Telangana

News September 1, 2025

HYD: 9 రోజులుగా దొరకని అవయవాలు

image

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్‌లో గత నెల 24న భర్త హత్య చేసి, ముక్కలుగా మార్చి మూసీలో పడేసిన స్వాతి అవయవాలు ఇప్పటికీ లభించలేదు. 9 రోజులుగా DRF, హైడ్రా బృందాలు ప్రతాపసింగారం మూసీ వంతెన వద్ద జల్లెడ పట్టినా ఫలితం శూన్యమైంది. మూసీలో ఎక్కడా ఆనవాళ్లు కనిపించకపోవడంతో దర్యాప్తు మరింత క్లిష్టమైంది. గాలింపు యత్నాలు ఫలించకపోవడంతో కేసు సవాలు అవుతోంది.

News September 1, 2025

HYD: బీజేపీ నాటకంలో రేవంత్ రెడ్డి కీలుబొమ్మ: BRS MLA

image

బీజేపీ ఆడిస్తున్న నాటకంలో సీఎం రేవంత్ రెడ్డి కీలుబొమ్మగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని కుత్బుల్లాపూర్ BRS ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడం, రేవంత్ రెడ్డి చేసే పనితీరు తదితర విషయాలన్నీ గమనిస్తే ఇది తేటతెల్లమవుతున్నట్లుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు.

News September 1, 2025

HYD వ్యాప్తంగా ఆర్టీసీ కార్గో సర్వీస్ హోమ్ డెలివరీ

image

HYD వ్యాప్తంగా ఆర్టీసీ కార్గో సర్వీస్ హోమ్ డెలివరీ చేస్తున్నట్లుగా రాష్ట్ర IPRD తెలిపింది. కేజీ వరకు బరువు కలిగిన పార్సెల్ రూ.50కు మాత్రమే HYD వ్యాప్తంగా డెలివరీ చేస్తున్నట్లుగా వివరించింది. ఆర్టీసీ కార్గో హోమ్ డెలివరీ సంబంధించి ఆర్టీసీ వెబ్‌సైట్, ఆర్టీసీ కార్గో సర్వీస్ సెంటర్లను సందర్శిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు.

News September 1, 2025

గణేశ్ మండపాలను సందర్శించిన ADB ఎస్పీ

image

పోలీసు ప్రజల సత్సంబంధాలు మెరుగుపరచడానికి పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టణంలోని పలు ప్రధాన గణపతి మండపాలను ఎస్పీ ప్రత్యేకంగా దర్శించి పూజా కార్యక్రమాల నిర్వహించి గణనాథుని సేవలో పాల్గొన్నారు. మండప కమిటీ సభ్యులతో నేరుగా మాట్లాడి నిమజ్జనాన్ని సరైన సమయంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు.

News September 1, 2025

మహిళల భద్రతకై రక్షణక ADB షీ టీం

image

మహిళల భద్రతకై రక్షణకు ఆదిలాబాద్ జిల్లా షీ టీం బృందం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో రాత్రి సమయాల్లో ఆకతాయిలు అల్లరి చేస్తూ మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏప్రిల్ నెలలో షీ టీం బృందాల ద్వారా 3 ఎఫ్ఐఆర్ కేసులు, 18 ఈ పెట్టీ కేసుల నమోదు చేసిందని పేర్కొన్నారు.

News September 1, 2025

HYD: బీబీనగర్ AIIMS నిర్మాణం 84% పూర్తి

image

HYD శివారు బీబీనగర్ AIIMS హెల్త్ కేర్ ఫెసిలిటీ పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 84% నిర్మాణం పూర్తయినట్లుగా పేర్కొన్నారు. రూ.1365.95 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయని సోమవారం వివరించారు. ఈ ఆసుపత్రిలో మొత్తం 33 విభాగాలు పనిచేస్తాయన్నారు.

News September 1, 2025

HYD: మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం HYD మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ వద్ద సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. 46,000 ట్యాంకుల్లో చేపల పెంపకం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.122 కోట్లు విడుదల చేసినట్లుగా తెలిపారు. మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లుగా చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యమన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి, మెట్టు సాయి ఉన్నారు.

News September 1, 2025

HYD: బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతుంది: తీన్మార్ మల్లన్న

image

బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. HYD శాసనమండలి వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆనాడు కేసీఆర్ 34 శాతం బీసీలకు రిజర్వేషన్ తేవాలని చూస్తే, గోపాల్ రెడ్డి అనే వ్యక్తి కేసు వేసి ఆపాడని, నేడు మరో గోపాల్ రెడ్డి పుట్టాడా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంశాలు అమలు చేయాలన్నారు.

News September 1, 2025

కరీంనగర్ ముదిరాజ్ సమస్యలపై నీలం మధుతో సమావేశం

image

హైదరాబాద్ పటాన్‌చెరులోని నీలం మధు నివాసంలో కరీంనగర్ జిల్లా TMPS నాయకులు ఆయనను కలిశారు. కూనచల మహేందర్, కీసర సంపత్, పెసరు కుమారస్వామి, అరిగే ప్రభాకర్, జోడు బాలరాజు, భూమ ప్రవీణ్ పాల్గొన్న ఈ సమావేశంలో ముదిరాజ్ సమాజ సమస్యలు, సంక్షేమం, రాజకీయ అభివృద్ధిపై చర్చించారు. సమాజ అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

News September 1, 2025

HYD: హైడ్రా ప్రజావాణికి 43 ఫిర్యాదులు

image

HYD బుద్ధభవన్‌లో సోమవారం హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. హైడ్రా ప్రజావాణికి 43 ఫిర్యాదులు అందాయన్నారు. వర్షాకాలం వరద ముప్పుపై ఫిర్యాదులు, కాలువల ఆటంకాలు తొలగించాలంటూ వినతులు చేశారన్నారు. సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలను అప్పగించినట్లు పేర్కొన్నారు.