Telangana

News September 21, 2024

సామాన్య ప్రజలు సంతోషపడేలా పని చేయాలి: పొంగులేటి

image

సామన్య ప్రజలు సంతోషపడేలా రెవెన్యూ శాఖలోని అధికారులు, సిబ్బంది సమిష్టిగా చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రెవెన్యూ శాఖలోని ఐదు సంఘాలతో శనివారం సచివాలయంలో మంత్రి సమావేశం నిర్వహించారు. రెవెన్యూ యంత్రాంగం పాజిటివ్ దృక్పథంతో పని చేస్తూ ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు.

News September 21, 2024

జనగామ: పీఆర్ పెండింగ్ పనులను పూర్తిచేయాలి: కలెక్టర్

image

పంచాయతీరాజ్ శాఖలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను అక్టోబర్ 15 కల్లా పూర్తి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాష ఆదేశించారు. జనగామ కలెక్టరేట్లో స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు ఇంజనీరింగ్ అధికారులతో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలన్నారు.

News September 21, 2024

HYDలో RELAX అంటూ వ్యభిచారం

image

RELAX అంటూ ఆన్‌లైన్‌లో అశ్లీల ఫొటోలు పంపి HYD‌ యువకులను ఆకర్షిస్తున్న వ్యభిచార ముఠా బాగోతం వెలుగుచూసింది. నెల్లూరు వాసి వంశీకృష్ణ, HYDకు చెందిన పార్వతి కలిసి ఈ దందాకు తెరలేపారు. ఆన్‌లైన్‌లో అశ్లీల చిత్రాలు పెట్టి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు రేట్‌ ఫిక్స్ చేసి వ్యభిచారం నిర్వహించారు. నిఘాపెట్టిన CYB AHTUకి వీరికి చెక్ పెట్టింది. గతంలోనూ వీరు ప్రాస్టిట్యూషన్‌ కేసులో అరెస్ట్ అయ్యారు.

News September 21, 2024

HYDలో RELAX అంటూ వ్యభిచారం

image

RELAX అంటూ ఆన్‌లైన్‌లో అశ్లీల ఫొటోలు పంపి HYD‌ యువకులను ఆకర్షిస్తున్న వ్యభిచార ముఠా బాగోతం వెలుగుచూసింది. నెల్లూరు వాసి వంశీకృష్ణ, HYDకు చెందిన పార్వతి కలిసి ఈ దందాకు తెరలేపారు. ఆన్‌లైన్‌లో అశ్లీల చిత్రాలు పెట్టి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు రేట్‌ ఫిక్స్ చేసి వ్యభిచారం నిర్వహించారు. నిఘాపెట్టిన CYB AHTUకి వీరికి చెక్ పెట్టింది. గతంలోనూ వీరు ప్రాస్టిట్యూషన్‌ కేసులో అరెస్ట్ అయ్యారు.

News September 21, 2024

WGL: అండర్-19 జిల్లా జట్టు ఎంపిక

image

ఉమ్మడి వరంగల్ అండర్-19 జిల్లా జట్టు ఎంపిక పోటీలను ఈనెల 22, 23వ తేదీల్లో సికేఎం కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్నారు. 2005 సెప్టెంబర్-1 తరువాత జన్మించిన ఔత్సాహిక క్రికెట్ క్రీడాకారులు క్రికెట్ యూనిఫాం, స్వంత కిట్, ఇతర పత్రాలతో హాజరుకావాలని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ కోరారు.

News September 21, 2024

గాంధారి: ఇంట్లో భారీ చోరీ

image

గాంధారి మండలంలోని కమ్మరిగల్లీకి చెందిన కుమ్మరి రంజిత్ ఇంట్లో చోరీ జరిగింది. రంజిత్ కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి గురువారం వేములవాడకు వెళ్లి శుక్రవారం వచ్చారు. కాగా అప్పటికి ఇంటి తలుపులు తీసి ఉన్నట్లు, బీరువాలోని 7 తులాల బంగారం, నగదు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపాడు. ఈ మేరకు సీఐ సంతోష్ కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

News September 21, 2024

MBNR: బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే యెన్నం ఫైర్

image

BRSపై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. BRS పార్టీ ఇప్పటికే నాలుగు ముక్కలుగా విడిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. PAC ఛైర్మన్ పదవికి నలుగురిలో అరెకపూడి ఎవరు నామినేషన్ వేయించారో చెప్పాలన్నారు. పీఏసీ ఔన్నత్యాన్ని తగ్గించేందుకు గులాబీ పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అరెకపూడి గాంధీ పీఏసీ ఛైర్మన్ అవ్వడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని ఫైర్ అయ్యారు.

News September 21, 2024

కరీంనగర్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్తంభించిన మీసేవా సేవలు

image

పదిరోజుల నుంచి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మీసేవా సేవలు నిలిచిపోయాయి. దీంతో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సిన వారికి సకాలంలో సర్టిఫికెట్లు లభించక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర డేటా సెంటర్లో సాంకేతిక సమస్య కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్తున్నారు.

News September 21, 2024

తెలంగాణ ఉద్యమంలో బాపూజీ పాత్ర ఎనలేనిది: మాజీ మంత్రి

image

తొలి దశ, మలిదశ తెలంగాణ ఉద్యమాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర ఎనలేనిదని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చేసిన ఉపన్యాసాల పట్ల ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యారని వెల్లడించారు.

News September 21, 2024

కొత్తపల్లి: రైల్వే లైన్ పనులకు రూ.137 కోట్లు

image

కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పనుల కోసం ప్రభుత్వం రూ.137 కోట్లు విడుదల చేసింది. అలాగే కొత్తపల్లి నుంచి వేములవాడ మధ్యలో ట్రాక్ నిర్మాణానికి కావాల్సిన భూసేకరణకు కరీంనగర్ జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ విడుదల చేయడం శుభపరిణామం. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2025 మార్చి నాటికి పూర్తి చేయా లని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ.. ఈ వేగంతో పనులు ఇప్పట్లో అయ్యేలా కనిపించడం లేదు.