India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 45,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయి. ఇప్పటికే ప్రజా పాలన పేరుతో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గాంధీ జయంతి తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు మార్గదర్శకాలు రాగానే గుడిసెల్లో నివాసముండే వారికి ప్రాధాన్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
తాడ్వాయిలో <<14206753>>అటవీ శాఖ అధికారులపై దాడి<<>> కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ములుగు ఎస్పీ శబరీశ్ తెలిపారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసినా, వారి విధులకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. పీడీ యాక్ట్, రౌడీషీట్ సైతం నమోదు చేస్తామన్నారు.
సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతి పై హైదరాబాద్లోని జలసౌధలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఖమ్మం జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రులు ఆదేశించారు.
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి దీప్తి అన్నారు. నల్గొండ పట్టణంలోని చర్లపల్లి సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో చట్టాల అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన లేక ఎంతో మంది స్త్రీలు రకరకాల హింసను మౌనంగా భరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జ్ అపర్ణ, పారా లీగల్ వాలంటరీ భీమనపల్లి శ్రీకాంత్ తదితరులున్నారు.
పిట్లంలోని అంగన్వాడి 7 వ కేంద్రంలో ఆట పాటలు, చదువుతో అలసి పోయిన చిన్నారులు మధ్యాహ్నం ఆహారం తీసుకున్నాక గాఢ నిద్రలోకి జారుకున్నారు. రోజూ మాదిరిగానే పూర్వ ప్రాథమిక టీచర్ ప్రవీణ జ్యోతి బాల తరగతులు చేపట్టారు. అనంతరం పిల్లలు ఆహారం తీసుకొని టీచర్ సూచనల మేరకు నిద్రించారు. ఎల్లలు కల్లలు ఎరుగని బాలలు సుఖమెరగకుండా చక్కగా కొద్ది సేపు పడుకొని లేచారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని ఆదిలాబాద్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ అతిక్ బేగం పేర్కొన్నారు. అక్టోబర్ 5 వరకు అవకాశం ఉందని తెలిపారు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 15 వరకు అవకాశం ఇచ్చారని తెలిపారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి.. ఫీజు చెల్లించండి.
>>SHARE IT
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.84,148 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.30,366, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.32,670, అన్నదానం రూ.21,112 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
కొండగట్టులో ఈనెల 29న అర్చకులకు సన్మానం నిర్వహించనున్నారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొండగట్టులోని బృందావనంలో సాంస్రృతిక కార్యక్రమాలు, చర్చాగోష్ఠితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలు ఆలయాల అర్చకులకు సన్మానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఎ.ఉజ్వల, కొండలరావు తెలిపారు. విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.
@ రాష్ట్రస్థాయిలో జగిత్యాల కలెక్టర్కు తృతీయ బహుమతి.
@ బుగ్గారం మండలంలో చెరువులో పడి పశువుల కాపరి మృతి.
@ ధర్మారం మండలంలో విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి.
@ ఇల్లంతకుంట మండలంలో కస్తూర్బా బాలికల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్.
@ మెట్పల్లిలో నిబంధనలు పాటించని పానీపూరి బండ్లకు జరిమానా.
@ ప్రవాసి ప్రజావాణి ప్రారంభించిన పొన్నం ప్రభాకర్.
❤ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
❤MBNR:30న ఉమ్మడి జిల్లా రెజ్లింగ్ ఎంపికలు
❤దామరగిద్ద మండలంలో చిరుత సంచారం
❤డబ్బుల మూటలు సదిరెందుకే కాంగ్రెస్ హైడ్రా డ్రామాలు:DK అరుణ
❤అయిజ: టీచర్లను నియమించాలని విద్యార్థులు ఆందోళన
❤ధన్వాడ:చిరుత దాడిలో ఎద్దు మృతి
❤వనపర్తి:ఘనంగా వరల్డ్ టూరిజం డే
❤లోక్ అదాలత్ను విజయవంతం చేయండి: బార్ అసోసియేషన్
❤గండీడ్: గ్యాస్ సబ్సిడీ పత్రాలు పంపిణీ.. MLAకు ఘన సన్మానం
Sorry, no posts matched your criteria.