India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
∆}మధిరలో జాబ్ మేళా∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
ఆదిలాబాద్ జిల్లాలో గతంలో రెన్యూవల్ కాని 3 బార్ల నోటిఫికేషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ADB ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రేండ్ల విజేందర్ పేర్కొన్నారు. ఆసక్తి గల వారు అప్లికేషన్ ఫారమ్తో పాటు రూ.లక్ష డీడీ, చలాన్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి పేరున చెల్లించి, ఈనెల 26 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు 8712658771 నంబర్ను సంప్రదించాలని కోరారు.
అరెకరం భూమి, పెన్షన్ డబ్బుల కోసం సొంత మరదలిని వదిన హత్య చేసిన ఘటన NZB జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్లో వెలుగు చూసింది. ఈ ఘటన ఈ నెల3న చోటు చేసుకోగా పోలీసుల విచారణలో సొంత వదిన అనసూయ, మరో వ్యక్తి రాకేశ్ హత్యకు పాల్పడినట్లు తేలింది. పురుమెటి లక్ష్మీ మానసిక దివ్యాంగురాలు తన తల్లిదండ్రులు ఇచ్చిన అరెకరం తన పేరుమీద పట్టా చేయమనడంతో వదిన ఈ ఘాతుకానికి పాల్పడింది. పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు.
బట్టల వ్యాపారం చేయడానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. UPకి చెందిన బాబుల్ సింగ్(23 కొంతకాలంగా రామాయంపేటలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 18న బోడ్మట్పల్లిలో బట్టల వ్యాపారం కోసం వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతని బావ గజేందర్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లో రోజు రోజుకూ ఎండలు ఎక్కువవుతున్నాయి. HYD, MDCLలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల వరకు నమోదవుతోంది. మధ్యాహ్నం వరకు ఎండ కొడుతుండగా, సాయంత్రం వర్షం పడుతోంది. ఉదయం 7 గంటల నుంచే వేడిమి అధికంగా ఉంటుంది. నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్లో రోజు రోజుకూ ఎండలు ఎక్కువవుతున్నాయి. HYD, MDCLలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల వరకు నమోదవుతోంది. మధ్యాహ్నం వరకు ఎండ కొడుతుండగా, సాయంత్రం వర్షం పడుతోంది. ఉదయం 7 గంటల నుంచే వేడిమి అధికంగా ఉంటుంది. నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నేలకొండపల్లి(M)శంకరగిరి తండాలో<<16160491>> యవకుడు సూసైడ్ <<>>చేసుకున్న విషయం తెలిసిందే. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన ధరావత్ రాజు(24) 2 రోజుల కింద ఖరీదైన ఫోన్ కొన్నాడు. ఏ పని చేయకుండా అంత ఖరీదైన ఫోన్ ఎందుకు కొన్నావని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన రాజు పురుగుందు తాగాడు. ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
ఖమ్మం జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఆదివారం చింతకాని, ముదిగొండ (పమ్మి), (బాణాపురం)లో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అటు కారేపల్లి, కామేపల్లి(లింగాల), వైరాలో 42.7, ఎర్రుపాలెం 42.6, కూసుమంచి 42.1, మధిర 42.0, పెనుబల్లి, నేలకొండపల్లి 41.7, రఘునాథపాలెం 41.6, ఖమ్మం (U) 41.4, ఖమ్మం (R) పల్లెగూడెం, తిరుమలాయపాలెం (బచ్చోడు) 41.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ADB తెలంగాణ కశ్మీర్గా ప్రసిద్ధి. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఇక్కడ ఎండా, వాన, చలి అన్నీ ఎక్కువే. అంతేకాదండోయ్.. ఎన్నో భాషలకు పుట్టినిల్లు కూడా. తెలుగు ప్రజలు అధికంగా ఉన్నా ఉర్దూ, హిందీ మాట్లాడుతారు. MHకి సరిహద్దులో ఉండడంతో మరాఠీ, ఆదివాసీల గోండు, కొలాం, గిరిజనుల లంబాడీ, మథుర భాషలు ప్రత్యేకం. అందరూ కలిసి ఉండడంతో ఒక భాషలో పదాలు మరో భాషలో విరివిరిగా ఉపయోగిస్తుంటారు. మీదే భాషనో కామెంట్ చేయండి.
చిట్యాల (M) ఉరుమడ్ల ZPHSలో 1998-99 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత దాదాపు 50 మంది ఒకేచోట చేరి గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులను సన్మానించారు. వేముల వెంకటేశం, కోనేటి యాదగిరి, పానుగుల్ల నరసింహ, కృష్ణ, యానాల సుధ, చంద్రకళ పాల్గొన్నారు. మీ స్నేహితులతో మీరేప్పుడు ప్లాన్ చేస్తున్నారో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.