Telangana

News April 15, 2025

NZB : డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన కమిషనర్

image

నాగారంలోని డంపింగ్ యార్డ్ అగ్ని ప్రమాదానికి గురైన నేపథ్యంలో సోమవారం రాత్రి యార్డును నిజామాబాద్​ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. సెక్యూరిటీ తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పొగ కారణంగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది కలుగుతోందని అక్కడి కాలనీవాసులు ఆదివారం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

News April 15, 2025

హైదరాబాద్‌లో భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

HYDలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత వారం KG చికెన్ రూ.200లోపు చేశారు. మంగళవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హోల్‌సేల్ దుకాణాల్లో విత్ స్కిన్ KG రూ.213, స్కిన్‌లెస్ KG రూ.243గా నిర్ణయించారు. రిటైల్ షాపుల్లో రూ.220 నుంచి రూ.250 మధ్యన అమ్ముతున్నారు. ఇటీవల బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గిరాకీ లేక తీవ్రంగా నష్టాలు చవిచూశామని చికెన్ వ్యాపారులు తెలిపారు. ఇక డిమాండ్‌కు తగ్గట్లు ధరలు నిర్ణయించే అవకాశం ఉంది.

News April 15, 2025

HYDలో భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

HYDలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత వారం KG చికెన్ రూ. 200లోపు అమ్మారు. మంగళవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హోల్ సేల్ దుకాణాల్లో విత్ స్కిన్ KG రూ.213, స్కిన్ లెస్ KG రూ.243గా నిర్ణయించారు. రిటైల్ షాపుల్లో రూ.220 నుంచి రూ.250 మధ్యన అమ్ముతున్నారు. ఇటీవల బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గిరాకీ లేక తీవ్రంగా నష్టాలు చవిచూశామని చికెన్ వ్యాపారులు తెలిపారు. ఇక డిమాండ్‌కు తగ్గట్లు ధరలు నిర్ణయించే అవకాశం ఉంది.

News April 15, 2025

మెదక్: వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

image

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. వివరాలు.. సంగారెడ్డి ఓఆర్ఆర్ పై టెంపో వాహనం అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో డ్రైవర్ మాదయ్య మృతి చెందాడు. కొల్లూరులో బైక్‌ను టిప్పర్ ఢీకొట్టడంతో ప్రభాకర్ మృతి చెందగా, పుల్‌కల్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో అల్లాదుర్గం(M)కు చెందిన జర్నయ్య బైక్ పై వస్తూ లారీని ఢీకొట్టి మృతి చెందాడు. కొండపాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా వాసి అనిల్ మృతి చెందాడు.

News April 15, 2025

MBNR: భార్య వదిలిపెట్టిందని ఆత్మహత్య

image

భార్య వదిలిపెట్టి వెళ్లిపోయిందని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న నవాబుపేటలో జరిగింది. పోలీసుల వివరాలు.. మూడేళ్ల క్రితం శంషాబాద్‌లో ఐషా అనే యువతిని నవాబుపేటకు చెందిన తాజ్(30) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు రావటంతో ఐషా భర్తని వదిలి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన తాజ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదైంది.

News April 15, 2025

సంగారెడ్డి: కాపురానికి రమ్మంటే రావడం లేదని హత్య

image

భార్యను భర్త <<16097179>>హత్య చేసిన<<>> ఘటన పటాన్ చెరులో జరిగిన విషయం తెలిసిందే. వివరాలు.. జిన్నారం(M) కిష్టాయిపల్లికి చెందిన సురేశ్‌కు పటాన్ చెరు (M) పెద్ద కంజర్ల వాసి రమీలా(24)తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో రమీలా తల్లి దగ్గరికి వెళ్లింది. కాపురానికి రమ్మంటే రావడం లేదని అత్తగారి ఇంటికి వచ్చిన సురేశ్ భార్యతో గొడవ పడి రోకలి బండతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది.

News April 15, 2025

ఖమ్మం జిల్లాలో రాజీవ్ యువ వికాసానికి భారీగా దరఖాస్తులు

image

రాజీవ్‌ యువ వికాసం పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారం అర్ధరాత్రి ముగిసింది. ఈ పథకం కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 91,816 దరఖాస్తులు వచ్చినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. మీసేవ సెంటర్ల వద్ద దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులతో పాటుగా వరుసగా వచ్చిన సెలవులతోఅభ్యర్థులు చాలావరకు సమస్యలు ఎదుర్కొన్నారు.

News April 15, 2025

HYD: అర్ధనగ్న నృత్యాలు.. 17 మంది యువతులు అరెస్ట్

image

HYDలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చైతన్యపురి వైల్డ్ హార్ట్ క్లబ్‌లో రైడ్స్ చేశారు. సమయానికి మించి పబ్ నడపడం, యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లని ఆకట్టుకునేలా యువతులతో ఇలా చేయించడం గమనార్హం. ముంబై నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మరీ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. మొత్తం 17మంది యువతులు, పబ్ నిర్వాహకుడు, కస్టమర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

News April 15, 2025

HYD: అర్ధనగ్న నృత్యాలు.. 17 మంది యువతులు అరెస్ట్

image

HYDలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చైతన్యపురి వైల్డ్ హార్ట్ క్లబ్‌లో రైడ్స్ చేశారు. సమయానికి మించి పబ్ నడపడం, యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లని ఆకట్టుకునేలా యువతులతో ఇలా చేయించడం గమనార్హం. ముంబై నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మరీ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. మొత్తం 17మంది యువతులు, పబ్ నిర్వాహకుడు, కస్టమర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

News April 15, 2025

పొలంలో బయటపడ్డ పురాతన శివలింగం

image

సూర్యాపేట జిల్లాలో పొలం చదును చేస్తుండగా పురాతన శివలింగం బయటపడింది. చివ్వెంల మండలం తిమ్మాపురంలో రణబోతు బాధిరెడ్డి తన వ్యవసాయ భూమిలో జేసీబీతో చదును చేయిస్తుండగా పురాతన శివలింగంతో పాటు నాగపడిగ విగ్రహాలు జేసీబీకి తగలడంతో వాటిని జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టి శుభ్రం చేశారు. తిమ్మాపురంతో పాటు, మోదీన్‌పురం పరిసర గ్రామాల నుంచి శివభక్తులు అక్కడకు చేరుకుని క్షీరాభిషేకం చేసి పూజలు నిర్వహించారు.

error: Content is protected !!