Telangana

News April 16, 2025

ADB: పోలీసులపై పోస్టులు.. ఒకరిపై కేసు: CI

image

ఇటీవల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన నేరస్థుడిని సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటంతో పాటు పోలీసుల వైఖరిని విమర్శించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు.ADB ఖుర్షీద్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్‌ పోలీసులను కించపరిచేలా పోస్టులు పెట్టాడు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించడంపై కేసు నమోదు చేశారు. నిందితుడు పెట్టిన ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే కేసు పెడతామన్నారు.

News April 16, 2025

రాజీవ్ యువ వికాస్ దరఖాస్తులు.. కులాల వారీగా..!

image

ఖమ్మం జిల్లాలో రాజీవ్ యువ వికాస్ పథకానికి 91,850 దరఖాస్తులు  అందినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శ్రీజ తెలిపారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 29,091, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 14,220, బీసీ కార్పొరేషన్ ద్వారా 41,881, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 6,658 దరఖాస్తులు వచ్చాయన్నారు. వచ్చిన ధరఖాస్తులన్నిటిని ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేసినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ పేర్కొన్నారు.

News April 16, 2025

రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణం కావొద్దు: ఎస్పీ

image

రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణం కావొద్దని మెదక్ SP ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రోడ్లపై వరి ధాన్యం ఆరబెట్టడంతో రోడ్లు ఇరుకుగా మారి రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా ధాన్యంపై మోటార్ సైకిల్ వెళ్తే స్కిడ్ అయ్యి పడే అవకాశం ఉందన్నారు. రాత్రి సమయాల్లో రోడ్డుపై ధాన్యం కుప్పలు చేసి బండరాళ్లు పెట్టడంతో వాహనదారులు ప్రమాదాలుకు గురవతున్నారని, ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.

News April 16, 2025

ADB: నాలుగు రోజుల్లో పరీక్షలు.. చదువుకున్నారా..?

image

ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ADBలోని డీఈఓ ఆఫీస్‌లో పరీక్ష నిర్వాహణ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి పరీక్షలకు 518 మంది, ఇంటర్మీడియట్ పరీక్షకు 395 మంది అభ్యాసకులు హాజరవుతారన్నారు. ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు.

News April 16, 2025

ADB: బెల్ట్ షాపుపై దాడులు.. కేసు నమోదు: CI

image

ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెర కాలనీలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా దుకాణంలో రూ. 2,200 విలువైన మూడు లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ మేరకు బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న రాజుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 16, 2025

KNR: పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండ్ పూర్తిచేయాలి: కలెక్టర్

image

పైలట్ ప్రాజెక్టులో ఎంపికైన గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ వర్క్ పూర్తిచేయాలని మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో నిబంధనల ప్రకారం ‌కట్టుదిట్టమైన ప్రణాళికతో అత్యంత నిరుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. పొరపాటులకు తావివ్వరాదని అన్నారు. ఆర్డీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.

News April 16, 2025

నకిలీ విత్తనాలను సమన్వయంతో అరికడదాం: కలెక్టర్‌

image

నకిలీ విత్తనాలను సమన్వయంతో అరికడదామని వరంగల్ కలెక్టర్‌ డాక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. మంగళవారం శివనగర్‌లోని ఓ కన్వెన్షన్ హలులో విత్తనాలు, ఎరువుల, క్రిమిసంహారక మందుల కంపెనీ ప్రతినిధులు, డీలర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ అంకిత్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి అనురాధతో కలిసి కలెక్టర్ మాట్లాడారు. నకిలీ పురుగుల మందులు అమ్మితే పీడీ యాక్టు నమోదుతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 16, 2025

నిందితుడికి జీవిత ఖైదు.. పోలీసులకు సత్కారం

image

వరంగల్ కమిషనరేట్ పరిధి గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధి బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష పడటంతో కృషి చేసిన వారిని డీసీపీ అంకిత్ కుమార్ సత్కరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రవికిరణ్, మర్రి వాసుదేవ రెడ్డి, భరోసా లీగల్ అడ్వైజర్ నీరజ, ఏసీపీ తిరుపతి, ఇన్‌స్పెక్టర్ బాబూలాల్, మహేందర్, హెడ్ కానిస్టేబుల్ విజేందర్, కానిస్టేబుళ్లు శ్రవణ్, యుగంధర్‌ను ఆయన అభినందించారు.

News April 16, 2025

ఖమ్మం: విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలలో చేరాలి: అ.కలెక్టర్

image

పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వీటితోపాటు ప్రభుత్వ కేజీబీవీ, రెసిడెన్షియల్ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. వీటిలో 100 శాతం అడ్మిషన్లు జరిగేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.

News April 16, 2025

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ WARNING

image

రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసి ప్రమాదాలకు కారణం కావద్దని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ హెచ్చరించారు. అతి వేగంగా రోడ్లపై ప్రయాణించే వాహనదారులు రోడ్లపై కుప్పలుగా ఉన్న ధాన్యాన్ని గమనించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. రోడ్లపై ధాన్యం కుప్పలు పోసి వాటిపై నల్ల కవర్లు కప్పడంతో రాత్రి సమయంలో అవి కనిపించడం లేదని, ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందన్నారు.

error: Content is protected !!