Telangana

News September 22, 2024

28న నల్సార్ యూనివర్సిటీకి రాష్ట్రపతి

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నెల 28న ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవం, సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవంలో ఆమె పాల్గొంటారని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు. ఈ మేరకు సీఎస్ అధికారులతో సమావేశమై ఈరోజు సమీక్ష నిర్వహించారు. తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

News September 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} భద్రాచలం రామాలయం వద్ద కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు
∆} నేలకొండపల్లిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం& భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు

News September 22, 2024

UPDATE.. జనగామ: తల్లిని చంపిన కొడుకు

image

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం నమిలిగొండలో కొడుకు <<14155815>>తల్లిని <<>>హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి సతీశ్ తల్లితో గ్యాస్ కనెక్షన్, కరెంట్ మీటర్, భూమి, డబ్బుల విషయంలో గొడవపడ్డాడు. ఈక్రమంలో తల్లి లక్ష్మిని రోకలిబండతో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సతీశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

News September 22, 2024

తొగుట: నిండుకుండలా మల్లన్నసాగర్‌

image

సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లో 21.12 టీఎంసీల నీటిని నిల్వచేసి 2024-25 సీజన్‌ పంపింగ్‌ ముగించామని ప్రాజెక్టు డీఈఈ శ్రీనివాస్‌ తెలిపారు. ఇప్పటి వరకు 18.50 టీఎంసీల గోదావరి జలాలను మల్లన్నసాగర్‌లోకి పంపింగ్‌ చేశామని, దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారిందని ఆయన తెలిపారు. మల్లన్నసాగర్‌ నుంచి 5.5 టీఎంసీల నీటిని కొండపోచమ్మ సాగర్‌కు తరలించినట్లు తెలిపారు.

News September 22, 2024

వనపర్తి: ఇది ఈ జలాశయం ప్రత్యేకత.!

image

వనపర్తి సంస్థానాధీశుడు రాజా రామేశ్వర్ రావు సూచనతో ఇంజనీరు రామకృష్ణ రాజు కృషితో 1959లో 10 గ్రామాలకు సాగునీరు అందించేలా సరళా సాగర్ జలాశయాన్ని రూ.36 లక్షల వ్యయంతో నిర్మించారు. 23 అడుగుల్లో 491.37 మెట్రిక్ క్యూబిక్ ఫీట్లు నీరు నిల్వ ఉండేలా సైఫన్లు ఏర్పాటు చేశారు. నీటి మట్టం రాగానే గాలి పీడనంతో ఎవరి ప్రమేయం లేకుండా జలాశయం కవాటాలు తెరుచుకొని 250 HP పీడనంతో నీరు బయటకు వస్తుంది. ఇది ఈ జలాశయం ప్రత్యేకత.

News September 22, 2024

సైబర్ నేరాలపై ఎస్పీ రోహిత్ రాజు సమీక్ష

image

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ప్రభుత్వ నిషేధిత గంజాయి రవాణాను అరికట్టడంలో బాధ్యతగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారుల తీరు ప్రశంసనీయమని చెప్పారు. శనివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన నెలవారి సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

News September 22, 2024

కంది: సెంట్రల్ జైలును తనిఖీ చేసిన జడ్జి

image

కందిలోని సెంట్రల్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ శనివారం అకస్మికంగా తనికి చేశారు. జైలులోని వంటగదిని పరిశీలించి నాణ్యతను చూశారు. జైల్లో ఉన్న ఖైదీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. న్యాయవాది లేనివారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. జైలులో ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

News September 22, 2024

NZB: విద్యుత్ దీపాలతో కాంతులీనుతున్న నాగన్న గారి బావి

image

లింగంపేట్ మండల శివారులోని అతి పురాతన ప్రసిద్ధిగాంచిన నాగన్న గారి మెట్ల బావి శనివారం సాయంత్రం విద్యుత్ దీపాలతో కాంతులీనుతుంది. శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నాగన్న గారి మెట్ల బావి పునరుద్ధరణ పనులు ప్రారంభించడంతో అధికారులు భావి వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు పెద్ద ఎత్తున బావిని సందర్శించారు.

News September 22, 2024

HYDలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు: కమిషనర్

image

గణేశ్ నిమజ్జనం పూర్తయిన నేపథ్యంలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. శనివారం జోనల్ కమిషన్లు, అడిషనల్ కమిషనర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు నగరంలోని వీధుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.

News September 22, 2024

WGL: వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు ప్రణాళికలు సిద్ధం చేయాలి: కలెక్టర్

image

వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌరసరఫరాలు, సహకార, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ, తూనికలు, కొలతల శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 2024-25 వానాకాలం ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలన్నారు.