Telangana

News September 22, 2024

MBNR: స్కాన్ చేస్తే.. ఆర్టీసీ సేవలు అన్నీ ఒకే చోట

image

స్మార్ట్ ఫోన్‌తో కోడ్ స్కాన్ చేస్తే ఆర్టీసీ సంస్థకు సంబంధించిన 10 రకాల యాప్‌లు ఒకే చోట కనబడతాయని RTC అధికారులు తెలిపారు. ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో ఒకసారి మన వివరాలు పొందుపరిస్తే చాలు ఎప్పుడైనా.. ఎక్కడైనా వినియోగించుకోవడం సులభమవుతుంది. ‘ప్రగతి రథం..ప్రజా సేవా పథం’ నినాదంతో విస్తృత అవగాహన కల్పించేందుకు ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా ఆయా డిపోల మేనేజర్లు, సంస్థ సిబ్బంది ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

News September 22, 2024

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ UPDATES

image

జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి శనివారం రాత్రి 9 గంటలకు 17 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం 19,318 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. వివిధ రూపాల్లో ప్రాజెక్టు నుంచి మొత్తం 21,833 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 9.562 TMCల నీరు నిల్వ ఉంది.

News September 22, 2024

హైదరాబాద్‌‌కు వర్ష సూచన⛈️

image

East HYD‌కు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, బండ్లగూడ, ఎల్బీనగర్, సరూర్‌నగర్, సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, రామంతాపూర్, అంబర్‌పేట, మీర్‌పేట, గుర్రంగూడ, వనస్థలిపురంలో బలమైన ఈదురుగాలు‌లతో కూడిన‌ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అప్రమత్తంగా ఉండాలని HYDRAA ట్వీట్ చేసింది. అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667‌ నంబర్లను సంప్రదించాలని సూచించింది.

News September 22, 2024

హైదరాబాద్‌‌కు వర్ష సూచన⛈️

image

East HYD‌కు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, బండ్లగూడ, ఎల్బీనగర్, సరూర్‌నగర్, సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, రామంతాపూర్, అంబర్‌పేట, మీర్‌పేట, గుర్రంగూడ, వనస్థలిపురంలో బలమైన ఈదురుగాలు‌లతో కూడిన‌ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అప్రమత్తంగా ఉండాలని HYDRAA ట్వీట్ చేసింది. అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667‌ నంబర్లను సంప్రదించాలని సూచించింది.

News September 22, 2024

యాదాద్రి: గేదె చెరువులోకి లాక్కెళ్లడంతో రైతు మృతి

image

గేదె చెరువులోకి లాక్కెళ్లడంతో రైతు మృతి చెందిన ఘటన మోత్కూర్ మండలం పాటిమట్టలలో జరిగింది. గ్రామస్థుల వివరాలిలా.. నాగపూర్ నరసయ్య (70) అనే రైతు గేదెను మేతకు తీసుకెళ్లాడు. గేదె మెడకు ఉన్న పగ్గాన్ని (తాడు) చేతికి కట్టుకున్నాడు. ఒక్కసారిగా చెరువులోకి లాక్కెళ్లడంతో చనిపోయాడు. నరసయ్య మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

News September 22, 2024

పిట్లం: నీటి కుంటలో పడి రైతు మృతి

image

ప్రమాదవశాత్తు చెరువులో పడి రైతు మృతి చెందిన ఘటన పిట్లం మండలం కారేగాంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. కారేగాం గ్రామానికి చెందిన బేగరి దశరథం (55) తన పంట పొలానికి నీటిని తోడేందుకు మోటారును పెద్ద చెరువు కుంటలో వేశాడు. మోటారు మోరాయించడంతో దాన్ని తీసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. మృతుడి భార్య లింగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News September 22, 2024

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

image

పొలంలో మందు కొట్టడానికి వచ్చిన యువకుడు మృతి చెందిన ఘటన గార్ల మండలంలో జరిగింది. మండలంలో పూమ్యతండాకు చెందిన గుగులోత్ నితిన్ పోలంలో మందు కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్‌‌కు గురై మృతి చెందాడు. నీతిన్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News September 22, 2024

MBNR: కొత్త రేషన్ కార్డులు.. ఈసారైనా వచ్చేనా.?

image

ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలకు రేషన్ కార్డు దారులే అర్హులు.జిల్లాలో 506 చౌకధర దుకాణాలు ఉన్నాయి. మొత్తం రేషన్ కార్డులు 2,39,600,ఇందులో ఆహార భద్రత కార్డులు 2,20,283,అంత్యోదయ కార్డులు 19,016,అన్నపూర్ణ కార్డులు 201 ఉన్నాయి.BRS ప్రభుత్వం 2021లో కొన్ని రేషన్ కార్డులు పంపిణీ చేసింది. ఆ తర్వాత రేషన్ కార్డుల ఊసే లేదు. ఉత్తర్వులు రాగానే చర్యలు చేపడతామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేష్ తెలిపారు.

News September 22, 2024

HYD: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్షల తేదీలు ఖరారు!

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్ష తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఆరోజు జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షను వచ్చే నెల 16న నిర్వహించనున్నట్లు, పరీక్ష సమయం, పరీక్ష కేంద్రంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.

News September 22, 2024

HYD: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్షల తేదీలు ఖరారు!

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్ష తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఆరోజు జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షను వచ్చే నెల 16న నిర్వహించనున్నట్లు, పరీక్ష సమయం, పరీక్ష కేంద్రంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.