India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్లో 16919 మంది పరీక్షలు రాయగా 12996 మంది పాసయ్యారు. 76.81 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. ఫస్ట్ ఇయర్లో 17837 మందికి 12476 మంది పాసయ్యారు. పాస్ పర్సంటేజీ 69.94 శాతం.
ఇంటర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్లో 9,106 మంది విద్యార్థులు పరీక్షలు రాయంగా 4,967 మంది పాసయ్యారు. 54.55% మంది ఉతీర్ణత సాధించారు. సెకండియర్ ఇయర్లో 8,890 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 6,291 మంది పాసయ్యారు. 70.76% ఉతీర్ణత సాధించారు.
నల్గొండ జిల్లాలో ఫస్టియర్ పరీక్షను 13,977 మంది రాయగా 7931 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతా శాతం 56.74 శాతంగా ఉంది. సెకండియర్లో 12,992 విద్యార్థులకు గాను 8,960 మంది పాసయ్యారు. పాస్ పర్సంటేజ్ 68.97శాతంగా ఉంది.
నాగార్జునసాగర్ జలాశయం సమాచారాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం 514.60 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేయడ లేదు. జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 1,350 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
BRS కంచుకోటలో ఆ పార్టీ పోటీ చేయకపోవడం శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. ఫిబ్రవరిలో జరిగిన GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నిక, ఇప్పుడు జరుగుతోన్న MLC కోటా ఎన్నిక నుంచి BRS తప్పుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా వ్యతిరేక పవనాలు వీచినా.. గ్రేటర్ ప్రజలు గులాబీ జెండాను ఎగరేశారు. వాస్తవానికి MLC కోటాలో BRSకు 24 ఓట్లే ఉన్నా.. కనీసం ప్రత్యర్థులతో పోటీ పడకపోవడం శోచనీయం. దీనిపై మీ కామెంట్?
BRS కంచుకోటలో ఆ పార్టీ పోటీ చేయకపోవడం శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. ఫిబ్రవరిలో జరిగిన GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నిక, ఇప్పుడు జరుగుతోన్న MLC కోటా ఎన్నిక నుంచి BRS తప్పుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా వ్యతిరేక పవనాలు వీచినా.. గ్రేటర్ ప్రజలు గులాబీ జెండాను ఎగరేశారు. వాస్తవానికి MLC కోటాలో BRSకు 24 ఓట్లే ఉన్నా.. కనీసం ప్రత్యర్థులతో పోటీ పడకపోవడం శోచనీయం. దీనిపై మీ కామెంట్?
వరంగల్లో ఈనెల 27న BRS రజతోత్సవ భారీ బహిరంగ సభకు MBNR, WNP, NGKL, NRPT, GDWL జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణకు ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. ఒక్క ఉమ్మడి పాలమూరు నుంచే సభకు 2 లక్షల మందికి పైగా తరలించేందుకు ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి సూచనలతో వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. అందరం KCRసభకు వెళ్దామని శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.
కరీంనగర్ కొత్తపల్లి హవేలీ చెరువులో యువకుడి మృతదేహం కనిపించిన విషయం తెలిసిందే. మృతి చెందిన వ్యక్తి భార్గవ్గా పోలీసులు గుర్తించారు. భార్గవ్ తల్లిదండ్రులు కొత్తపల్లికి చెందిన పబ్బోజు నాగరాజు యాదలక్ష్మి కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఈ క్రమంలో కొత్తపెళ్లి చెరువు వద్ద మృతదేహం లభించడంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
పనికిరాని ఇనుప సామగ్రిని ప్రజల సమక్షంలో బహిరంగ వేలం వేస్తున్నట్టు ఖమ్మం జిల్లా జైలు సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. జైలులోని ఫ్యాక్టరీ స్క్రాప్ను ఈనెల 25న వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తిగలవారు రూ.5వేలు కనీస ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు. మరింత సమాచారం కొరకు జిల్లా జైలర్లు సక్రునాయక్ (94946 32552), లక్ష్మీ నారాయణ(97005 05151)ను సంప్రదించాలని తెలిపారు.
జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. దీంతో జిల్లాలో 1,25,733 మంది దరఖాస్తులు చేసుకున్నారు. బీసీ కుల గణన సమయంలో 27, 523 మంది.. సవరణల కోసం 37,229 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటిని పరిశీలించిన అధికారులు 69,473 దరఖాస్తులకు అప్రూవల్ చేసినా సివిల్ సప్లై శాఖ ఓకే చెప్పలేదు.
Sorry, no posts matched your criteria.