Telangana

News February 5, 2026

HYD: హైడ్రా కమిషనర్‌తో ప్రతి శనివారం PHONE IN

image

ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రతి శనివారం ‘ఫోన్-ఇన్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి సోమవారం జరిగే ‘ప్రజావాణి’కి అదనంగా, ఇకపై శనివారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు కమిషనర్ రంగనాథ్ ఈ ప్రోగ్రాంలో అందుబాటులో ఉంటారు. చెరువులు, పార్కులు, రహదారుల ఆక్రమణలపై ORR పరిధిలోని ప్రజలు 040- 29565750, 040- 29565759 నంబర్లకు ఫోన్ చేసి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

News February 5, 2026

NLG: తగ్గుతున్న పంటల సాగు.. వరిదీ అదే పరిస్థితి

image

మారిన వాతావరణ పరిస్థితులు.. సాగు ఖర్చులు పెరగడం.. దిగుబడులు తగ్గడం గిట్టుబాటు ధరలు లేకపోవడం తదితర కారణాలతో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతుంది. ఈ యాసంగిలో జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని పేర్కొన్నప్పటికీ.. ఈ సీజన్ ముగిసేనాటికి 4.36 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయింది.

News February 5, 2026

నిధుల బకాయిల ఉచ్చులో ఖమ్మం పెద్దాసుపత్రి

image

ఖమ్మం పెద్దాసుపత్రికి ఏడాదిన్నరగా ఆరోగ్యశ్రీ నిధులు రాకపోవడంతో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. ఆర్థో విభాగానికి రావాల్సిన రూ.60 లక్షల బకాయిల వల్ల మోకాళ్ల ఆపరేషన్లు నిలిచిపోయాయి. క్యాత్ ల్యాబ్ పరికరాల కొనుగోలుకు నిధుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. నిధుల కొరతతో అభివృద్ధి పనులు కుంటుపడటమే కాకుండా, రోగులకు సరైన చికిత్స అందడం లేదని, ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.

News February 5, 2026

ADB: అభ్యర్థులు ఖర్చు పెట్టేముందుకు జాగ్రత్త..!

image

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖర్చులకు తగ్గ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని, వాటి గురించి తెలుసుకోవాలని ఎన్నికల జిల్లా అబ్జర్వర్ హన్మంత్ నాయక్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిబంధనల గురించి తెలుసుకోవాలని సూచించారు. తమకు ఎన్నికల కమిషన్ విధించిన లక్ష లోపే ఖర్చులు చేయాలన్నారు. ఖర్చులు ఎక్కువైతే గెలిచిన తరువాత కూడా డిస్ క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.

News February 5, 2026

HYD: వర్క్ STRESSతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ SUICIDE

image

మియాపూర్‌లోని BKఎన్‌క్లేవ్‌లో ఓ యువకుడు గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. AP అమలాపురానికి చెందిన సతీశ్(31) గచ్చిబౌలిలోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. పనిఒత్తిడి తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. సతీశ్‌కు ఏడాది క్రితం వివాహం కాగా భార్య సొంతూరుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

News February 5, 2026

నల్గొండ: పుట్టింటికి భార్య.. యువకుడి సూసైడ్

image

తాగుడుకు బానిసై ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కట్టంగూరు(M) ఇస్మాయిల్ పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొత్త నాగరాజు (29) తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తాగుడుకు బానిసయ్యాడని అతని భార్య కుమార్తెను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News February 5, 2026

నల్గొండ: ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశాలకు ఆహ్వానం

image

ఎస్సీ స్టడీ సర్కిల్స్ ప్రవేశాలకు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా అధికారి శశికళ తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని, మార్చి 1న నల్గొండ ఎన్జీ కళాశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని, హాల్ టికెట్లను ఈ నెల 25 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News February 5, 2026

NZB: విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

image

జక్రాన్‌పల్లి మండలంలో విద్యుత్ షాక్‌కు గురై వంశీకృష్ణ (30) అనే వ్యక్తి మృతి చెందాడు. SI మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్‌కు చెందిన వంశీకృష్ణ బైక్ పై మాక్లూర్‌లోని ముత్యంపల్లెలో గల తన భార్య వద్దకు వెళుతున్నాడు. మార్గమధ్యలో రాత్రి దారి తప్పిపోయి సికింద్రాపూర్ రంగనాయక గుట్ట వద్ద తిరుగుతుండగా జొన్న తోటకు అడవి పందుల కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ తీగల తగిలి మృతి చెందాడు.

News February 5, 2026

HYD: పిల్లలనూ వదలని ‘CANCER భూతం’..!

image

నగరంలోని ప్రధాన క్యాన్సర్ చికిత్స కేంద్రాల వద్ద రోజురోజుకూ క్యాన్సర్ బాధితుల క్యూ పెరుగుతోంది. 2023లో సగటున 15,000 మంది బాధితులు రేడియేషన్ థెరపీ కోసం వస్తే, 2024లో ఆ సంఖ్య 22,000కు చేరింది. ఇక 2025 అక్టోబర్ నాటికి ప్రభుత్వ దవాఖానాల్లో రిఫరల్ కేసుల సంఖ్య 3,500 దాటినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా నిలోఫర్ ఆసుపత్రిలో పిల్లల CANCER కేసులు గత ఐదేళ్లతో పోలిస్తే 12% వృద్ధి చెందడం తీవ్ర ఆందోళనకరం.

News February 5, 2026

HYD: లక్షలో 60- 75మంది చనిపోతున్నారు..!

image

<<19053952>>HYDలో CANCER వ్యాప్తి<<>> ఏటేటా పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల లెక్కల ప్రకారం.. 2023లో 25000 కేసులు నమోదవ్వగా, 2024కి ఆ సంఖ్య 38000 దాటింది. 2025 అంచనా ప్రకారం ఈ సంఖ్య 45000కు చేరింది. అయితే సకాలంలో వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో ప్రతి లక్షమందిలో సగటున 60- 75మంది దాకా ప్రాణాలు కోల్పోతున్నారు. దురదృష్టవశాత్తు నగరంలో 65%- 70% కేసులు 3, 4వ దశలోనే డిటెక్ట్ అవుతున్నాయి. ఇది అత్యంత ఆందోళనకర అంశం.