India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి 26 వరకు ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్ఓ వెంకటాచారి ఆదేశించారు. జిల్లాలో 73 కేంద్రాల్లో 15,068 మంది విద్యార్థులు హాజరవుతారు. సెల్ఫోన్లను అనుమతించరు. 144 సెక్షన్ అమలు చేస్తామని తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయి. మౌలిక సదుపాయాలు, బందోబస్తు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ఖమ్మం జిల్లా లోని మధిర, వైరా, కల్లూరు మినీ స్టేడియాల్లో క్రీడా కారులకు శిక్షణ ఇచ్చేందుకు గాను కోచ్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువ జన, క్రీడల శాఖ అధికారి సునిల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల ఎన్ఐఎస్ శిక్షణ పొంది సర్టిఫికెట్ ఉన్న వారు, సీనియర్ క్రీడాకారులు ఈనెల 22 కల్లా తమ దరఖాస్తులను సర్దార్ పటేల్ స్టేడియంలోని కార్యాలయంలో అందజేయాలని కోరారు.
మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన వెలగపూడి రమేశ్ అమెరికాలో అనారోగ్యంతో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రమేశ్ అమెరికాలోని డల్లాస్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని అమెరికా నుంచి స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు రమేశ్ ఫ్రెండ్స్, తానా కమిటీ వారు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
చెన్నారావుపేట మం. పుల్లయ్యబోడు తండాలో మంగళవారం <<16107593>>టిప్పర్ ఢీకొని<<>> రెండో తరగతి విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన వెంకన్న-జ్యోతికి కూతురు, కొడుకు. అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన కొడుకు అనిల్(8) చాక్లెట్ కొనుక్కోవడానికి షాప్కు వెళ్లాడు. నెక్కొండ నుంచి వస్తున్న టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఢీకొట్టడంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
మూసాపేట మండలంలో ఓ చిరువ్యాపారి నిర్వహిస్తున్న డబ్బా మీద పడి మహిళ మృతి చెందారు. స్థానికుల వివరాలు.. వేముల గ్రామ శివారులోని ఓ కంపెనీ దగ్గర ఓ వ్యాపారి కిరాణా డబ్బాను నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా ఆ కంపెనీ దగ్గర అయ్యమ్మ(75) వరి ధాన్యాన్ని అరబెట్టుకుంటూ ఉండేది. నిన్న సాయంత్రం కురిసిన గాలివానకు ఆమె ఆ డబ్బా దగ్గర తలదాచుకుంది. ప్రమాదవశాత్తు ఆ డబ్బా ఆమె మీద పడటంతో అయ్యమ్మ అక్కడికక్కడే మృతిచెందింది.
ఖమ్మం నగరంలో మున్నేరు నదికి ఇరువైపులా 30 అడుగుల ఎత్తులో ఆర్సీసీ కాంక్రీట్ గోడలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఖమ్మం పట్టణంలోని ఆరు కాలనీలు, పాలేరు నియోజకవర్గంలోని రెండు కాలనీలను వరద సమయంలో రక్షించడానికి ఉపయోగపడతాయి. ఇప్పటికే అధికారులు సమీక్ష నిర్వహించి తగు చర్యలు ప్రారంభించారు.
HYD జలమండలి అధికారులు నల్లాకు మోటార్ కనెక్షన్లపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభిచారు. మోటార్ వాడకం, నీటి వృథాను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. మాదాపూర్లో ఎండీ అశోక్ రెడ్డి పర్యటించారు. మొదటి రోజే 64 మోటార్లు స్వాధీనం చేసుకుని, 84 మందికి ఫైన్ విధించారు. మోటార్ కనెక్షన్పై ఫిర్యాదు చేయాలంటే జలమండలి అధికారునలు సంప్రదించాలని లేదా 155313కి ఈ నంబర్కు కాల్ చేయవచ్చని సూచించారు.
ఖమ్మం గాంధీ చౌక్లోని రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయం నందు ఈనెల 17న ఉదయం 10 గంటలకు మహిళలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మాధవి తెలిపారు. ప్రైవేట్ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 30-45 సంవత్సరాల వయస్సు కలిగి, డిగ్రీ పాసైన మహిళలు అర్హులని పేర్కొన్నారు. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
10, 20 కాదు గంటకు 200 కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి ఎక్కడో కాదు HYDలో. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో రాంగ్ రూట్లో వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల్లో 4,32,824 రాంగ్ రూట్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. HYDలో 1,62,000 కేసులు, రాచకొండలో 53,824, సైబరాబాద్లో 2,17,000 కేసులు నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.20.19 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బేస్మెంట్ పూర్తి చేసుకున్న ఇళ్ల లబ్ధిదారులకు నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. మొదటి విడతలో పైలెట్ ప్రాజెక్ట్ కింద మంజూరు చేసిన 70,122 ఇళ్లలో బేస్మెంట్ పూర్తి చేసుకున్న 2,019 మందికి రూ.లక్ష చొప్పున విడుదల చేసినట్లు ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.