Telangana

News May 7, 2025

NZB: రాహుల్ గాంధీకి MLC కవిత సెటైరికల్ WELCOME

image

రాహుల్ గాంధీ హైదరాబాద్ రాకను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత Xలో ఎద్దేవా చేశారు. “దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం..” అంటూ పేర్కొన్నారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసగించారన్నారు. హైదరాబాద్ పర్యటనలో లాఠీ దెబ్బలు తిన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను రాహుల్ గాంధీ పరామర్శించాలని డిమాండ్ చేశారు. అలాగే పలు ప్రశ్నలు సంధించారు.

News May 7, 2025

నేడు ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డే

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం 108వ స్థాపనా దినోత్సవాన్ని వేడుకలు ఇవాళ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో MLC ప్రొ.కోదండరాం, మాజీ ఎంపీ K.కేశవరావు, సీపీ CV ఆనంద్, గాయకుడు అందెశ్రీ, వీసీ ప్రొ.కుమార్ మోలుగారం పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.

News May 7, 2025

మెదక్: రేపే మోడల్ స్కూల్ పరీక్ష

image

మెదక్ జిల్లాలో ఈనెల 27న ఆదివారం నిర్వహించే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని DEO రాధా కిషన్ తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ఈ స్కూళ్లలో కార్పొరేట్‌కు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని, ఈ అవకశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -SAHRE IT

News May 7, 2025

జిల్లాలో ముగిసిన ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

నల్గొండ జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా ఈనెల 20న ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే ఈనెల 24న మిర్యాలగూడలోని ఒక పరీక్ష కేంద్రంలో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పట్టుకొని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే.

News May 7, 2025

వరంగల్: వేర్వేరు కారణాలతో ముగ్గురు సూసైడ్

image

వేర్వేరు కారణాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాళ్లోకి వెళ్తే.. గుంటూరు(ఏపీ)కు చెందిన హర్షియాబేగం(28) ఆర్థిక ఇబ్బందులతో నర్సంపేటలో ఆత్మహత్య చేసుకుంది. కేసముద్రం(MHBD)కి చెందిన రమేశ్(36) కుటుంబ కలహాలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తు తెలియని ఓ వృద్ధురాలు(65-70) వరంగల్ రైల్వేస్టేషన్ యార్డులో రైలు కిందపడి సూసైడ్ చేసుకుంది.

News May 7, 2025

MBNR: ‘మే 3 నుంచి వేసవి శిబిరం ప్రారంభం’

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సుద్దాల హనుమంతు సంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని మే 3 నుంచి ప్రారంభించనున్నామని నిర్వాహకుడు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొనే విద్యార్థులు పదేళ్లు దాటిన వారికి వివిధ విభాగాల్లో శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

News May 7, 2025

HYDలో 3 ప్రాంతాల్లో వ్యభిచారం.. అరెస్ట్

image

HYDలో‌ వ్యభిచార స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత 48 గంటల్లో 3 చోట్ల ఈ ముఠాలకు చెక్ పెట్టారు. గురువారం బంజారాహిల్స్‌లో ఇద్దరు యువతులతో విటులు పట్టుబడ్డారు. శుక్రవారం లాలాగూడలో వ్యభిచారం చేయిస్తూ ఉగండా దేశస్థులు చిక్కారు. శ్రీనగర్‌కాలనీలోని ఓ స్పా సెంటర్‌లో తనిఖీ చేయగా ఆరుగురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News May 7, 2025

కరీంనగర్ కొత్తపల్లి చెరువులో మృతదేహం 

image

కరీంనగర్ కొత్తపల్లి చెరువులో గుర్తుతెలియని మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతుడు కొత్తపల్లికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 7, 2025

ఖమ్మంలో మళ్లీ తగ్గుతున్న టమాటా ధరలు

image

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ (VDO’Sకాలనీ)లో శనివారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాటా రూ.18, వంకాయ 20, బెండకాయ 20, పచ్చిమిర్చి 40, కాకర 46, కంచకాకర 50, బీరకాయ 50, సొరకాయ 16, దొండకాయ 18, క్యాబేజీ 20, చిక్కుడు 66, ఆలుగడ్డ 26, చామగడ్డ 40, క్యారెట్ 30, బీట్రూట్ 24, బీన్స్ 66, క్యాప్సికం 50, ఉల్లిగడ్డలు 25, కోడిగుడ్లు(12) రూ.65గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత పేర్కొన్నారు.

News May 7, 2025

NLG: పనితీరు ఆధారంగా అంగన్వాడీలకు ఇక గ్రేడింగ్!

image

 NLGజిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు ఇక నుంచి మొక్కుబడిగా నిర్వహించకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారులు కేంద్రాలకు వచ్చి పోవడంతోనే సరిపెట్టకుండా వారికి ఆటాపాట నేర్పించాలనే దానిపై దృష్టి పెట్టింది. అందుకే కేంద్రాల పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క చెప్పిన విషయం తెలిసిందే. మంచి గ్రేడింగ్ ఉన్న కేంద్రాలకు అవార్డులను సైతం ఇవ్వనున్నారు.