India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పర్యావరణ పరిరక్షణ కోసం బడ్జెట్లో 10 శాతం నిధులను ‘గ్రీన్ బడ్జెట్’ కింద తప్పనిసరి చేశారు. అంటే దాదాపు రూ.1,000 కోట్లు కేవలం పార్కులు, చెరువుల పునరుద్ధరణ, మొక్కల పెంపకానికే ఖర్చు చేయనున్నారు. నగర సుందరీకరణతో పాటు ఆధునిక శ్మశానవాటికలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చారు. మున్సిపల్ సేవల్లో పూర్తి డిజిటల్ చెల్లింపులను అమలు చేస్తూ అవినీతికి తావు లేకుండా క్లీన్ సిటీగా మార్చడమే బడ్జెట్ లక్ష్యం.

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఫిబ్రవరి 11న 20 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్ట్రాంగ్ రూములను బ్యాలెట్ బాక్స్లను స్టేట్ ఎన్నికల అబ్జర్వర్ పవన్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై సలహాలు సూచనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, మేనేజర్ నాగేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.

కరీంనగర్ సీపీ గౌష్ ఆలంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న అధికారి మతాన్ని ప్రస్తావిస్తూ, మత మార్పిడి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది. ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రెచ్చగొట్టే ధోరణితో చేసిన ఈ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు పోలీసుల నైతిక ధైర్యాన్ని దెబ్బతీస్తాయని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.

27 మున్సిపాలిటీలు కలిశాక మన సిటీ రేంజ్ మారిపోయింది. దీనికి తగ్గట్టే జీహెచ్ఎంసీ రూ.11,460 కోట్లతో భారీ బడ్జెట్ ప్రకటించింది. గత 20 ఏళ్లుగా ఆస్తి పన్ను రేట్లు పెంచకపోయినా ఈసారి పన్నుల రూపంలో రూ.2,245 కోట్లు వస్తాయని బల్దియా అంచనా వేస్తోంది. అప్పుల భారం రూ.4,876 కోట్లు ఉన్నప్పటికీ పక్కా ప్రణాళికతో రూ.2,384 కోట్ల ఆదాయ మిగులును సాధించి అభివృద్ధిలో దూసుకుపోవాలని GHMC నిర్ణయించుకుంది.

విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. శుక్రవారం ఆమె ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, హాస్టళ్ల ఆర్సీఓలు, నిర్వాహకులతో మాట్లాడారు. విద్యార్థులతో ఆప్యాయంగా వ్యవహరిస్తూ, తమ సొంత బిడ్డలుగా వారి సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంక్షేమం కోసం పలు సూచనలు చేశారు.

మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని 13, 14, 15 డివిజన్ల నామినేషన్ల స్వీకరణ కేంద్రంతో పాటు అర్సపల్లి వాటర్ ట్యాంక్ జోన్ ఆఫీసులో ఉన్న కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ తీరును క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. నిబంధనలకు అనుగుణంగా స్వీకరణ ప్రక్రియ జరుగుతోందా లేదా అని ఆరా తీశారు.

18 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాల విషయంలో భద్రతా ప్రమాణాలు కఠినంగా ఉండాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. హైడ్రా కేవలం రెస్క్యూ ఆపరేషన్లకు పరిమితం కాకుండా, NOCల పర్యవేక్షణలోనూ పాత్ర పోషించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి పచ్చజెండా ఊపితే తప్ప ఈ భారీ భవనాలపై నిఘా పెరగదు. ప్రస్తుతం ఉన్న లొసుగులను వాడుకుని నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలకు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం ఎస్పీ డి.జానకి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహబూబ్నగర్ కార్పొరేషన్, భూత్పూర్ మున్సిపాలిటీల్లోని కేంద్రాలను సందర్శించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అభ్యర్థులు, అనుచరులు శాంతియుతంగా సహకరించాలని కోరారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల్లో మూడో రోజు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం పట్టణంలోని గోశాల 27వ వార్డు నుంచి మైనారిటీ మహిళ ఆసియా బేగం బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

అగ్నిమాపక శాఖ నోటీసులు ఇస్తుంది.. కానీ భవనాన్ని సీజ్ చేసే అధికారం మాత్రం లేదు. అటు GHMCకి అధికారం ఉన్నా ఫైర్ సేఫ్టీ అంశం వారి పరిధిలోకి రాదు. దీంతో నిబంధనలు పాటించని బిల్డర్లు పండుగ చేసుకుంటున్నారు. అందుకే GHMC చట్టాన్ని సవరించి 370-4B సెక్షన్లో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫైర్ సేఫ్టీని చేర్చాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ అధికారం వస్తే HYDRAA అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపగలదని అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.