నిజామాబాద్ జిల్లా విద్యార్థులు నిరాశపరిచారు. మొదటి సంవత్సరం ఫలితాలలో 51.88 ఉత్తీర్ణతతో 27వ స్థానంలో నిలిచారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలలో 58.47 శాతం ఉత్తీర్ణతతో 32వ స్థానానికి పరిమితమయ్యారు.

News April 22, 2025

INTER RESULTS.. వరంగల్‌లో ఎంత మంది పాస్ అయ్యారంటే?

image

ఇంటర్ ఫలితాల్లో వరంగల్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 5,401 మంది పరీక్షలు రాయగా 3,709 మంది ఉత్తీర్ణత సాధించారు. 68.67 పాస్ పర్సంటేజీ వచ్చింది. ఫస్ట్ ఇయర్‌లో 5,814 మందిలో 3,368 మంది ఉత్తీర్ణులు కాగా.. 57.93 పాస్ పర్సంటేజీ నమోదైంది.

News April 22, 2025

ఇంటర్ ఫలితాల్లో హైదరాబాద్‌కు నిరాశ

image

ఇంటర్ ఫలితాల్లో మన హైదరాబాద్‌ విద్యార్థులు నిరాశ పరిచారు. ఫస్టియర్‌లో 66.68 శాతంతో సరిపెట్టుకున్నారు. 85,772 మంది పరీక్ష రాశారు. ఇందులో 57,197 మంది పాస్ అయ్యారు. సెకండియర్‌లో విద్యార్థుల కాస్త మెరుగుపడ్డారు. 74,781 మంది పాస్ పరీక్ష రాయగా.. 50,659 మంది ఉత్తీర్ణులయ్యారు. 67.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. మేడ్చల్, రంగారెడ్డి విద్యార్థులు సత్తాచాటారు. టాప్‌ 10లోనూ మన హైదరాబాద్‌ పేరు లేకపోవడం గమనార్హం.

News April 22, 2025

Inter Results.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇలా..!

image

ఇంటర్ ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. ఫస్ట్ ఇయర్‌లో 64.24 శాతం మంది పాసయ్యారు. 10,923 మంది పరీక్షలు రాయగా 7,017 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండ్ ఇయర్‌లో 71.35 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. 9,946 మంది పరీక్షలు రాయగా 7,096 మంది ఉత్తీర్ణత సాధించారు.

News April 22, 2025

INTER RESULT: నిజామాబాద్ జిల్లాలో ఎంతమంది పాసయ్యారంటే?

image

ఇంటర్ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 17,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 9,258 మంది పాసయ్యారు. 51.88% మంది ఉతీర్ణత సాధించారు. సెకండియర్ ఇయర్‌లో 15,987 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 9,348 మంది పాసయ్యారు. 58.47% ఉతీర్ణత సాధించారు.

News April 22, 2025

Inter Results: మెదక్ జిల్లాలో ఇలా..!

image

ఇంటర్ ఫలితాల్లో మెదక్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 5572 మంది పరీక్షలు రాయగా 3428 మంది ఉత్తీర్ణతతో 61.52 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో 6153 మందికి 3028 మంది పాసయ్యారు. 49.24 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు.

News April 22, 2025

ఇంటర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా హవా

image

ఇంటర్ ఫలితాల్లో మన రంగారెడ్డి జిల్లా సత్తాచాటింది. ఫస్టియర్‌లో 76.36 శాతంతో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. మొత్తం 80,412 మంది పరీక్ష రాశారు. ఇందులో 61,406 మంది పాస్ అయ్యారు. సెకండియర్‌లోనూ విద్యార్థుల హవా కొనసాగింది. 70,581 మంది పరీక్ష రాయగా.. 54,721 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 77.53 శాతంతో రంగారెడ్డి జిల్లా 4వ స్థానంలో నిలిచింది.

News April 22, 2025

కరీంనగర్: ఇంటర్‌ ఫస్ట్ ఇయర్‌లో 68.23 శాతం

image

ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 17,794 మందికి 12,141 మంది పాసయ్యారు. 68.23 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. సెకండ్ ఇయర్‌లో 15,187 మంది పరీక్షలు రాయగా 11,092 మంది పాసయ్యారు. 73.04 శాతం పర్సంటేజీ వచ్చింది.