Telangana

News September 22, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ తాజా UPDATE

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గడంతో అన్ని గేట్లు మూసివేశారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.7462 టీఎంసీలుగా ఉంది. ఔట్ ఫ్లో: 44,870 క్యూసెక్కులు కాగా, ఇన్ ఫ్లో: 37,953 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.

News September 22, 2024

HYD: ఫోర్త్ సిటీలో 200 ఎకరాల్లో జూ పార్క్!

image

HYD శివారు ఫోర్త్ సిటీ ఏరియాలో 200 ఎకరాల్లో జూ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 2 రోజుల క్రితం అటవీశాఖ బృందం గుజరాత్ జామ్‌నగర్ ‘వన్ తారా’ జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి అధ్యయనం చేసింది. ఫోర్త్ సీటీ చుట్టూర దాదాపు 18 వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. ఈ నేపథ్యంలో 200 ఎకరాల్లో జూ పార్కుతో పాటు, 1000 ఎకరాల ప్రాంతాన్ని గ్రీన్ బెల్టుగా చూపాలని ప్రభుత్వం భావిస్తోంది.

News September 22, 2024

HYD: ఫోర్త్ సిటీలో 200 ఎకరాల్లో జూ పార్క్!

image

HYD శివారు ఫోర్త్ సిటీ ఏరియాలో 200 ఎకరాల్లో జూ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 2 రోజుల క్రితం అటవీశాఖ బృందం గుజరాత్ జామ్‌నగర్ ‘వన్ తారా’ జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి అధ్యయనం చేసింది. ఫోర్త్ సీటీ చుట్టూర దాదాపు 18 వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. ఈ నేపథ్యంలో 200 ఎకరాల్లో జూ పార్కుతో పాటు, 1000 ఎకరాల ప్రాంతాన్ని గ్రీన్ బెల్టుగా చూపాలని ప్రభుత్వం భావిస్తోంది.

News September 22, 2024

పెద్దవంగర: అప్పుల బాధతో ఫీల్డ్ అసిస్టెంట్ సూసైడ్

image

అప్పుల బాధతో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. SI క్రాంగి కిరణ్ వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ అప్పుల బాధతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ విధులు నిర్వర్తిస్తున్నాడు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News September 22, 2024

రామగుండం: ఈనెల 30 వరకు డిగ్రీ, పీజీ దరఖాస్తులకు అవకాశం

image

KU దూర విద్యా కేంద్రంలో డిగ్రీ, పీజీ చేయడానికి SEP-30 దరఖాస్తులకు అవకాశం ఉందని సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రామ చంద్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీ పాసైన వారికి అవకాశం ఉందన్నారు. దూర ప్రాంతాల వారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు 8341 3850 00 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

News September 22, 2024

నర్సింగాపూర్‌లో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సూత్రం ఆంజనేయులు(22) ఈరోజు ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ ప్రారంభించారు.

News September 22, 2024

నస్రుల్లాబాద్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా శివారులోని అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థుల వివరాలు ప్రకారం.. అంకోల్ గ్రామానికి చెందిన కుర్మరామ్‌గోండ(40) శనివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు.

News September 22, 2024

భైంసా: బాల్కానీ పై నుంచి పడి ఒకరి మృతి

image

భైంసా మండలంలోని కోతుల్గాం గ్రామానికి చెందిన అమెడా గజ్జన్న(50)బాల్కానీపై నుంచి పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శనివారం రాత్రి గజ్జన్న ఇంటి పక్కన శుభకార్యంలో భోజనానికి వెళ్లాడు. అక్కడ బాల్కనీ నుంచి కిందికి చూస్తూ కాలుజారి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య రుక్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

News September 22, 2024

సిద్దిపేట: రైతులకు అండగా ఉంటాం: హరీశ్ రావు

image

రైతు సమస్యలపై పోరాటానికి నంగునూరు వేదికగా మారనుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. రుణమాఫీ, రైతుబంధు, పంటలకు బోనస్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 27న నంగునూరులో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సన్నాహక ఏర్పాట్లలో భాగంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.

News September 22, 2024

విద్యుత్ తీగ తెగి మీద పడి రైతు మృతి

image

విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతిచెందిన ఘటన ఆత్మకూర్ (ఎస్) కందగట్లలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు మంచాల సైదులు తన పొలంలో విద్యుత్‌మోటార్ అమర్చడానికి నియంత్రిక వద్దకు వెళ్లగా విద్యుత్ తీగ తెగి మీద పడింది. దీంతో కరెంట్ షాక్‌కు గురైయ్యాడు. స్థానికుల ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై సైదులు తెలిపారు.