Telangana

News September 2, 2025

HYDలో మహిళలు సేఫ్.. కానీ సూటిపోటి మాటలే!

image

మహిళా భద్రతపై జాతీయ వార్షిక నివేదిక నారీ సూచీ HYDలో మహిళలకు సురక్షిత వాతావరణం నెలకొన్నట్లు తెలిపింది. అయితే.. ఎక్కువగా సూటిపోటి మాటలతో వేధింపులకు గురైనట్లు 65% మంది మహిళలు పేర్కొన్నారు. 23% మంది భౌతిక వేధింపులు, 5% మంది మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్లు సర్వేలో వెళ్లడైంది. రవాణాలో 33%, ఆహ్లాదకరమైన ప్రదేశాల్లోనూ 12 మంది వేధింపులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది.

News September 2, 2025

MDK: ‘స్థానిక ఎన్నికలు.. గ్రామాల్లో ముచ్చట్లు’

image

ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించేదుకు ముందుకు వెళ్తుంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తుది జాబితా విడుదల చేసింది. 9న అభ్యంతరాల స్వీకారణ, 10న తుది జాబితా తర్వాత సర్పచ్ ఎన్నికలు నిర్వహించనుంది. జిల్లా వ్యాప్తంగా 21 మండలలు, 492 గ్రామ పంచాయతీలు, 5,23,327 ఓటర్లు, 190 ఎంపీటీసీ, 21 జడ్పీటీసీలు, బూత్‌లు 1052 ఉన్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూపిన ఎన్నికలపై ముచ్చటిస్తున్నారు.

News September 2, 2025

NZB: ‘లోకల్’ దంగల్..!

image

స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. జిల్లాలోని NZB, BDN, ARMR డివిజన్లలోని 31 మండలాల్లో ఉన్న 545 GPలు, 5,022 వార్డులు, 5,053 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 4,54,621 మంది, పురుషులు 3,96,778 మంది, ఇతరులు 18 మంది ఉన్నారు. బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి.

News September 2, 2025

MDK: CEIR ద్వారా 1264 ఫోన్లు స్వాధీనం: ఎస్పీ

image

CEIR పోర్టల్ ద్వారా రూ.25 లక్షల విలువగల 167 మొబైల్ ఫోన్లు రికవరి చేసి బాధితులకు ఎస్పీ డీవీ శ్రీనివాస రావు అందజేశారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రూ.1.89 కోట్ల విలువ గల మొత్తం 1264 ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా బాధితులు తమ ఫోన్లు తిరిగి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. ఏఎస్పీ మహేందర్ ఉన్నారు.

News September 2, 2025

అంచనాలు రూపొందించి సమర్పించాలి : కలెక్టర్

image

ఇటీవల కురిసిన భారీ వర్షాలు వల్ల దెబ్బతిన్న రహదారులకు సంబంధించి అంచనాలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి R&B అధికారులను ఆదేశించారు. సోమవారం CM రేవంత్ రెడ్డి HYD నుంచి వర్షాలు, వరద నష్టాలపై కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇటీవల భారీ వర్షాలకు R&B రహదారులు దెబ్బతిన్నాయని కలెక్టర్ వివరించారు.

News September 2, 2025

డిజిటల్ మార్కెటింగ్ ఈ కామర్స్‌పై అవగాహన కల్పిస్తాం: HYD కలెక్టర్

image

HYD జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఉత్పత్తిదారులకు (MSME) డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్ (ఆన్‌లైన్) పై అవగాహన కల్పిస్తామని జిల్లా కలెక్టర్ హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న మధ్యాహ్నం 2 గంటలకు HYD కలెక్టరేట్‌లో పరిశ్రమల శాఖాధికారులు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, అలాగే బ్యాంకు అధికారుల ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ద్వారా విక్రయ విధానంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.

News September 2, 2025

ప్రజలు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: HYD కలెక్టర్

image

ప్రజలు ప్రజావాణిలో అందించిన అర్జీలపై సత్వరమే అధికారులు స్పందించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హ‌రిచంద‌న దాసరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్లు ముకుంద రెడ్డి, క‌దిర‌వ‌న్ ప‌ళని, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారితో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

News September 2, 2025

ADB: కరెంట్ వైర్లు కిందకు ఉన్నాయా..?

image

జిల్లాలో 1,378 మండపాల్లో వినాయకులు కొలువై ఉన్నారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో ఎక్కువగా 7, 9 రోజుల్లో నిమజ్జనాలు చేపడతారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులకు విద్యుత్ అధికారులు కీలక సూచనలు చేశారు. శోభాయాత్ర మార్గంలో కేబుల్, విద్యుత్తు తీగలు లూస్ లేదా కిందకి వేలాడుతూ ఉంటే స్థానిక విద్యుత్ అధికారులకు తెలియజేస్తే వాటిని సరిచేయడం లేదా తొలగించడం చేస్తారన్నారు. విద్యుత్తు తీగల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు.

News September 2, 2025

మెదక్: ‘నష్టం అంచనాలను వెంటనే అందజేయాలి’

image

భారీ వర్షాలు, వరద సహాయం పై సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేశ్ వీసీలో పాల్గొన్నారు. వరద నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని, నష్టం అంచనాలను అధికారులు త్వరిత గతిన అందజేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు.

News September 1, 2025

కరీంనగర్: ప్రజావాణికి 269 దరఖాస్తులు

image

KNR కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 269 మంది అర్జీదారులు దరఖాస్తులు సమర్పించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలోని అన్ని పెండింగ్ దరఖాస్తులను వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు.