India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్ మునిసిపాలిటీలలో ప్రధాన పార్టీల మధ్యే పోటీ ఉండే అవకాశాలు ఉండగా అన్ని పార్టీల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం నేతలకు సవాలుగా మారింది. ఇప్పటికి ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. అన్ని పార్టీల్లోనూ అభ్యర్థుల ఖరారు విషయంలో అనిశ్చితి నెలకొంది. ఆశావహులు మాత్రం తమకే పార్టీ టిక్కెట్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకులుగా హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ జి.జితేందర్ రెడ్డి, ఆడిట్ పరిశీలకులుగా పెద్దపల్లి ఆడిట్ ఆఫీసర్ ఎం.మనోహర్ నియామకమయ్యారు. ఈమేరుకు వారు కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేలతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణపై చర్చించారు.

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో 2016 కంటే ముందు వార్షిక విధానంలో డిగ్రీ చదివి, సబ్జెక్టులు మిగిలిపోయిన విద్యార్థులకు ఇది సువర్ణావకాశం. ఈ నెల 31లోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బాణోతు రెడ్డి తెలిపారు. అభ్యర్థులు వర్సిటీ పరీక్షల విభాగం నుంచి ముందస్తు అనుమతి పొంది దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

నిజామాబాద్లో ఎక్కువ కార్పొరేటర్లను గెలిపించుకునేందుకు AIMIM ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 16 స్థానాలు సాధించిన MIM.. 28 స్థానాలు సాధించిన BJPకి చెక్ పెడుతూ 13 స్థానాలు సాధించిన BRSతో పొత్తు పెట్టుకుంది. దీంతో మొహమ్మద్ ఇద్రీస్ ఖాన్ (AIMIM) డిప్యూటీ మేయర్గా ఎన్నికవగా ఈ సారి కూడా తమ సత్తా చాటాలని క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

గచ్చిబౌలిలోని హౌసింగ్ బోర్డు TGHB 3 ప్రాంతాల్లో 111 LIG ఫ్లాట్లకు జనవరి 6న లాటరీ తీశారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్షగా నిర్ణయించగా, మొత్తం 2,663 అప్లికేషన్లు వచ్చాయి. ఫ్లాట్ రాని వారికి డిపాజిట్ తిరిగి చెల్లిస్తామని అధికారులు ముందే ప్రకటించారు. అయితే 22 రోజులు గడిచినా ఇప్పటికీ పైకం రాకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే తాము చెల్లించిన పైకం రిఫండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ (B.Ed) మూడవ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ను ప్రీ పోన్ చేసినట్లు సీఓఈ (COE) ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. మొదటి ఫేజ్ పరీక్షలు ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 4 వరకు, రెండో ఫేజ్ ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరగనున్నాయి. కళాశాలల ప్రిన్సిపాల్స్ సంబంధిత ప్రతులను ఈనెల 29లోగా సమర్పించాలని ఆయన ఆదేశించారు.

కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల టికెట్ల కోసం ఆశావాహులు వెంపర్లాడుతున్నారు. పోటీలో ఉండే అభ్యర్థుల ఎంపికపై అధికారికంగా జాబితా ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు మిగతా పార్టీల నుంచి పోటీచేసే ఆశావాహులు అభ్యర్థనలు పెట్టుకోగా బరిలో ఎవరు నిలుచుబోతున్నారనేది మీమాంసగా మారింది. ఆశావాహులు మాత్రం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి తొలిరోజైన బుధవారం జిల్లాలో 21 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. NZB కార్పొరేషన్లో 12, ARMR మున్సిపాలిటీలో 5, భీంగల్లో 4 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. ఇందులో BJP తరఫున 6, కాంగ్రెస్ నుంచి 9, BRS తరఫున 4, BSP, స్వతంత్ర అభ్యర్థిగా ఒక్కో నామినేషన్లు వేసినట్లు వివరించారు.

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున టీచర్స కాలనీలో 236గా ఉంది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత 15 రోజులతో పోలిస్తే ఇవాళ ఒక్కసారిగా గాలి నాణ్యత క్షిణించింది.

అత్యవసర సమయాల్లో ఏ సమస్యకు ఏ నంబర్లకు కాల్ చేయాలో మీ కోసం..
☞ 108 ఎమర్జెన్సీ రెస్పాన్స్ ☞ 102 గర్భిణులు& పిల్లల కోసం ☞ 1073 సిటీలో రోడ్డు ప్రమాదాలు జరిగితే ☞1912 విద్యుత్శాఖ ☞1098 చైల్డ్ లేబర్ ☞ 104 హెల్త్ అడ్వైజ్ తీసుకోవడానికి ☞14567 సీనియర్ సిటిజన్స్ సహాయార్థం ☞ 1098 చైల్డ్ లేబర్ ☞ 1033 నేషనల్ హైవేలపై ఎమర్జెన్సీ ఏర్పడితే ర్యాపిడ్ రెస్పాన్స్ ☞ 9440700906 షీ టీమ్స్ ☞ 9000113667 హైడ్రా
# SHARE IT
Sorry, no posts matched your criteria.