India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ బలోపేతానికి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని నూతన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్, ఇతర నేతలు నూతన అధ్యక్షుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్కు చెందిన లచ్చిరాం- నిర్మల దంపతుల కుమారుడు మూడు అజయ్ పేదరికం జయించి ఎస్సై ఉద్యోగం సాధించాడు. వారి తల్లిదండ్రులు వారికున్న రెండు ఎకరాల భూమిని సాగు చేస్తూ అజయ్ను HYDలో ఉన్నత చదువులు చదివించారు. మొదటగా అజయ్ రైల్వేలో ఉద్యోగం సాధించాడు. ఆ ఉద్యోగం చేస్తూనే ఎస్సై జాబ్కు ప్రిపేర్ అయ్యాడు. ఎస్సై ఉద్యోగం సాధించిన అజయ్ని గ్రామస్థులు అభినందించారు
స్వాతంత్ర్య సమరయోధుడు, స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది, నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త, తెలంగాణ సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం కొండా లక్ష్మణ్ బాపూజీ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. బాపూజీ వర్ధంతి సందర్భంగా హరీశ్రావు నివాళులర్పించారు.
బెంగళూరులో నిర్వహించిన ఇండియన్ ఆర్థోడాంటిస్ట్ కాన్ఫరెన్స్కు ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి హాజరయ్యారు. దేశంలోనే తొలి ఆర్థోడాంటిస్ట్ ఎమ్మెల్యే కుచుకూళ్లను కౌన్సిల్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప స్థానంలో ఉంచినందుకు నాగర్ కర్నూల్ ప్రజలకు, తనను గుర్తించి గౌరవ సత్కారం చేసినందుకు కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు శుక్రవారం జీహెచ్ఎంసీ స్టడీ టూర్కి వెళ్లారు. స్టడీ టూర్లో భాగంగా ఇండోర్, లక్నో ప్రాంతాలకు వెళ్లి అక్కడ పలు విషయాలపై అధ్యయనం చేయనున్నారు. ఆయా మెట్రో నగరాల్లో కొనసాగుతున్న చేపట్టిన పలు వివిధ విధానాలను, అంశాలను పరిశీలించనున్నారు. అనంతరం వాటిని గ్రేటర్ పరిధిలో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు శుక్రవారం జీహెచ్ఎంసీ స్టడీ టూర్కి వెళ్లారు. స్టడీ టూర్లో భాగంగా ఇండోర్, లక్నో ప్రాంతాలకు వెళ్లి అక్కడ పలు విషయాలపై అధ్యయనం చేయనున్నారు. ఆయా మెట్రో నగరాల్లో కొనసాగుతున్న చేపట్టిన పలు వివిధ విధానాలను, అంశాలను పరిశీలించనున్నారు. అనంతరం వాటిని గ్రేటర్ పరిధిలో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.
నూతన విద్యుత్ కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అధికారులను హెచ్చరించారు. ఉన్నతాధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతివారం అధికారులు ఒకరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి వినియోగదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో చేపట్టిన పనులు డిసెంబర్ నాటికి వందశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నూతన విద్యుత్ కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అధికారులను హెచ్చరించారు. ఉన్నతాధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతివారం అధికారులు ఒకరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి వినియోగదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో చేపట్టిన పనులు డిసెంబర్ నాటికి వందశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హైదరాబాద్-నాగపూర్ కారిడార్లోని 251KM హైవేను NHAI సంస్థ, హైవే ఇన్ఫ్రా స్ట్రక్చర్ ట్రస్ట్కు టోల్-ఆపరేట్- ట్రాన్స్ఫర్ (TOT) మోడల్లో రూ.6,661 కోట్లకు కేటాయించినట్లుగా తెలిపింది. HYD నగరం నుంచి నాగపూర్, నాగపూర్ నుంచి HYD వెళ్లే వాహనదారుల నుంచి TOT మోడల్లో టోల్ ఛార్జీలను వసూలు చేస్తారని అధికారులు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దోమకొండ అంబర్పేట్కి చెందిన వీణ (23), కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి (24) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోరని భావించిన సాయి ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వీణ సైతం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.