India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 882 జలాశయాల్లో 3.49కోట్ల చేపపిల్లలు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి టెండర్ల దరఖాస్తు కోసం ఆహ్వానించిన విషయం తెలిసింది. అయితే జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నాటికి మూడు టెండర్లు నమోదైనట్లు సమాచారం. దీంతో గడువును ఈనెల 8వ తేదీ వరకు పెంచారు. ఆపై టెండర్లను ఖరారు చేశాక చేప పిల్లల పంపిణీ చేయనున్నారు.
1.గండీడ్-32,246, 2. మహమ్మదాబాద్ – 31,291, 3. రాజాపూర్ -21,772, 4. నవాబుపేట -40,193, 5. మిడ్జిల్ -25,128, 6. మూసాపేట-21,549, 7. మహబూబ్ నగర్ రూరల్-34,806, 8. కౌకుంట్ల -16,987, 9. కోయిలకొండ -52,175, 10. జడ్చర్ల – 40,861, 11.హన్వాడ -40,392, 12.దేవరకద్ర -26,239, 13. సీసీ కుంట -31,056, 14. భూత్పూర్ -27,080, 15. బాలానగర్ -33,437, 16. అడ్డాకల్ -24,370 మంది ఓటర్లు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలంటూ పలు ప్రాంతాలకు చెందిన వారు ప్రజాభవన్లో వినతిపత్రాలు అందజేశారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో 243 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అత్యధికంగా 87 మంది ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి 33, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 57, మిగతా సమస్యలపై 66 మంది వినతిపత్రాలు ఇచ్చారని ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి తెలిపారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారులు విడుదల చేసిన ఓటరు తుది జాబితా ప్రకారం నిజామాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం 8,51,417 మంది ఓటర్లు ఉండగా మహిళలు 4,54,621 మంది ఉండగా ARMR డివిజన్లో 1,95,092 మంది, BDN డివిజన్లో 1,21,591 మంది, NZB డివిజన్లో 1,46,938 మంది మహిళలు ఉన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా పురుషులు 3,96,778 మంది ఉన్నారు. ఇతరులు 18 మంది ఉన్నారు.
HYDలో మరో పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటు కానుంది. MGBS మెట్రో స్టేషన్లో ఈ నెల 15, 16న దీనిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం నగరంలో 3 PSKలు ఉండగా పాత బస్తీతో పాటు తూర్పుభాగంలో ఉండే ప్రజలకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడనుంది. MGBS మెట్రో స్టేషన్ మొదటి అంతస్తులో ఈ కార్యాలయం అందుబాటులోకి రానుంది. దీనిని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, సహాయక మంత్రి గానీ ప్రారంభించనున్నారు.
# SHARE IT
భిన్నత్వంలో ఏకత్వానికి HYD నిదర్శనం అనడానికి ఈ ఫొటోనే గొప్ప ఉదాహరణ. యాకుత్పురలో సుమారు 30 ఏళ్లుగా కటింగ్ షాప్ నడుపుతున్నట్లు ప్రదీప్ తెలిపారు. షాప్లో వెంకటేశ్వర స్వామి, ముస్లిం సమాజానికి ప్రత్యేకమైన కాబా ఒకే దగ్గర ఏంటని అడగగా.. ఆయన తండ్రి ఇష్టంగా పూజించేవారని, ఆయన మరణం తర్వాత షాప్, ప్రార్థన బాధ్యతలు ప్రదీప్ తీసుకున్నట్లు వివరించారు.
2020లో వచ్చిన వరదలు HYD, అటు శివారులను అతలాకుతలం చేశాయి. ఒకేరోజు 30 సెంటీమీటర్ల వర్షం నమోదు కావటంపై నాటి నుంచి IMD అధ్యయనం చేసి ఇటీవల నివేదిక రూపొందించింది. వాతావరణంలో మార్పులకు తోడు HYDలో వస్తున్న స్థానిక మార్పుల ప్రభావంతో భారీ వర్షపాతం నమోదు, క్లౌడ్ బరస్ట్కు దారితీస్తోందని పేర్కొంది. HYD మొత్తం కాంక్రీట్ జంగిల్ కావడం, మరోవైపు పొల్యూషన్, పట్టణీకరణ ప్రభావమూ ఉన్నట్లు ఇది తేల్చింది.
కూసుమంచి మండలం కేశవాపురం గ్రామపంచాయతీ పరిధి చింతలతండా గ్రామానికి చెందిన దారావత్ నాగేశ్వరావు కుమారుడు వార్షిక్ తేజ (6) జ్వరంతో మృతి చెందాడు. గత వారం రోజుల నుంచి జ్వరం రావడంతో ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తేజ కూసుమంచిలో యూకేజీ చదువుతున్నాడు. తేజ మృతితో తండాలో విషాదం అలుముకుంది
నల్గొండ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 5,42,589 మంది మహిళా ఓటర్లు ఉండగా, పురుషుల సంఖ్య 5,30,860. దీంతో పురుషుల కంటే మహిళా ఓటర్లు 11,729 మంది అధికంగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 869కి చేరింది.
నల్గొండ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లోని ఓటర్ల సంఖ్య పది లక్షలు దాటింది. మంగళవారం విడుదల చేసిన పంచాయతీ ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 33 మండలాల్లో 10,73,506 ఓటర్లు ఉన్నట్లు తేలింది. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో 9,30,205 ఓటర్లు ఉండగా, ప్రస్తుత జాబితాలో 1,43,301 మంది ఓటర్లు పెరిగారు. ఈ జాబితాతోనే త్వరలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధమవుతోంది.
Sorry, no posts matched your criteria.