Telangana

News April 22, 2025

MBNR: కోయిలకొండలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కోయిలకొండలో 42.1 డిగ్రీలు, నవాబుపేట 42.0 డిగ్రీలు, భూత్పూర్ మండలం కొత్తమొల్గర 41.9 డిగ్రీలు, దేవరకద్ర 41.8 డిగ్రీలు, కౌకుంట్ల 41.5 డిగ్రీలు, కోయిలకొండ మండలం పారుపల్లి, మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News April 22, 2025

NLG: ఇంటర్న్‌షిప్ పథకం దరఖాస్తులకు ఇవాళే లాస్ట్

image

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2వ దశ దరఖాస్తు గడువు ఇవాల్టి వరకు పొడిగించినట్లు నల్గొండ జిల్లా పరిశ్రమల కేంద్రం జాయింట్ డైరెక్టర్ వి.కోటేశ్వరరావు తెలిపారు. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలవారి భత్యం రూ.5,000 మంజూరు చేస్తారని తెలిపారు. 12 నెలల ఇంటర్న్‌షిప్‌ కాల వ్యవధిలో కనీసం 6 నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశానికి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 22, 2025

జిల్లాలో ముమ్మరంగా ధాన్యం కనుగొళ్లు

image

ఖమ్మం జిల్లాలో యాసంగి ధాన్యం కనుగొళ్లు ముమ్మరంగా సాగుతున్నట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి చందన్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 385 రైతులకు రూ.1.45 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు. 29,056 క్వింటాళ్ల సన్నధాన్యానికి బోనస్ చెల్లించామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకాలు జరిపి మద్దతు ధర, బోనస్ పోందాలని ఆయన కోరారు.

News April 22, 2025

NLG: 20 దేశాలకు మన తాటి ముంజలు!

image

వేసవి వచ్చిందంటే చాలు తాటి ముంజలకు గిరాకీ పెరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పలువురు తాటి ముంజలను NLGకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. డజన్ రూ.70 వరకు అమ్ముతున్నట్లు తెలిపారు. NLG జిల్లాకు చెందిన మువ్వ రమేశ్ అనే యువ పారిశ్రామికవేత్త వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. గుడిమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కులోని తేజస్ ఫుడ్ ఇండస్ట్రీస్ ద్వారా 20 దేశాలకు తాటి ముంజలు ఎగుమతి చేస్తున్నారు.

News April 22, 2025

కరీంనగర్ జిల్లాలో ఎక్కడెక్కడ ఎంత ఎండ..

image

కరీంనగర్ జిల్లాలో ఎండ దంచికొడుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా మానకొండూర్ మండలంలో 43.5°C నమోదు కాగా, జమ్మికుంట 43.4, గంగాధర 43.2, తిమ్మాపూర్ 43.0, కరీంనగర్ 42.8, గన్నేరువరం 42.7, వీణవంక, కరీంనగర్ రూరల్ 42.6, రామడుగు, చిగురుమామిడి 42.5, హుజూరాబాద్, కొత్తపల్లి 42.4, ఇల్లందకుంట 42.3, శంకరపట్నం 42.2, చొప్పదండి 41.5, సైదాపూర్ 40.1°C గా నమోదైంది.

News April 22, 2025

HYD: అమర్నాథ్ యాత్ర.. ఇవి తప్పనిసరి!

image

అమర్నాథ్ యాత్రకు వెళ్లేవారికి గాంధీలో ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. పలు వైద్య పరీక్షలు మాత్రం తప్పనిసరి చేయించుకోవాలి. CBP/ESR, సీయూఈ, ఈసీజీ, చెస్ట్ ఎక్స్ రే, ఎస్ క్రియేటినిన్, ఎఫ్బీఎస్/పీఎల్బీఎస్, బ్లడ్ గ్రూప్‌తో పాటు 50 ఏండ్లు పైబడినవారికి తమ 2 మోకాళ్ల ఎక్స్ రే అవసరం. అప్లికేషన్‌ మీద ఫొటో పెట్టి గాంధీలో ఇస్తే మెడికల్ సర్టిఫికెట్ ఇస్తారు.
SHARE IT

News April 22, 2025

HYD: అమర్నాథ్ యాత్ర.. ఇవి తప్పనిసరి!

image

అమర్నాథ్ యాత్రకు వెళ్లేవారికి గాంధీలో ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. పలు వైద్య పరీక్షలు మాత్రం తప్పనిసరి చేయించుకోవాలి. CBP/ESR, సీయూఈ, ఈసీజీ, చెస్ట్ ఎక్స్ రే, ఎస్ క్రియేటినిన్, ఎఫ్బీఎస్/పీఎల్బీఎస్, బ్లడ్ గ్రూప్‌తో పాటు 50 ఏండ్లు పైబడినవారికి తమ 2 మోకాళ్ల ఎక్స్ రే అవసరం. అప్లికేషన్‌ మీద ఫొటో పెట్టి గాంధీలో ఇస్తే మెడికల్ సర్టిఫికెట్ ఇస్తారు. 
SHARE IT

News April 22, 2025

రేపే హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు

image

జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు తమ ఓ హక్కును వినియోగించుకోనున్నారు. ఈనేపథ్యంలో బుధవారం జరగబోయే ఎన్నికలకు సంబంధించిన జీహెచ్ఎంసీ ముమ్మురమైన ఏర్పాటు చేస్తోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తున్నారు.

News April 22, 2025

వరంగల్: తేలనున్న 12,321 మంది విద్యార్థుల భవితవ్యం!

image

వరంగల్ జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో ఈ ఏడాది 12,321 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. మొదటి సంవత్సరం జనరల్‌లో 4,967 మంది, ఒకేషనల్- 848, ద్వితీయ సంవత్సరం జనరల్-5,739, ఒకేషనల్‌ 767 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను వేగంగా Way2News యాప్‌లో చూసుకోవచ్చు. #SHARE IT

News April 22, 2025

కరీంనగర్: తేలనున్న 35,562 మంది భవితవ్యం

image

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు నేడు విడుదల చేయనుంది. KNR జిల్లాలో మొత్తం 35,562 మంది పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరంలో 17,799 మంది, ద్వితీయ సంవత్సరంలో 17,763 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం నేడు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST