India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలని, భూసేకరణ నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఆదివారం ఎర్రమంజిల్లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శాఖ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి NZB జిల్లాకు చెందిన రిజర్వాయర్, ప్రాజెక్టుల పెండింగ్ పనులు, మరమ్మత్తులపై మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాద్ శాఖ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఎం.నాగేందర్, ప్రధాన కార్యదర్శిగా లింగన్న, కోశాధికారిగా టి.నారాయణతో పాటు గౌరవ అధ్యక్షులుగా 4, ఉపాధ్యక్షులుగా 3, సంయుక్త కార్యదర్శులుగా 4, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా 4, ఈసీ సభ్యులుగా 8, సలహదారులుగా 12 మందిని నియమించారు. న్యాయ సలహాదారుగా Rtd DSP మనోహర్ను ఎన్నుకున్నారు.
ఖమ్మం: మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో సెలవుల్లో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
కొడంగల్ నియోజకవర్గంలోని భూనీడ్లో సోమవారం జరిగే అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొంటారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. అనంతరం తిమ్మిరెడ్డిపల్లిలో జరిగే సద్గురు సంత్ గురులోకమసంద్ మహరాజ్ బావోజీ జాతర బ్రహ్మోత్సవంలో పాల్గొంటారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు రావాలని కోరారు.
బాలానగర్లో RTC బస్ కింద పడి ఓ బైకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు AP కొనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు(బాబ్జీ)గా పోలీసులు గుర్తించారు. రన్నింగ్లో ఉన్న వెహికిల్ను ఆపే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని లాగారని PSలో మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాలానగర్లో RTC బస్ కింద పడి ఓ బైకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు AP కొనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు(బాబ్జీ)గా పోలీసులు గుర్తించారు. రన్నింగ్లో ఉన్న వెహికిల్ను ఆపే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని లాగారని PSలో మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో నందిపేట్కు చెందిన శ్రీను(48) ఆదివారం మృతి చెందారు. స్థానికులు వివరాల ప్రకారం.. మృతుడు చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కమ్మర్పల్లి గురుకుల పాఠశాలలో చికెన్ సప్లై చేసేందుకు కారులో వెళ్తున్న క్రమంలో ఉప్లూరు వద్ద ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. తలకు గాయాలవడంతో మృతి చెందాడు.
అమీర్పేట్లో ఆదివారం నిర్వహించిన బైసాఖీ వేడుకల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. సిక్కు సోదరులు ఈ సందర్భంగా కవితకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ అన్ని కులాలు, మతాల వారు కలిసి మెలిసి సోదరభావంతో జీవించే రాష్ట్రమన్నారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్లో సిక్కు ఫౌండేషన్ కోసం భూమి కేటాయించామన్నారు.
క్షేత్రస్థాయిలో జాతీయ ఆహార భద్రత చట్టం- 2013 అమలు పరిశీలన నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్, సభ్యులు ఈనెల 15న కొండమల్లేపల్లి, దేవరకొండ మండలాలలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రాష్ట్ర ఆహార కమిషన్ ఒకరోజు పర్యటనలో భాగంగా ఆరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రెండు మండలాల్లో ఆహార భద్రత చట్టం అమలుతీరును పరిశీలిస్తారన్నారు.
సిక్కుల పవిత్ర బైసాఖి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక పాముల బస్తిలోని ఫతేపూర్ గురుద్వారా సాహెబ్లో గురుద్వారా కమిటీ సభ్యులు వివిధ భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పేరుతో తయారు చేయించిన సిక్కుల పవిత్ర తల్వార్ను ప్రతినిధి దర్శన్ సింగ్ సోఖీ కమిటీ సభ్యులతో కలిసి బహూకరించారు.
Sorry, no posts matched your criteria.