Telangana

News September 22, 2024

నర్సింగాపూర్‌లో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సూత్రం ఆంజనేయులు(22) ఈరోజు ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ ప్రారంభించారు.

News September 22, 2024

నస్రుల్లాబాద్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా శివారులోని అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థుల వివరాలు ప్రకారం.. అంకోల్ గ్రామానికి చెందిన కుర్మరామ్‌గోండ(40) శనివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు.

News September 22, 2024

భైంసా: బాల్కానీ పై నుంచి పడి ఒకరి మృతి

image

భైంసా మండలంలోని కోతుల్గాం గ్రామానికి చెందిన అమెడా గజ్జన్న(50)బాల్కానీపై నుంచి పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శనివారం రాత్రి గజ్జన్న ఇంటి పక్కన శుభకార్యంలో భోజనానికి వెళ్లాడు. అక్కడ బాల్కనీ నుంచి కిందికి చూస్తూ కాలుజారి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య రుక్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

News September 22, 2024

సిద్దిపేట: రైతులకు అండగా ఉంటాం: హరీశ్ రావు

image

రైతు సమస్యలపై పోరాటానికి నంగునూరు వేదికగా మారనుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. రుణమాఫీ, రైతుబంధు, పంటలకు బోనస్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 27న నంగునూరులో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సన్నాహక ఏర్పాట్లలో భాగంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.

News September 22, 2024

విద్యుత్ తీగ తెగి మీద పడి రైతు మృతి

image

విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతిచెందిన ఘటన ఆత్మకూర్ (ఎస్) కందగట్లలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు మంచాల సైదులు తన పొలంలో విద్యుత్‌మోటార్ అమర్చడానికి నియంత్రిక వద్దకు వెళ్లగా విద్యుత్ తీగ తెగి మీద పడింది. దీంతో కరెంట్ షాక్‌కు గురైయ్యాడు. స్థానికుల ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై సైదులు తెలిపారు.

News September 22, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నూతన మార్కెట్ కమిటీ ఛైర్మన్లు

image

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదవుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు మార్కెట్ కమిటీలకు నూతన ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిజామాబాద్ మార్కెట్ కమిటీకి ముప్పిడి గంగారెడ్డి, కమ్మర్‌పల్లికి పాలేపునర్సయ్య, వేల్పూర్‌కు కోతినేటి ముత్యం రెడ్డి, బిక్కనూర్‌కు పాత రాజును ఛైర్మన్‌లుగా నియమించారు.

News September 22, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి ప్రధానాంశాలు

image

> చిక్కడపల్లి త్యాగరాజ గానసభలో అన్నమయ్య పద సమార్చనం
> బొటానికల్ గార్డెన్ లో బర్డ్ వాక్
> ఉప్పల్‌లోని విశ్వకర్మ ఆత్మగౌరవ భవనంలో విరాట్ విశ్వకర్మ యజ్ఞమహోత్సవం
> కార్వాన్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> తెలంగాణ ఆక్యుపంక్చర్ అక్యుప్రెషర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
బషీరాబాగ్ ప్రెస్ క్లబ్‌లో సెమినార్
> డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

News September 22, 2024

‘వైద్య సేవలు MBNRలో TOP.. NGKLలో NILL’

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 45 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ వైద్య సేవలను 20 ప్రైవేట్, 15 ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్నారు. ఇందులో అత్యధికంగా MBNRలోనే 14 ప్రైవేట్, 3 ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. WNPT-9,GDWL-4,NRPT-5 ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుతున్నాయి. NGKLలో ఒక్క ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులో లేవు.

News September 22, 2024

మెట్‌పల్లి: గుంతలు పూడ్చండి అంటూ వినూత్న ఫ్లెక్సీ

image

మెట్‌పల్లి నుంచి వేంపేట మీదుగా నిర్మల్ జిల్లాకు వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. రైల్వే గేటు కింద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. గుంతల్లో పడి గాయాలపాలవుతున్నామంటూ కొందరు వ్యక్తులు వినూత్న ప్రయత్నం చేశారు. గుంతల పేరిట ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ‘మమ్మల్ని పూడ్చండి’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.

News September 22, 2024

ADB: భర్త, పిల్లలతో వెళ్తూనే తిరిగిరాని లోకానికి పయనం

image

ఆనందంగా భర్త, పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది. ఎల్మా రాకేశ్ రెడ్డి తన భార్య రుతుజరెడ్డి (30), కూతుళ్లు వరణ్య (5), కియారా (2)తో కలిసి శనివారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గణేశ్ మందిరం వద్ద మరో ద్విచక్ర వాహనం వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రుతుజ తలకు తీవ్ర గాయమై దుర్మరణం చెందగా మిగిలిన వారికి గాయాలయ్యాయి.