Telangana

News September 2, 2025

గణపతి పూజల్లో ADB జిల్లా అధికారులు

image

ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ప్రతిష్ఠించిన గణనాథుడికి కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, సెకండ్ బెటాలియన్ కమాండెంట్ నీతిక పంత్, డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఎఎస్పీ కాజల్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం మహా అన్నదానం కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

News September 2, 2025

18న రిమ్స్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు

image

ADB రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ నెల 18న రిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని రిమ్స్ డైరెక్టర్ డా.జైసింగ్ రాథోడ్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులు ఇతర వివరాలను rimsadilabad.org వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఆయన పేర్కొన్నారు.

News September 2, 2025

MBNR: జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి- జిల్లా జడ్జి

image

జాతీయ రాష్ట్రన్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 13న జిల్లాలోని అన్ని కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా జడ్జి పాపిరెడ్డి అన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్, ఎలక్ట్రిసిటీ, ప్రీలిటిగేషన్, డబ్బు రికవరీ, కుటుంబ తగాదాలు, బ్యాంక్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఫ్రీ లిటిగేషన్ చెక్‌బౌన్స్ కేసులను రాజీకి వీలున్న కేసులు కక్షిదారులు వినియోగించుకోవలన్నారు.

News September 2, 2025

HYD: ఆలుమగల బీజీ లైఫ్.. ప్లే స్కూల్స్‌కు గిరాకీ

image

హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్లే స్కూల్స్ పెరుగుతున్నాయి. తల్లులు ఉద్యోగాలకు వెళ్లడం, పిల్లల్ని చూసుకోవడం, వేరే చోట పంపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా వీటికి డిమాండ్ పెరిగింది. హైటెక్ సిటీ, మియాపూర్, అమీర్‌పేట్, KPHB లాంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. పని చేసే తల్లిదండ్రులకు ఇవి చాలా సౌకర్యంగా ఉన్నాయి.

News September 2, 2025

HYD: YSRకు మంత్రి సీతక్క నివాళులు

image

మాజీ సీఎం దివంగత డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రజాభవన్‌లో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రజల కోసం వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పేదలకు పెద్దన్నగా నిలిచారని అన్నారు.

News September 2, 2025

మెదక్: డీవైఎస్ఓ దామోదర్ రెడ్డి బదిలీ.. డీఈఓకే బాధ్యత

image

మెదక్ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి దామోదర్ రెడ్డి మేడ్చల్ జిల్లాకు బదిలీ అయ్యారు. గతేడాది జులైలో బదిలీపై రాగా ఇప్పటి వరకు విధులు నిర్వహించారు. దామోదర్ రెడ్డి బదిలీ కాగా జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌కు డీవైఎస్ఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇన్‌ఛార్జ్ మెదక్ డీఈఓగా ఉన్న ప్రొ.రాధాకిషన్ కు డైట్ ప్రిన్సిపల్ బాధ్యతలు అదనంగా అప్పగించారు. తాజాగా డీవైఎస్ఓగా బాధ్యతలు అప్పగించారు.

News September 2, 2025

HYD: KCR, హరీశ్‌రావుకు స్వల్ప ఊరట

image

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. KCR, హరీశ్‌రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిపింది. ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపట్టొద్దని అదేశించింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామని స్పష్టిం చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది.

News September 2, 2025

YSRకి మంత్రి పొన్నం నివాళులు

image

డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ YSR సీఎంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో అపూర్వ సేవలు అందించారని కొనియాడారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు రుణమాఫీ వంటి పథకాలతో పేదలకు పెద్దన్నగా నిలిచారని గుర్తుచేశారు. YSR లేని లోటు కాంగ్రెస్‌కి తీరనిదని కొనియాడారు.

News September 2, 2025

గణేష్ నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా అధికారులు

image

ఖమ్మం కాల్వొడ్డు, మున్నేరు వద్ద గణేష్ నిమజ్జన ఘాట్‌లను మంగళవారం అదనపు కలెక్టర్ శ్రీజ, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పరిశీలించారు. శోభాయాత్ర, నిమజ్జన సమయాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రహదారిపై అడ్డుగా వైర్లు, చెట్టు కొమ్మలు లేకుండా చొరవ తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా క్రేన్లు, ఫ్లడ్ లైట్లు, మార్గాలు, బారికేడింగ్ తదితర అంశాలపై చర్చించారు.

News September 2, 2025

SRSP UPDATE

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు 29 గేట్ల ద్వారా 1.25లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువ నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. 29 వరద గేట్ల నుంచి కాకుండా ఇందిరమ్మ కాల్వ ద్వారా 18 వేలు, కాకతీయ కాల్వ ద్వారా 4500 క్యూసెక్కులు వెరసి మొత్తం 1,51,897 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాగా 1090 (76.894TMC) అడుగులకు నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.