India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYD శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్చెరు పరిధి పోచారం ORR మీదుగా బౌరంపేట వెళుతున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు నవీన్, మౌనికగా పోలీసులు గుర్తించారు. మరో నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జూ పార్క్ నుంచి ఇంటికి వెళుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం.

మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల కోసం కలెక్టరేట్లోని ఐడీఓసీలో ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ IIIవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు శనివారం జరిగిన పరీక్షలను వర్సిటీ ఉన్నతాధికారులు తనిఖీ చేశారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు మొత్తం 1,977 మందికి 1,899 మంది విద్యార్థులు హాజరు కాగా 78మంది గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ గంటా చంద్రశేఖర్ తెలిపారు.

సౌత్ జోన్ & ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో భాగంగా చెస్ (స్త్రీ) ఎంపికలను నిర్వహిస్తున్నట్లు పాలమూరు యూనివర్సిటీ పీడీ డాక్టర్ వై.శ్రీనివాసులు Way2Newsతో తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని ఉన్న సంబంధిత కళాశాలల విద్యార్థులు బోనాఫైడ్ పై ప్రిన్సిపల్ సంతకంతో హాజరు కావాలన్నారు. 17-25 వయసు ఉండాలన్నారు. ముఖ్య అతిథిగా వీసీ జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు హాజరుకానున్నారు.

వీకెండ్లో అనంతగిరి కొండల్లో ‘ది బ్రీజ్’ పేరుతో సరికొత్త ఎకో టూరిజం ప్యాకేజీని TGFDC లాంచ్ చేసింది. విలాసవంతమైన టెంట్లు, అడవి మధ్యలో ‘బుష్ బ్రేక్ఫాస్ట్’, గైడెడ్ సఫారీ, ట్రెక్కింగ్, Bird View ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అడవి అందాలను ఆస్వాదిస్తూనే పర్యావరణాన్ని కాపాడేలా ఈ టూర్ను డిజైన్ చేశారు. ఈ టూర్ మీకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ముగ్గురికి రూ.5000. ఇక సర్దేయండి.
Site: deccanwoodsandtrails.com

ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 9 నుంచి 13 వరకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో BNSS 163 అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఐదుగురికి మించి గుంపులుగా చేరడం, ఊరేగింపులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు నిషేధమన్నారు. డబ్బు, మద్యం ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కరీంనగర్లో సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, సాధారణ ప్రసవాలకే మొగ్గు చూపాలని సూచించారు. గర్భిణులకు ఉచిత పరీక్షలు, మందులపై అవగాహన కల్పించాలన్నారు. చిన్నారులకు టీకాల పంపిణీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శనివారం ఆయన పలు చెక్పోస్టులను సందర్శించి భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అక్రమంగా నగదు, మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

డిండి ప్రభుత్వ ఐటీఐలో సోమవారం ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా (PMNAM) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వీరవల్లి రాధాకృష్ణ తెలిపారు. నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పలు ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళాకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 9705182677 నంబర్ను సంప్రదించవచ్చు.

‘భూ భారతి’ కోసం ప్రభుత్వం ఒక అప్రకటిత ‘స్టాప్ ఆర్డర్’ జారీ చేసినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వివాదాస్పదంగా ఉన్న సుమారు 45 వేల ఎకరాల డేటా ఎంట్రీ పూర్తికాక ముందే కొత్త సర్వే నం. కేటాయించొద్దని ఇంటర్నల్ సర్క్యులర్ వెళ్లింది. దీంతో ప్లాట్లు కొనుక్కున్న వారు రిజిస్ట్రేషన్ల కోసం సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్య తీరేందుకు మరో 6 నెలలు పట్టేలా ఉంది.
Sorry, no posts matched your criteria.